కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన
కాళ్లకు హీట్ ప్యాడ్స్ పెడితే చర్మం ఊడి వచ్చింది
సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు
సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):
కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేటలో నివసిస్తున్న సంధ్య(26) అనే మహిళ ఈనెల 22వ తేదీన అంకుర్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరింది.
అదే రోజు డాక్టర్స్ సిజేరియన్ చేస్తే ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత సంధ్యను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఈమె చలి ఎక్కువగా ఉందని చెప్పటంతో రెండు కాళ్లకు సిబ్బంది హీట్ ప్యాడ్స్ కట్టారు. ఆ తర్వాత ఈ విషయం మర్చిపోయారు. అరగంట తర్వాత బాధితురాలికి మత్తు వదిలి కేకలు పెట్టటంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్లు బొబ్బలు ఎక్కి, చర్మం ఊడిపోయింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేషంట్ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది , యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం
