భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం
ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపిన విడిసి, ఎండిసి
రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : చుక్క గంగారెడ్డి
బుగ్గారం ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభించినందులకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ కు, ఇతర అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుగ్గారం విడిసి, ఎండిసి లు కృతజ్ఞతలు తెలిపాయి. గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్యక్షతన
సోమవారం మండల కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఇట్టి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ లు మండలాన్ని పైలెట్ మండలంగా గుర్తించడం హర్షణీయం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు ఏక తాటితో వ్యవహరించి రైతుల సమస్యలను, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తెరపైకి తేవడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో షెడ్యూల్ ప్రకారం నేటి నుండి ఈ నెల 16 వరకు జరిగే రెవెన్యూ సదస్సులకు రైతులు, ప్రజలు తగిన ఆధారాలతో సహా హాజరై మీకున్న భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయాలన్నారు. నిరక్షరాస్యులైన రైతులకు ఆయా గ్రామాల్లోని యువత సహకరించి దరఖాస్తులు వ్రాసి ఇవ్వాలని కోరారు.
బుగ్గారం మండలంలో వందకు - వంద శాతం భూ సమస్యలు తొలగించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎండిసి కో - కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, విడిసి సభ్యులు, మాజీ ఎంపీటీసీ నగునూరి చిన్న రామాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెద్ద రామ గౌడ్, కోడిమ్యాల రాజన్న, పెరంభూదూరి రామకృష్ణ స్వామి, పరమాల మల్లయ్య, సిరికొండ గంగన్న, ఆకుల రాజన్న, పచ్చిమట్ల సత్తన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ బచావో ర్యాలీతో ఉద్రిక్తత
హైదరాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన “సికింద్రాబాద్ బచావో ర్యాలీ” ఉద్రిక్తతకు దారి తీసింది. నల్ల జెండాలు, గులాబీ కండువాలు ధరించిన బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు ర్యాలీగా కదిలాయి.
ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.... సదర్మాట్ ప్రాజెక్ట్ కు మాజీమంత్రి నర్సారెడ్డి పేరు
నిర్మల్ జనవరి17 (ప్రజా మంటలు):
తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు..
నీటి ప్రాజెక్టులు – పేర్లు,... సీఎం రేవంత్ పర్యటనలో BRS ఎమ్మెల్యే హాజరు:
నిర్మల్, జనవరి 17 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టమైన అంతర్గత సంకేతాలు ఇచ్చినప్పటికీ,... భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సత్యసాయి జిల్లా 16 జనవరి (ప్రజా మంటలు) :
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్... రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు) పట్టణంలోని స్థానిక వి ఎస్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
రాయికల్ మున్సిపల్ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస అవసరాలైన వీధి... తపస్ రాష్ట్ర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి"
జగిత్యాల జనవరి 16 ( ప్రజా మంటలు)
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఓ డ్నాల రాజశేఖర్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మరియు నూతనంగా ఎన్నికైన తపస్... పోపా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు)పట్టణంలో స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి అఫీషియల్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్ మాజీ మునిసిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు,రాష్ర్ట... బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి
జగిత్యాల, జనవరి 16 (ప్రజా మంటలు):
బీద మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో, పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా... సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చే వాహనాలకు దారి మళ్లింపు. - జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నల్గొండ 16 జనవరి (ప్రజా మంటలు) :
సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకేసారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై... 