చదువుతోనే బంగారు భవిష్యత్తు. వాల్మీకి ఆవాస విద్యార్థులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి.
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సోమవారం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు.బాల్యం నుండే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే ఆశయంతో పనిచేస్తున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ గంప కరుణాకర్ మనుమరాలు యష్ణశ్రీ జన్మదినం సందర్భంగా 65 మంది ఆవాస విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకులు డాక్టర్ భీమనాతిని శంకర్, నందెల్లి మదన్ మోహన్ రావు, కైలాసం, అశోకరావు, సంపూర్ణ చారి, మధుకర్, నరసింగరావు, సత్యం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
