తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ
కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా. కోట నీలిమ నేతృత్వంలో ఘనంగా నిర్వహణ
*బేగంపేట నుండి రసూల్పుర వరకు ఉత్సాహభరితంగా సాగిన ర్యాలీ
సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఏఐసీసీ మెంటర్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన విభాగాలు, కార్యకర్తలు, సైక్లింగ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ర్యాలీ బేగంపేట్ విమానాశ్రయ రోడ్డులో ప్రారంభమై రసూల్పుర సర్కిల్వరకు సాగింది. ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం కోసం జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, ఆ ఉద్యమం ఆవిర్భావ స్ఫూర్తిని మరలా ప్రజల్లో కలిగించే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా డా. కోట నీలిమ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం సాగిన ఉద్యమం అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది" అని తెలిపారు. ర్యాలీ అనంతరం సామూహికంగా తెలంగాణ గీతం ఆలపించారు. స్థానికులకు మిఠాయిలను పంచిపెట్టారు.ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
