డాక్టర్ ప్రతాప్రెడ్డి పార్థీవదేహం గాంధీ మెడికల్కాలేజీకే
ఆయనకు నివాళులు అర్పించిన వైద్యాధికారులు, సిబ్బంది.
రెండు రూపాయలకే వైద్యం అందించిన ప్రతాప్ రెడ్డి :
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు):
ఆదివారం కన్నుమూసిన గాంధీ వైద్య కళాశాల అలుమ్నీ అసోషియేషన్మాజీ అధ్యక్షుడు, స్టేట్ ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ప్రతాప్రెడ్డి (75) పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనాల కోసం సోమవారం గాంధీ మెడికల్ కాలేజీ కి డోనేట్ చేశారు. అంతకు ముందు అలుమ్ని సెంటర్ హాలులో డాక్టర్ ప్రతాప్ రెడ్డి భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం పెట్టారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. ఇందిర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి శేఖర్ రావు,ఫోరెన్సిక్ హెచ్ఓడీ ప్రొ.కృపాల్ సింగ్, గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జిఆర్. లింగ మూర్తి, కార్యదర్శి ఏవీ.రత్నం, జుడా అధ్యక్షుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గౌడ్, అజయ్ తదితరులు ప్రతాప్ రెడ్డి భౌతిక కాయానికి నివాళిలర్పించారు.
అనంతరం గాంధీ వైద్య కళాశాల అనాటమీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్ సుధారాణి, ప్రొఫెసర్ సుధాకర్ బాబు, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్ లకు డాక్టర్ ప్రతాప్ రెడ్డి పార్థీవ దేహాన్ని అప్పగించారు.
రెండు రూపాయలకే వైద్యం అందించిన ప్రతాప్ రెడ్డి :
తన తండ్రి దివంగత డాక్టర్ ప్రతాప్ రెడ్డి మానవతా వాది అని, నిరంతరం పేదలకు వైద్య సేవ చేయడానికే విశేషంగా కృషి చేశారని ఆయన కుమారుడు శరత్ రెడ్డి అన్నారు. తన తల్లి, గైనకాలజిస్ట్ దివంగత డాక్టర్ శోభా రెడ్డితో కలిసి 1975లో కూకట్ పల్లిలో పీపుల్స్ హాస్పిటల్ ప్రారంభించి, కేవలం రెండు రూపాయలకే వైద్యం అందించారని తెలిపారు. 2017లో తన తల్లి మరణించారని, 2021 వరకు పీపుల్స్ హాస్పిటల్ కొనసాగిందని ఆయన చెప్పారు. ఆయన కోరిక మేరకు మరణాంతరం పార్థీవ దేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు అప్పగించామని తెలిపారు.
––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
