కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

On
కేసీఆర్ అప్పు..తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

*గ‌త ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది...

*సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క....

సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :
 
 కేసీఆర్ ప్రభుత్వం చేసిన  అప్పు తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.కేసీఆర్ నిర్వాకం వ‌ల్ల నెల‌కు 6 వేల కోట్ల ప్రజాధ‌నాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వ‌స్తుందని మంత్రి పేర్కొన్నారు.

అప్పులు, అమ్మకాలు త‌ప్ప కేసీఆర్ ప్రభుత్వం  చేసిన‌అభివృద్ది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన  అభివృద్ది ఒక గాలి బుడ‌గ అని ఎన్నిక‌ల్లో ప్రజ‌లే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.  సనత్ నగర్ నియోజవర్గ పరిధిలోని బేగంపేట పాటిగడ్డ ఎన్ బి టి నగర్ ఓ ఇంట్లో రేషన్ షాపులో ఇచ్చిన సన్న బియ్యంతో వండిన బోజనం ను ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమా, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్క తిన్నారు.

ఈ సందర్బగా మంత్రి మాట్లాడుతూ గతంలో పుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని,ఇప్పుడు పేదవారు కూడా దనికులతో సమానంగా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉండాలని ఎన్నికల్లో లేని హామీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు.  ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తున్నట్లు మంత్ర చెప్పారు.  పేదలు సన్న బియ్యం తింటుంటే  బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కడుపు మండుతుందని సీతక్క ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ త‌న అస‌హ‌నాన్ని ప్రద‌ర్శిస్తున్నారన్ మంత్రి సీతక్క గత ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. స‌త్తా ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని, సత్తా ఉన్న నాయకుడు  ప‌త్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. స‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌చ్చి సత్తా నిరూపించుకోవాలి కానీ, కనిపించకుండా పోతే ఎలా అన్నారు.

ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చ‌రిత్ర బీఆర్ఎస్ దని,40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం  కాదా? ఉపాద్యాయ‌, ఉద్యోగ నాయ‌కుల ఇంటి త‌లుపులు ప‌గుల గొట్టిన ఘనుడు  కేటీఆర్ కాదా...? అని ప్రశ్నించారు. ఎంద‌రో  ఉద్యమ‌కారుల‌ను అవ‌మాన ప‌రిచి బ‌య‌ట‌కు పంపిన చ‌రిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి...అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా , ఇతర  కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

“కథ చెబుతా వింటారా” కథల పోటీ

“కథ చెబుతా వింటారా” కథల పోటీ హనుమకొండ, మే 30 (ప్రజా మంటలు):తెలుగు భాషపై చిన్నారుల్లో మక్కువ పెంపొందించడంతో పాటు, అమ్మభాషైన తెలుగును గౌరవించే భావనను పెంచేందుకు హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కథ చెబుతా వింటారా” పేరుతో కథల చెప్పే పోటీని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి ఒక...
Read More...
State News 

ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ 

ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్  హైదరాబాద్ మే 30 (ప్రజా మంటలు): ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ...
Read More...
State News 

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు   హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం...
Read More...
Local News 

కొనసాగుతున్న ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం

కొనసాగుతున్న ఉచిత బాస్కెట్బాల్ శిక్షణ శిబిరం      జగిత్యాల మే 28 (ప్రజా మంటలు)స్కిర్మిష్   బాస్కెట్‌బాల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్వామి వివేకానంద మినీ స్టేడియం లో ప్రతిరోజు ఉచిత బాస్కెట్‌బాల్ శిక్షణ శిబిరం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. కోచ్ శ్రీరామ్  ఆధ్వర్యంలో, జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి ( డి వై ఎస్ ఓ )డా. రవికుమార్  సహకారంతో పాటు     శారీరక...
Read More...
State News 

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు): సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని, అది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం

ఘనంగా ముగిసిన శ్రీమద్ భాగవత సప్తాహం   జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణం గీత భవన్ లో గత ఏడు రోజులుగా ఖండవల్లి ఆదిత్య శర్మచే భాగవత సప్తాహం కొనసాగుతుండగా గురువారం ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్వాదశ అక్షర శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఆదిత్య శర్మ  పలశృతి  వివరిస్తూ జనన మరణాల చక్రంలో జారకుండా ఉండడానికి...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్ 

జగిత్యాల పట్టణంలో అందరిని అలరిస్తున్న ఎగ్జిబిషన్  జగిత్యాల మే 28(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎగ్జిబిషన్ వయోభేదం లేకుండా అందర్నీ అలరిస్తుంది .జిల్లాలోని గ్రామాల నుండి సైతం చూడడానికి కుటుంబాల వారితో కలిసి ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రదర్శనలను తిలకిస్తూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తాజ్ మహల్ తో పాటు జలకన్య ప్రత్యేక ఆకర్షణగా చూపరులను ఆకట్టుకుంటుంది.    అంతేకాకుండా పెద్దపులి...
Read More...
National  State News 

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ హైదరాబాద్ మే 28 (ప్రజా మంటలు): తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేందుకు అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి A. Revanth Reddy కేంద్ర సమాచార శాఖ మంత్రి Jyotiraditya Scindiaతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu...
Read More...
National  State News 

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ అడుగు హైదరాబాద్, మే 28 (ప్రజా మంటలు): తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి A. Revanth Reddy మహారాష్ట్ర ముఖ్యమంత్రి Devendra Fadnavis కు లేఖ రాశారు. తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం కేటాయించాలని, త్వరలో అనుకూల తేదీ...
Read More...
Filmi News 

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ హైదరాబాద్ మే 27: హైదరాబాద్‌లో “ఒకే ఒక లోకం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొరిటాల రోహిణి సమర్పణలో, కొరిటాల సాయిచౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వై.విష్ణునారాయణ దర్శకత్వం వహించారు. సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలుగు...
Read More...
State News 

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ

సర్వేలతో సర్కార్ కాలయాపన – అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని టీఆర్ఎస్ నేతల విమర్శ హైదరాబాద్, మే 27 (ప్రజా మంటలు): రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు విమర్శించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర ప్రభుత్వ పనితీరుపై...
Read More...
State News 

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కల్వకుంట్ల కవిత – భూ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, మే 26 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రభావితుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సమావేశంలో ధర్మ...
Read More...