సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

On
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

*అగ్నిలో బుగ్గి అయిన ఎస్బీఐ  బ్యాంకు అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ 4 వఫ్లోర్ 
*ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను  ఆర్పిన ఫైర్ సిబ్బంది.. 
*సెలవు రోజు కావడంతో తప్పిన ప్రాణనష్టం..

సికింద్రాబాద్ మే 04 (ప్రజా మంటలు):


 సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద  ఎస్బీఐ భవనం నాలుగో  అంతస్తులో  అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్నఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో  మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి....  సికింద్రాబాద్ పాట్నీసెంటర్లోని ఎస్బీఐ భనవం నాలుగో  అంతస్తులో ఎస్బీఐ బ్యాంకు లోన్లకు సంబంధించి  కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం సాయంత్రం భవనం నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా  దట్టమైన పొగలు, పెద్ద ఎత్తునమంటలు చెలరేగడంతో అటుగా వెళుతున్న వహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 అగ్ని ప్రమాద సంఘటపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో  అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. సంఘటనా స్థలానికి భారీ క్రేన్ను తెప్పించిన ఫైర్ సిబ్బంది క్రేన్స్ సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు నాలుగో అంతస్తునుంచి కిందకు రాకుండా ఉండేందుకు  ఫోమ్ తో స్ర్ఫే చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనానికి చుట్టు పక్కల పలు వ్యాపార సముదాలు కొనసాగుతున్న భవనాలు ఉన్నందున ఆ భవనాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. నాలుగో అంతస్తులో పూర్తిగా బ్యాంకు లోన్లకు సంబంధించిన వ్యవహారాలు ఉండటంవల్ల అందులో  చాలా ఎక్కువా ఫర్నీచర్ ఉందని, ఈ ప్రమాదంలో బ్యాంకుకు చెందిన  ఫర్నీచర్ తో పాటు  బ్యాంకు లోన్లకు సంబంధించిన కీలకమైన  ఫైళ్లు  అంతా పూర్తిగా కాలిపోయినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.  ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో బ్యాంకు ఆఫీసులో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది లేకపోవడంతో  పెను ప్రమాదం తప్పింది.  

వర్కింగ్ డే అయి ఉంటే పెద్ద ప్రాణ నష్టం వాటిల్లి ఉండేదని  ఫైర్ అధికారులు,బ్యాంకు అధికారులు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్తాయిలో తెలియక పోయినప్పటికీ బ్యాంకులో షార్క్ సర్య్కూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకున్నాం..
–ఫైర్ ఆఫీసర్ శ్రీదాసు

సికింద్రాబాద్  ఫైర్ ఆఫీసర్ 


ప్యాట్నీ సెంటర్లోని ఎస్బిఐ అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సాయంత్రం7 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది..వెంటనే మా సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నాం. బిల్డింగ్ నాల్గవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ మిగతా అంతస్తులకు వ్యాప్తి చెందకుండా వెనకే ఉన్న అపార్ట్మెంట్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నాం. ప్రమాద సమయంలో మనుషులు ఎవరు బిల్డింగ్ లో లేరు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం ఐదు ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం. 

Tags

More News...

Local News  State News 

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం *అగ్నిలో బుగ్గి అయిన ఎస్బీఐ  బ్యాంకు అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ 4 వఫ్లోర్ *ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను  ఆర్పిన ఫైర్ సిబ్బంది..  *సెలవు రోజు కావడంతో తప్పిన ప్రాణనష్టం.. సికింద్రాబాద్ మే 04 (ప్రజా మంటలు):   సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద  ఎస్బీఐ భవనం నాలుగో  అంతస్తులో  అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం   వర్కింగ్...
Read More...
State News 

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సికింద్రాబాద్ 04 మే (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ గారీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ జాతీయస్థాయిలో జనగణన తో పాటు కులగణన  చేస్తామని ప్రకటించినందుకుగాను సామాజిక న్యాయం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 934842213జగిత్యాల మే 4(ప్రజా మంటలు)భాను సప్తమి ( భానువాసరే) అరుదైన ఆదివారం  సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక  పల్లకి సేవ నిర్వహించారు.సర్వ దేవాత్మకుడు ఆదిత్యుడుప్రాత: కాలాన్నే స్నానం చేసి, శుచిగా ' సూర్యుని నమస్కరిస్తే చాలు - పాప నిర్మూలనం జరిగి, పవిత్రుల...
Read More...
Local News 

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం 

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం                                              సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 4( ప్రజా మంటలు)  జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థానం శ్రీ శృంగేరి విరూపాక్ష మఠం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య నరసింహ భారతి మహాస్వామి  సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయం ప్రధాన పూజారి  చిలకముక్కు  నాగరాజు నివాసానికి విచ్చేసి, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
Read More...
Local News 

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి     *పార్సిగుట్ట  చోరి కేసును చేధించిన పోలీసులు    *మూడు తులాల బంగారు నగలు,మొబైల్ రికవరీ    *మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్ మే 04 (ప్రజామంటలు) : వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన టు–లెట్ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. స్వయనా మేనకోడలే అత్త ఇంట్లో జరిగిన చోరి కేసులో...
Read More...
Local News  State News 

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం మొక్కజొన్న కంకి, టాటా ఏసీ వాహనం దగ్ధం గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి, మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి నుండి వెనుగుమట్ల వెళ్లే  11 కేవీ విద్యుత్ వైరు మండల కేంద్రంలోని  అర్చనపెల్లి పద్మ ఇంటి...
Read More...
Local News 

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల  అవస్థాపన సౌకర్యాల ప్రచారం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల  అవస్థాపన సౌకర్యాల ప్రచారం                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 4( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల జగిత్యాల,  అధ్యాపకులు ప్రవేట్ కళాశాలలకు ధీటుగా  తమ కళాశాలకు  అందుబాటులో ఉన్న  పోలాస గ్రామంలో, ఇటీవల పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి, విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, తమ కళాశాల లో...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ  గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు): సప్తమి తిథి (భాను సప్తమి) పర్వదినం పురస్కరించుకొని ఆదివారం శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ భాను సప్తమి చాలా దివ్యమైన రోజుని ఆదివారం సూర్యునికి సంబంధించిన పర్వదినం సందర్భంగా సూర్యుని కొలిచిన వారికి గొప్ప యోగవంతమైనదిగా భావిస్తారన్నారు. ఈ...
Read More...
Local News 

ఘనంగా  "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ఘనంగా   .                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 4(ప్రజా మంటలు     ) సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జగిత్యాల...
Read More...
Local News 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  జగిత్యాల మే 4(ప్రజా మంటలు)నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు....
Read More...
Local News 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం మెట్టుపల్లి మే 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మేట్ పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రమాదం చుట్టు ముట్టినప్పుడు మేమున్నామంటూ...
Read More...
Local News 

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు   ఇబ్రహీంపట్నం మే 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్...
Read More...