కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన
కాళ్లకు హీట్ ప్యాడ్స్ పెడితే చర్మం ఊడి వచ్చింది
సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు
సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):
కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేటలో నివసిస్తున్న సంధ్య(26) అనే మహిళ ఈనెల 22వ తేదీన అంకుర్ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరింది.
అదే రోజు డాక్టర్స్ సిజేరియన్ చేస్తే ట్విన్స్ పుట్టారు. ఆ తర్వాత సంధ్యను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఈమె చలి ఎక్కువగా ఉందని చెప్పటంతో రెండు కాళ్లకు సిబ్బంది హీట్ ప్యాడ్స్ కట్టారు. ఆ తర్వాత ఈ విషయం మర్చిపోయారు. అరగంట తర్వాత బాధితురాలికి మత్తు వదిలి కేకలు పెట్టటంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్లు బొబ్బలు ఎక్కి, చర్మం ఊడిపోయింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేషంట్ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది , యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
