ధర్మపురిలో హనుమాన్ జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494).
ధర్మపురి క్షేత్రంలో హన్మాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైశాఖ బహుళ దశమి హన్మాన్ జయంతిగా భావించ బడుతున్న ఆ సందర్భాన్ని పుర స్కరించుకుని ఏటా ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానంలో సాంప్రదాయ రీతిలో స్వామి జయంతి వేడుకలను వైభ వంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, మే 22
వ తేదీన గురు వారం దేవస్థానంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో, అలాగే గోదావరీ తీరస్థ గడ్డ హన్మాండ్ల ఆలయంలో జన్మదిన కార్యక్ర మాలను నిర్వహించడానికి
విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
మే 22న ఆంజనేయ జయంతిని పురస్కరించుకుని, ఆంజనేయ ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగస్వాము లయ్యేందుకు సుదూర ప్రాంత హన్మాన్ దీక్షాపరులు సాంప్రదాయా చరణలో భాగంగా విచ్చేయ నున్నారు. దేవస్థానం ఏసీ ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ నేతృత్వం లోని ధర్మ కర్తల మండలి సభ్యుల మార్గ దర్శకత్వంలో, దేవస్థాన సిబ్బంది పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు వొద్దిపర్తి నర్సింహమూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలలో భాగంగా మూడు రోజుల పాటు పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పూజలు, నీరాజన, మంత్రపుష్ప, తీర్ధ ప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేలాది మంది హన్మాన్ భక్తులు మే 21నుండి 23 తేదీలలో హన్మాన్ దీక్షా విరమణలు చేయనున్నందున భక్తుల సౌకర్యార్ధం త్రాగు నీటి ఏర్పాట్లు, దేవస్థానం లోనా, బయటా చలువ పందిళ్ళు, విద్యుత్ దీపాలంకరణలు, తాత్కాలిక టెంట్లు, ప్రత్యేక క్యూలైన్ల లాంటి వసతుల మెరుగుదల చర్యలు గైకొంటున్నారు. అసంఖ్యాకులైన దీక్షాపరులు గత వారం రోజులుగా ఉదయం నుండే సుదూర ప్రాంతాల నుండి క్షేత్రానికి ఏతెంచి, పవిత్ర నదీ స్నానాలు ఆచరించి, దైవదర్శనార్ధం బారులుతీరి ప్రధానాలయం ముందు వేచి ఉంటున్నారు.
అలాగే క్షేత్రంలోని గోదావరీ తీరస్థ, భద్రా మరియు గోదావరీ నదుల సంగమ స్థానమైన ప్రదేశంలో, గోదావరి తీరాన్ని ఆనుకుని వెలసిన, హన్మాన్ గడ్డ పేరుతో సుపరిచిత మైన భక్తాంజనేయ దేవాలయంలో వంశపారంపర్య అర్చకులు మధ్వాచారి రాంకీషన్, పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆంజనేయ జయంతి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహించే క్రమంలో విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
