ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం
మైనర్ల చేతి వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచన - ముల్కనూర్ ఎస్సై సాయిబాబు
భీమదేవరపల్లి జూన్ 3 (ప్రజామంటలు) :
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు కొత్త చట్టాలు, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి మత్తు పదార్థాల భయంకర ప్రభావం గురించి వివరించారు. యువత ఈ దుష్ట మార్గంలో పోకూడదని హెచ్చరించారు. గంజాయి అమ్మకం లేదా వినియోగంపై సమాచారం అందించాల్సిన నెంబర్ 87125 84473 అని పేర్కొన్నారు. ఇక సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించబడింది. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు స్పందించవద్దని, ఏదైనా అనుమానాస్పద అంశం ఉంటే వెంటనే డయల్ 100 లేదా సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం, మైనర్ల చేతి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకూడదని వివరించారు. బాల్యవివాహాల అనర్థాలు, సీసీటీవీల ప్రాముఖ్యత, మూడనమ్మకాలపై అవగాహన పాటల రూపంలో వినిపించారు. సైబర్ క్రైమ్స్పై నాటిక ప్రదర్శించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ SI సాయిబాబు, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు యాకుబ్ పాషా, వీరస్వామి, కళా బృంద ఇంచార్జి శ్రీమతి నాగమణి, సభ్యులు విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య, శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 200 మంది గ్రామస్థులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
