ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, జూన్ 4, (ప్రజా మంటలు):
18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సంచలనాత్మక ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
చివరి బంతి వేయగానే ఆర్సీబీ గెలుపును ఖరారు చేయగా, బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉత్సాహ భరిత వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్లోని అమీరుపేటలో జరిగిన సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్సీబీ అభిమాని సమూహం — ఆండ్రూ , పాల్ ప్రవీణ్, ఆరోన్ స్యామ్యూల్, జాన్, ఇల్యాస్, కమల్, రాజేష్ గంటా — నేతృత్వంలో అమీరుపేట వీధుల్లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. బాణసంచ కాల్చి ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు అభిమానులు ఆర్సీబీ జెండాలు పట్టుకుని నృత్యాలు చేస్తూ, విజయ నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు. అమీరుపేట ఆ రాత్రి ‘మినీ బెంగళూరు’లా మారిపోయింది. 18 ఏళ్ల నిరీక్షణకు తీరిన ఆనందంలో అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
