కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...
*గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది...
*సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క....
సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అప్పులు, అమ్మకాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసినఅభివృద్ది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజవర్గ పరిధిలోని బేగంపేట పాటిగడ్డ ఎన్ బి టి నగర్ ఓ ఇంట్లో రేషన్ షాపులో ఇచ్చిన సన్న బియ్యంతో వండిన బోజనం ను ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమా, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్క తిన్నారు.
ఈ సందర్బగా మంత్రి మాట్లాడుతూ గతంలో పుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని,ఇప్పుడు పేదవారు కూడా దనికులతో సమానంగా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉండాలని ఎన్నికల్లో లేని హామీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తున్నట్లు మంత్ర చెప్పారు. పేదలు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కడుపు మండుతుందని సీతక్క ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్ మంత్రి సీతక్క గత ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని, సత్తా ఉన్న నాయకుడు పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి కానీ, కనిపించకుండా పోతే ఎలా అన్నారు.
ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని,40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టిన ఘనుడు కేటీఆర్ కాదా...? అని ప్రశ్నించారు. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి...అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు... గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు
గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..
సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) :
పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి... బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే ప్రతిజ్ఞ
మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో (అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్... సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు
.
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం కాలభైరవాష్టమి పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ... మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక... ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందని తెలిపారు.
శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.... జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు.... భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం
లోతైన విశ్లేషణ
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1. స్వచ్ఛ భారత్, 2.శౌచాలయ నిర్మాణం, 3.స్మార్ట్ సిటీ మిషన్, 4.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, 5.అమృత్ మిషన్, 6.దీనదయాళ్ అంత్యోదయ యోజన, 7.హెరిటేజ్ సిటీ అభివృద్ధి యోజన వంటి పలు ఫ్లాగ్షిప్ పథకాలు భారీ ఎత్తున నిధులతో నడిచాయి. వీటిలో మొత్తం 36.65... కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
కోరుట్ల, నవంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం అధికారులపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు.
అన్ని సెక్షన్లలో రికార్డుల పరిశీలన
విజిలెన్స్ బృందం• టౌన్ ప్లానింగ్• ఇంజనీరింగ్• ఫైనాన్స్• ట్యాక్స్• సానిటేషన్... కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్తో కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కల్వకుంట్ల కవిత పిలుపుతో జరిగిన రైలు రోకో ఆందోళన కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలును అధికారులు నిలిపివేశారు.
కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆందోళన ఉధృతమవుతుండటంతోకల్వకుంట్ల కవితను పోలీసులు... తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?
నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?
తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?
(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)
తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,... చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు):
సారంగాపూర్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా... 