డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
(వనమాల గంగాధర్)
జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):
ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..
ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.
పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.
గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు
గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు) ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..
నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... 