డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

On
డబుల్ బెడ్రూం ఇళ్లు లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

(వనమాల గంగాధర్)

జగిత్యాల ఎప్రిల్ 24 (ప్రజా మంటలు):

ఇందిరమ్మ కమిటీల గురించి మరియు డబుల్ బెడ్రూంల క్రింద, గతంలో ఇచ్చిన స్థలం పోయిన వారి సమస్యలు పరిష్కరించి అర్హులైన వారి పేర్లను ఆన్లైన్ లో పెట్టడానికి సర్వే కూడా చేయడంలేదని, వెంటనే వీటిని గుర్తించి, ఆన్లైన్ లో పెట్టాలని మాజీ కౌన్సిలర్ హనుమాండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు..

ఇంకా, ఇందిరమ్మ ఇండ్లకు సంబందించి ప్రతి గ్రామాన, ప్రతి వార్డు యందు ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వచ్చిన వాటిని అధికారుల కమీటీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క అర్హునికి లబ్దిచెంది విధంగా రూపకల్పన చేస్తే, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి పట్టణంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ కమిటీ కూడ వేయలేదు. లబ్దిదారుల ఎంపిక ఏ విధంగా చెస్తారు? అని ఆమె ప్రశ్నించారు.

పట్టణానికి, జగిత్యాల నియోజకవర్గంకు జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ను ప్రత్యేక అధికారి గా నియమిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని చెప్పారు. కాని, ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో లబ్దిదారుల ఎంపికకు సంబందించిన వివరాలు సేకరించలేదు. వెంటనే ఇందిరమ్మ కమిటీలను వార్డు వారిగా నియమించి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల పేర్లను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయశ్రీ కోరారు.

గతంలో కేటాయించిన. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించిన వారి భూములు తీసుకొన్నా ఇళ్లు కేటాయించలేదు

గతంలో రెండు పడుకల ఇండ్ల నిర్మాణం లో భాగంగా అంతకు ముందు ఇందిరమ్మ ఇంటి స్థలాలకు సంబందించిన దాదాపు " 1700 మంది " స్థలాలను తీసుకొని అ స్థలం లోనే ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ఎవరి స్థలాలు కోల్పోయారు అన్న విషయం అధికారులు కూడ పూర్తి స్దాయి వివరాలు ఇవ్వలేక పోయారు. మాకు (కౌన్సిలర్ లకు)  ఒక దాదాపు " 800 మంది " కి సంబందించిన లబ్దిదారుల వివరాలు ఇస్తే మేము కొంత మంది లబ్దిదారులను గుర్తించి అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెళ్ళితే వాళ్ళను ఆన్లైన్ చేయించమన్నారు. మేము చేయించాము కాని కొంతమందికి తెలియక స్థలం కోల్పోయిన లబ్దిదారులు ఇంకా M.R.O ఆఫీస్ చూట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. online చేయించిన వారివి కూడ "ఎంక్వైరీ" చేసారు. కాని "డబుల్ బెడ్రూం" ఇండ్లు ఇవ్వలేదు. గతంలో గౌరవ M.LA గారు కూడ స్థలం కోల్పోయిన ప్రతి ఒక్క లబ్దిదారుడ కి "డబుల్ బెడ్రూం" మంజూరు చేస్తాం అన్నారు. కాబట్టి వెనువెంటనే మిగిలిన 700 డబుల్  బెడ్రూం ఇండ్లకు సంబందించి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని స్థలం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రుం ఇండ్లు ఇచ్చిన పిదప మిగిలిన వాటికి కొత్తగా దరఖాస్తు చేసుకొన్న ఎంక్వైరీ పూర్తయిన లబ్బిదారుడికి ఇవ్వాలని ఆమె కోరారు..

 నూక పెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి సంబందించిన స్థలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ  స్థలాలలో ఇప్పటికి ఇంకా పూర్తిస్థాయి ఇల్లు కట్టుకోలెక వదిలిన స్థలాలు మరియు కొంత మంది రేకులతో నిర్మాణం ఈ విధంగా రకరకాలుగా ఉన్న స్థలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడల్ ఇంటినిర్మాణం' చేపట్టి ప్రతి ఒక్క లబ్దిదారుడికి అందేటట్లు గా ప్రభుత్వంకు లేఖ రాసి ప్రతి ఒక్కరి కళను నేరవేర్చే విధంగా చూడాలని హనుమండ్ల జయశ్రీ కోరారు.

            

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో  అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు

జగిత్యాలలో  అయోమయంలో     " జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది. విశ్వహిందూ పరిషత్తు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు.
Read More...
Local News 

భార్యను చున్నీతో బిగించి హత్య చేసిన భర్త

భార్యను చున్నీతో బిగించి హత్య చేసిన భర్త కోరుట్ల, సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త చున్నీతో మెడకు బిగించి హత్య చేసిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న అన్నం నరేష్, లక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. నరేష్...
Read More...
Local News  Entertainment  

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి జగిత్యాల, సెప్టెంబర్ 13(ప్రజా మంటలు): శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన జిల్లా స్థాయి కూచిపూడి నాట్యపోటీలలో జగిత్యాల నాట్యగురువు శ్రీమతి గుండి యమునకు చెందిన శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం విద్యార్థిని చిన్నారి మహాదేవుని నిత్యాశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ...
Read More...
Local News 

పద్మ చక్ర అవార్డు గ్రహీత ఎల్లాల సరిత గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు

పద్మ చక్ర అవార్డు గ్రహీత ఎల్లాల సరిత గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు జగిత్యాల, సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఎల్లాల సరిత గోపాల్ రెడ్డిని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. శ్రీ లలిత ఆల్టర్నేటివ్ థెరపీ సెంటర్ ద్వారా ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మందులు లేని వైద్య విధానాన్ని అందిస్తూ, సామాజిక సేవలు చేస్తున్నందుకు...
Read More...
Local News 

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్    జగిత్యాల, సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)  తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి యూ డబ్ల్యూ జె  ఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జగిత్యాలలోని స్పైసీ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు.    ఈ సందర్భంగా మిర్జా ఫజలుల్లా బేగ్ను తెలంగాణ...
Read More...
Local News 

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం

గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం   కీసర సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) కుందన్ పల్లి లోని గౌరీ ప్రియ కాలనీలో శనివారం కాలనీలో నూతనంగా గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ వారు గణేశ  ఉత్సవాలు నిర్వహించడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించి ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు గూర్చి చర్చించి విధివిధానాలు ఖరారు...
Read More...
National 

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి

జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి కేరళ, సెప్టెంబర్ 11: జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ. దేవిక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవిక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె...
Read More...
Local News 

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి

మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి జగిత్యాల, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు): 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...
Read More...
State News 

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు    బీహార్‌లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్‌ రాష్ట్రానికి చెందిన గ్రూప్‌-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని...
Read More...
Local News 

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి.  టౌన్ సిఐ కరుణాకర్.

గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి.   టౌన్ సిఐ కరుణాకర్.    జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు) గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.    ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి...
Read More...
National 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు 

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు  హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి...
Read More...