మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత
సికింద్రాబాద్, మే30 (ప్రజామంటలు) :
మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, బంధువు టి.రవీందర్ రెడ్డి (74) శుక్రవారం మద్యాహ్నం కన్నుమూశారు. గత ఫిబ్రవరి 3 న ఉదయం కోకాపేట లోని తన ఇంటి నుంచి బేగంపేట బీజేపీ కార్యాలయానికి వస్తుండగా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. అప్పటి నుంచి మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రవీందర్ రెడ్డి శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. రవీందర్ రెడ్డి మృతిపట్ల మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి , మర్రి పురూరవరెడ్డి లు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి సనత్ నగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసినప్పుడు మర్రి శశిధర్ రెడ్డి తో కలసి రవీందర్ రెడ్డి ఎన్నికల్లో చురుకుగా పనిచేసి చెన్నారెడ్డి విజయంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సనత్ నగర్ పార్టీ కార్యాలయ ఇంచార్జీగా ప్రజలకు అవిశ్రాంతంగా సేవ చేస్తూ, దాదాపు 40 ఏండ్ల నుంచి తనతో అనుబంధం ఉందన్నారు. రవీందర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవీందర్ రెడ్డి అంత్యక్రియలు శనివారం మద్యాహ్నం జూబ్లీ హిల్స్ మహాప్రస్తానంలో జరుగుతాయని బీజేపీ నాయకులు తెలిపారు.
––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం
