డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

On
డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

(వనమాల గంగాధర్)

జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):

ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..

ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.

పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.

గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు

గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు)  ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్  బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..

 నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ  స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.

            

Tags
Join WhatsApp

More News...

State News 

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు): గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సూచించింది. బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్‌ఆర్‌సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026...
Read More...
State News 

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత కాంగ్రెస్‌పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో...
Read More...
Local News 

ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్

ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు)    టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు  ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర  టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్  మారం జగదీశ్వర్  ముఖ్య అతిధిగా పాల్గొని...
Read More...
Local News  State News 

చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి

చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు): రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
Read More...
Local News 

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు: గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్...
Read More...
Local News 

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.!

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.! జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా  మంటలు) ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్...
Read More...
Crime  State News 

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు హైదరాబాద్‌ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా...
Read More...
Local News 

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు....
Read More...
Local News  Spiritual  

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల...
Read More...
State News 

జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు

జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ...
Read More...
Local News 

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు 

తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు     జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్...
Read More...
State News 

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క

డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు): రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట...
Read More...