రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే - కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్
తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ?ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ?
ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం
హైదరాబాద్ జూన్ 04:
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించారు.
రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ గారు ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
ఇందిరా పార్వk వద్ద జరిగిన ధర్నాలో ఆమె ప్రసంగం:
కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ?
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు.ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చు.కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు.
అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం... ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం.మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు
కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదు.తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారు.గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారు
మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటు
కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోంది.90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలి. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ?
తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు.గోదావరి - పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను.చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదు.8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదు
బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయం.బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలి.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలి.
ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ?
గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది.మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారు.ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము
హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తాం
మహాధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముగింపు వ్యాఖ్యలు
కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది... కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసము లేదు ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టింది
నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారు .కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కెసిఆర్ బాగు చేయించారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయినయ్
కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పలిగిపోయాయి ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా తనెల్ కూలిపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖం ని అద్దంలో చూసుకోవాలి.ఎస్ ఎల్ బి సి టనల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది
కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?
కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది.కాలేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది.తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టాలి.
తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీళ్లు ఇవ్వాలి. కాలేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 99% పనులు పూర్తయ్యాయి. మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను
కాలేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. కాబట్టి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని బిజెపిని డిమాండ్ చేస్తున్నాను.ఎన్నికలు రాగానే కర్ణాటకలోని అపర భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు
బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేస్తున్నాను.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిందే దాదాపు 80000 కోట్ల వ్యయంతో,అందలో లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు ?
బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించింది
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
