అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్
అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలి
- ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు)
ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ బ్రాహ్మణ సమాజానికి సూచించారు.జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో బుధవారం, ధ్యాన మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో మంచి రోజును పురస్కరించుకొని పుణ్యావాచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని డా.సంజయ్ అన్నారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు.
బ్రాహ్మణులలో చాలామంది నిరుపేదలు ఉన్నారని వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ధ్యాన మందిరం ఉపయుక్తంగా ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
అంతేకాకుండా ధ్యాన మందిరము ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇంటి నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే దాన్ని తొలగించడానికి సంబంధిత అధికారులకు సూచించారు. శిథిలావస్థ నిర్మాణాన్ని తొలగించాలని, రాబోయే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా నిర్మాణ తొలగింపుకై . కలెక్టర్కు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బంది సాకారం తీసుకోవాలని, పై అధికారులకు తెలియాలని ఈవో సురేందర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వైదిక క్రతువులో పాల్గొనా ఎమ్మెల్యే డా.సంజయ్ బ్రాహ్మణ పండితుల ఆశీర్వాదాన్ని పొందారు. మునుముందు ధ్యాన మందిరంకు కావలసిన అవస్థాపన సౌకర్యాల కోసం తన వంతు కృషి చేయగలనని, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా దాతల సహకారం తో ధ్యాన మందిరం అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
కార్యక్రమంలోమోతే ఉమాకాంత్ శర్మ ,సిరిసిల్ల శ్రీనివాస్, మందిరం భారవి శర్మ ,మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, చంద్రశేఖర్, శ్రీధర గణపతి , పార్థసారథి శర్మ ,వేణుగోపాల్ ,శ్రీనివాస్, కార్తీక్, కిరణ్, ఈవో సురేందర్, వార్డు నాయకులు అనుమల్ల రఘు, శ్రీనివాస్ చారి ,భాస్కర్ శర్మ రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
