కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...
*గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది...
*సనత్ నగర్ లో లబ్దిదారుడి ఇంట్లో సన్నబియ్యం బువ్వ తిన్న మంత్రి సీతక్క....
సికింద్రాబాద్ మే 06 (ప్రజామంటలు) :
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అప్పులు, అమ్మకాలు తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసినఅభివృద్ది శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజవర్గ పరిధిలోని బేగంపేట పాటిగడ్డ ఎన్ బి టి నగర్ ఓ ఇంట్లో రేషన్ షాపులో ఇచ్చిన సన్న బియ్యంతో వండిన బోజనం ను ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమా, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్క తిన్నారు.
ఈ సందర్బగా మంత్రి మాట్లాడుతూ గతంలో పుడ్ సేఫ్టీ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని,ఇప్పుడు పేదవారు కూడా దనికులతో సమానంగా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉండాలని ఎన్నికల్లో లేని హామీని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడు సన్న బియ్యం అన్నం తినాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తున్నట్లు మంత్ర చెప్పారు. పేదలు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల కడుపు మండుతుందని సీతక్క ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్ మంత్రి సీతక్క గత ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని, సత్తా ఉన్న నాయకుడు పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి కానీ, కనిపించకుండా పోతే ఎలా అన్నారు.
ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దని,40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టిన ఘనుడు కేటీఆర్ కాదా...? అని ప్రశ్నించారు. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని, మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి...అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.
ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని... నేటి అర్ధరాత్రి నుండి ఆటోల బంద్ _ప్రజలు సహకరించాలి
జగిత్యాల ఆగస్ట్ 23 (ప్రజా మంటలు)
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
నేటి అర్ధరాత్రి నుండి జగిత్యాల జిల్లా స్థాయిలో రాష్ట్ర పిలుపుమేరకు ఆటోలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. విధి లేని పరిస్థితుల్లోనే తాము బందుకు శ్రీకారం చుట్టామని ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో... మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య... యాదవులను కురుమ కులంలో కలపవద్దు
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
యాదవ సామాజిక వర్గాన్ని కురుమ కులంలో కలపడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం, కురుమ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు ఆర్. జయప్రకాష్, టి. సుదర్శన్లను కలిసి... జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్కే కాలనీకి మౌలిక వసతుల కల్పన
రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు
భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి
ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
- మంత్రి అడ్లూరి... ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు... వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్పై భార్య ఫిర్యాదు
వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు):
వేములవాడలోని రెడ్డి భవన్లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఫోక్ సాంగ్స్లో నటించిన ఈశ్వర్ సాయి,... 2 వేల మంది అన్ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
సింగరేణిలో అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
హెచ్ఎంఎస్ జనరల్... పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మళ్లీ భూ పంపిణీ జరగాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజా మంటలు):
తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి... కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం* *బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
*
జగిత్యాల జిల్లా ఆగస్టు17 {ప్రజా మంటలు}
మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో జగిత్యాల నుంచి... 