చదువుతోనే బంగారు భవిష్యత్తు. వాల్మీకి ఆవాస విద్యార్థులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి.
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి అన్నారు. సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సోమవారం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు.బాల్యం నుండే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే ఆశయంతో పనిచేస్తున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ గంప కరుణాకర్ మనుమరాలు యష్ణశ్రీ జన్మదినం సందర్భంగా 65 మంది ఆవాస విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకులు డాక్టర్ భీమనాతిని శంకర్, నందెల్లి మదన్ మోహన్ రావు, కైలాసం, అశోకరావు, సంపూర్ణ చారి, మధుకర్, నరసింగరావు, సత్యం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
