కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...
*గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది...
*సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క....
సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అప్పులు, అమ్మకాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసినఅభివృద్ది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజవర్గ పరిధిలోని బేగంపేట పాటిగడ్డ ఎన్ బి టి నగర్ ఓ ఇంట్లో రేషన్ షాపులో ఇచ్చిన సన్న బియ్యంతో వండిన బోజనం ను ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమా, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్క తిన్నారు.
ఈ సందర్బగా మంత్రి మాట్లాడుతూ గతంలో పుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని,ఇప్పుడు పేదవారు కూడా దనికులతో సమానంగా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉండాలని ఎన్నికల్లో లేని హామీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తున్నట్లు మంత్ర చెప్పారు. పేదలు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కడుపు మండుతుందని సీతక్క ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్ మంత్రి సీతక్క గత ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని, సత్తా ఉన్న నాయకుడు పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి కానీ, కనిపించకుండా పోతే ఎలా అన్నారు.
ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని,40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టిన ఘనుడు కేటీఆర్ కాదా...? అని ప్రశ్నించారు. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి...అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్... లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు... ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు... కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,... సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్–నాదర్గుల్–కందుకూర్ ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... 