హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

On
హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు - గోదావరి తీరాన భక్తుల గుడారాలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం బుధ వారం భక్త జన సంద్రంగా మారింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్థానిక దైవాలు శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వరుల రథోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రం నలు మూలలనుండే గాక, సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ సాంప్రదాయా చరణలో భాగంగా, ఏతెంచిన ఆశేష భక్త, యాత్రికజనం భగవన్నామ స్మరణలతో, జయజయ ధ్వనాలతో క్షేత్రం ప్రతిధ్వనించింది. భక్తులు పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించి, ప్రధానాలయాల ముందు బారులుతీరి వేచి ఉండి దైవ దర్శనాలు చేసుకుని, మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డుఅధ్యక్షుడు జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన  పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ ఆచార్యత్వంలో వివిధ ఆలయాల అర్చకులు ముందుగా యోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వ రాలయాలలో నిత్య పూజలు నిర్వహించారు. మద్యాహ్నం  నుండి సాయంత్రం వరకూ దేవస్థానం ముందుంచిన మువ్వురు స్వాముల యోగ ఉగ్రనారసింహ, వేంకటేశ్వరులను ఆసీనులు గావించగా భక్తులు. నిచ్చెనల ద్వారా అధిరోహించి, మొక్కులు చెల్లించు కున్నారు. రధాల చుట్టూ అష్ట దిక్పాలకులను పూజించి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం చక్రతీర్థ కార్యక్రమార్ధం, మంగళ వాద్యాలతో, వేదమంత్రాలతో, దేవస్థాన బాధ్యులు, అర్చకులు, భక్తులు తోడు రాగా, గోదావరి నదిలో మంగళ స్నానాలు గావించి, క్షేత్ర ప్రదక్షణ ఆచరించి, దేవస్థానానికి తిరిగి వచ్చారు. ఆలయాలలో మహా నివేదనం చేసి పుష్పయాగం (నాగవెల్లి)ని నిర్వహించారు. పుష్ప యాగము, గోపాల, వాసుదేవ, శంఖ పూజలు, శ్రీవత్సకౌస్తుభ, ద్వాదశ దేవతా, పురుష, నారాయణ సూక్త నామార్చనలు గావించారు. శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పక్షాన రథోత్సవం సందర్భంగా  భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వేలామంది వినియోగించు కున్నారు.  స్వామి వారల రదోత్సవం సందర్భంగా వందలాది భక్తులకు పులిహోర ఉచితంగా పంపిణీ చేసి, త్రాగు నీరందించారు. త్రాగునీరు, బటర్ మిల్క్ పంపిణీ  చేశారు. బ్రహ్మోత్సవాల ముఖ్య దినమైనందున, నదీస్నానం పుణ్యమని భావించే భక్తులు గోదావరి నదీ స్నానాలకై సుదూర ప్రాంతాలనుండి ఉదయాత్పూర్వమే క్షేత్రానికి చేరుకున్నారు. దక్షిణాభిముఖంగా ప్రవహిస్తు విశేష గోదావరిలో వేలాదిమంది భక్తులు, స్థానికులు  మంగళ స్నానాలు ఆచరించారు.

రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు 

రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా, గోదావరి తీరస్థ పవిత్ర తీరంగా పేరెన్నికగన్న ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్ట సందర్భంగా తాత్కాలిక టెంట్లు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వివిధ డిపోల నుండి నడిపిన ఆర్టీసి బస్సులను గుణంగా క్రమబద్ధీ కరించారు. ధర్మపురి సి ఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.

గోదావరి తీరాన భక్తుల గుడారాలు

 ఏటా 13రోజులపాటు సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలకు సనాతన వంశాచార వారసత్వ ఆచరణలో భాగంగా సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు, యాత్రికులు ధర్మపురి క్షేత్రానికి అరు దెంచి, ఇక్కడ ఉత్సవాలలో పాల్గొ నడం అనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి క్రమం తప్పకుండా భక్తులు రావడం, మొక్కులు చెల్లించుకోవడం జరుగున్నది. సంవత్సరం పొడువునా మహారాష్ట్ర భక్తులు వస్తుండడం సత్సంప్రదాయారణ కాగా,  ఈఏడు భక్తుల సంఖ్య ద్విగుణీకృతమైంది. క్షేత్రంలో నివాస, బస వసతులు సరి పోని స్థితిలో కొన్ని రోజులు ఇక్కడే మకాం వేసి, ఉత్సవాలలో పాల్గొన గోరే భక్తులు గోదావరి నది తీరాన తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. ఎండ వేడిమిని తట్టుకుని, కొంతైనా రక్షింప బడేందుకు వెదురు కర్రలను, పైన కవరులను ఉపయోగించి నిర్మిం చుకున్న తాత్కాలిక నివాస యోగ్య గుడారాలు నిలువ నీడనిస్తున్నాయి.

IMG_20250319_185131

బ్రహ్మోత్సవ వేడుకలలో పాల్గొన డానికి సుదూర ప్రాంతాలనుండి విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా దాహార్తిని తీర్చేందుకు పురపాలక సంఘం, దేవస్థానం, ఆర్టీసీ, అన్నపూర్ణ, గాయత్రీ అన్నదాన సత్రం, ఎస్ బి ఐ, మద్ది కిషన్  పక్షాన పలువురు స్థానికులు వివిధ ప్రదేశాలలో త్రాగు నీటి సరఫరా కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోనేరు వద్ద పెండ్యాల  మహేందర్  ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని కోనేటికి తెప్పోత్సవాలకు వచ్చిన భక్తులు అధి కంగా వినియోగించు కున్నారు.  దేవస్థానం లోపల క్యూలైన్ల భక్తులకు శీతల జలాన్ని అందిస్తున్నారు.

Tags

More News...

Local News 

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్ *ప్రారంభించిన యూఎస్ఏ కాన్సులెట్ జనరల్   సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజామంటలు) : చిన్న వయస్సులోనే తన గొప్ప ఆలోచనకు కార్యరూపాన్ని ఇచ్చి, వరసగా ఓపెన్ లైబ్రరీలు ప్రారంభిస్తున్న చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని హైదరాబాద్ లోని యూఎస్ఏ కాన్సులెట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం దమ్మాయిగూడ లోని జవహార్ నగర్...
Read More...
Local News 

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్ 

పహాల్గమ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 28 ( ప్రజామంటలు): జమ్మూ కాశ్మీర్ లోని "పహాల్గం" లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి .యన్.జి .ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం ర్యాలీ...
Read More...
Local News  Spiritual  

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో.. సికింద్రాబాద్, ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ బోయగూడా వై జంక్షన్ వద్ద ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్మెంట్  లో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు కే వీ రమణ రావు, లలిత దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు...
Read More...
National  State News 

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు హైదరాబాద్ ఏప్రిల్ 28:   మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి  గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డితో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.    
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు హైదరాబాద్ ఏప్రిల్ 28 తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రామకృష్ణరావుకు అభినందనలు తెలియజేశారు.
Read More...
Local News  Spiritual  

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం సికింద్రాబాద్ ఏప్రిల్ 28 (ప్రజా మంటలు): పద్మారావు నగర్ లోని పోల్ బాల్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఆలయ కమిటీ చైర్మన్ రాంపురం రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 1,000 మంది పైగా...
Read More...

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

ఇస్రాజ్ పల్లె లో  కొవ్వొత్తులతో ర్యాలీ గొల్లపల్లి  ఎప్రిల్ 27 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ  ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని...
Read More...
Local News 

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్ 

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్  గొల్లపల్లి ఎప్రిల్ 28 (ప్రజ మంటలు) వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని రవీందర్ స్వచ్ఛంద సంస్థ  గొల్లపల్లి నల్ల గుట్ట ఎక్స్ రోడ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన  తాసిల్దార్ వరంధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన రవీందర్ స్వచ్ఛంద సంస్థ  ను అభినందిస్తున్నట్లు చెప్పారు....
Read More...
Local News 

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)పట్టణములోని 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ.... 15వ వార్డు లో 85 లక్షలతో అత్యంత ఆవశ్యకం కలిగిన డ్రైనేజీ నిర్మాణం చేశామన్నారు. వార్డు లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు తో...
Read More...
Local News 

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మశృంగేరి ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వచ్చేనెల జరుప సంకల్పించిన 19 వ వార్షికోత్సవ ఏర్పాట్ల గురించి కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి తో పాటు పలు ప్రధాన ఆలయాల ను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు ముందస్తు ఏర్పాట్లపై క్షేత్ర పర్యటన చేసినట్లు...
Read More...
National  State News  Spiritual  

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ *ఈనెల 30 న గణేశ శర్మకు సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించనున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 27 (ప్రజామంటలు) : కంచికామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా వేద విద్వాంసులు, శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను కంచి కామకోటి శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర...
Read More...
Local News 

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం .   జగిత్యాల ఏప్రిల్ 27 ( ప్రజా మంటలు)స్థానిక గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం, రోడ్డులో గత రెండు వారాల క్రితం, ప్రముఖ జ్యోతిష వాస్తు,పౌరాణిక, వేద, పండితులు,పురాణ వాచస్పతి,శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక మనవడు నంబి వాసుదేవా ఆచార్య చే ప్రాణ ప్రతిష్ట జరిగిన పద్మావతి,గోదా, సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం...
Read More...