సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..
జగిత్యాల మే 31(ప్రజా మంటలు)
పరిపాలనకు స్ఫూర్తి అహల్య భాయ్ జీవితమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి అన్నారు.
పుణ్యశ్లోక, రాజమాత రాణి అహల్యబాయి హోల్కర్ 30 ఏళ్ల పరిపాలన కాలం స్వర్ణయుగం లాంటిదని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న కులవృత్తులను చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇచ్చి కులవృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.
అహల్య బాయి జన్మదినం సందర్బంగా జగిత్యాలలో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొన్న గంగారెడ్డి మాట్లాడుతూ రెండు వందల డెబ్భై సంవత్సరాల క్రితమే రాణి అహల్యబాయి తన ఏలుబడిలో ఉన్న రాజ్యంలోని మహేశ్వరం వద్ద వస్త్ర పరిశ్రమలను నెలకొల్పి చేనేత వృత్తిని ప్రోత్సహించినదని ఆకాలంలోనే బంగారు, వెండితో జరి, పట్టు చీరలు తయారుచేశారని ఆచీరలు మహేశ్వరం చీరలుగా ఎంతో ప్రాచుర్యం పొంది విదేశాలకు సైతం ఎగుమతి చేశారని అన్నారు.
రాణి అహల్యబాయి నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటించి రోజుకొక్క చేతివృత్తుల వారితో, కులవృత్తుల వారితో విడివిడిగా సమావేశమయి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారని అంతేకాకుండ వారితో కుల, మత, వర్ణ, లింగ భేదం లేకుండా సహాపంక్తి భోజనాలు కూడా చేసేవారని అందుకే ఆమెను రాజమాత అని పిలిచేవారని అన్నారు
ఎలాంటి నేలల్లో ఎలాంటి పంటలు వేయాలి రైతులకు ఎంతమేరకు రాయితీ ఇవ్వాలో అని నిర్ణయించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. అహల్య బాయి యొక్క పాలనను స్ఫూర్తిగా తీసుకొని నేడు నరేంద్రమోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని అందుకే చేతి వృత్తులను, కులవృత్తులను ప్రోత్సహించడానికి విశ్వకర్మ యోజన పథకం, ఆత్మ నిర్భర్ భారత్,మేక్ ఇండియా, మేడ్ ఇండియా, స్కిల్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ ఆర్ధికవ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 4వ స్థానానికి తీసుకువచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని దేశంలో ప్రాథమిక రంగం అయిన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎరువులపై వేలకోట్లు రాయితీలు ఇచ్చి పెట్టుబడి సాయంగా ఏడాదికి ఎకరాకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అరువేల రూపాయలు ఇచ్చి రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో అహల్యబాయి,అంబెడ్కర్ గార్ల ఆలోచనలకు అనుగుణంగా అంత్యోదయ అనే మూల సిద్దాంతంతో నరేంద్రమోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని అందుకే పదకొండేళ్ల పాలనలో 18వేల ఆదివాసీ గ్రామాలకు, తండాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించారని అన్నారు. గూగుల్ సామ్రాజ్యంలో ధ్వంసం చేయబడ్డ 157 గుళ్లను పునరుద్ధరించి భక్తులకు కావలసిన ధర్మశాలలు రోడ్డు సౌకర్యాలు ఏర్పరిచి తన ఆధ్యాత్మిక దాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు.
ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, రుద్ర శ్రీనివాస్, గుంటుక సదశివ్ కమిటీ అధ్యక్షులు మర్రిపెల్లి సత్యమ్,సభ్యులు సాంబారి కళావతి, దురిశెట్టి మమత,కొక్కు గంగాధర్,నలువాల తిరుపతి, దశరథ రెడ్డి, ఆముద రాజు, భానుప్రియ, పుష్ప రెడ్డి,అన్ని మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
