డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

On
డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

(వనమాల గంగాధర్)

జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):

ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..

ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.

పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.

గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు

గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు)  ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్  బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..

 నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ  స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.

            

Tags
Join WhatsApp

More News...

Local News 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య)    గొల్లపల్లి డిసెంబర్   02 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలో మూడో విడత  జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు...
Read More...

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_  7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ  నేటితో ముగింపు రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్     .  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే  విషయాన్ని జిల్లా కలెక్టర్  పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల...
Read More...

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు  ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)    ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా...
Read More...

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం

రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం    మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్) రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా  ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి...
Read More...
National  State News 

Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ

Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్‌ఫోన్లలో Sanchar Saathi యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి...
Read More...
National  Opinion 

పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి

పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ ) --డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555. సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో...
Read More...

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం...
Read More...
Local News  State News 

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు): హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ సికింద్రాబాద్,  డిసెంబర్ 02 (ప్రజా మంటలు): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో   ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు...
Read More...

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము  దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,  మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):  పంచాయతి ఎన్నికలు -2025  మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు....
Read More...
Local News 

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం  అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ  గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు  తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి...
Read More...