డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
(వనమాల గంగాధర్)
జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):
ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..
ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.
పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.
గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు
గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు) ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..
నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుండె జబ్బుల నివారణను మిషన్గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):
గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా... అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు దా సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్... AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు.
అమిత్ షా ఫోన్ కాల్ తర్వాత మారిన దినకరన్ వ్యూహం!
చెన్నై, జనవరి 11 (ప్రజా మంటలు):
తంజావూరులో జనవరి 5న జరిగిన AMMK జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. AMMK ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రసంగం మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా... టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
కరీంనగర్, జనవరి 10 (ప్రజా మంటలు):
టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జిల్లా సరిహద్దు బెజ్జంకి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్... ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు
కొండగట్టు జనవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, కిషన్ రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
వెల్గటూర్ జనవరి 10 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్
మండలంలోని కిషన్రావు పేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడం వలన ముందస్తుగా ఘనంగా సంక్రాంత్రి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, తోరణాలతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ... బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్కు ప్రదానం
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల్లోంచి ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ అవార్డును ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసి అయిన అనుదీప్ దురిశెట్టి, ప్రజాజీవన రంగంలో విశిష్ట సేవలందించినందుకు పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ఈ పురస్కారానికి... ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో... జాగృతి ఖతార్ చైర్పర్సన్కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులు, ప్రవాసులకు విశేష సేవలందిస్తున్న జాగృతి ఖతార్ అడ్వైజరీ చైర్పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఖతార్లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్... ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు) ఆదర్శ జిల్లా అటవీశాఖ అధికారిగా పూసాల అశోక్ రావు పేరొందారని టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం పై అవగాహన సదస్సు, రిటైర్డ్ జిల్లా ఆటవీ శాఖ అధికారి 65 వ
ఈ... విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 ( ప్రజా మంటలు)విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ
పట్టణంలో... కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల జనవరి 10 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను... 