డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు
భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) :
గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది.
తాజాగా డిఎం అండ్ హెచ్ఓ జీలుగుల ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేయగా, స్థానిక ఏఎన్ఎం విద్యుత్ సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన డిఎంహెచ్ఓ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో పాటు మండల ఏఈతో సంప్రదించి తగిన చర్యలు చేపట్టారు. ఫలితంగా నాలుగు రోజుల్లోనే విద్యుత్ మీటర్ ఏర్పాటైంది.
గత 16 సంవత్సరాలుగా ఎవరి దృష్టికి రాని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం అందించిన డిఎం అండ్ హెచ్ఓ, స్థానిక ఏఎన్ఎం కె. రీతా, హెల్త్ సూపర్వైజర్ కె. సంపత్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా. విజేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
