శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ
*ఈనెల 30 న గణేశ శర్మకు సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించనున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి
సికింద్రాబాద్ ఏప్రిల్ 27 (ప్రజామంటలు) :
కంచికామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా వేద విద్వాంసులు, శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను కంచి కామకోటి శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు. ఈ మేరకు ఈనెల 30వ తేదీన అక్షయతృతీయ పర్వదినాన, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ గణేశ శర్మకు సన్యాసదీక్షను అనుగ్రహిస్తారు.
కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఎంపికైన రుగ్వేద పండితుడు, శ్రీ గణేశ శర్మ ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరంలో 1999 ఏప్రిల్ 29న జన్మించారు. వారి తల్లిదండ్రులు శ్రీమతి దేవి, శ్రీ ధన్వంతరి. సన్యాస దీక్ష అనంతరం వారు కొత్తగా సన్యాసాశ్రమ నామాన్ని స్వీకరిస్తారు. ప్రస్తుత 70 వ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు 1983లో సన్యాసాశ్రమం స్వీకరించారు,
2018లో పీఠాధిపతి అయ్యారు. కంచి కామకోటి పీఠం దేశంలో అత్యంత ప్రముఖ శంకర పీఠంగా విరాజిల్లుతున్నది. వేదవిజ్ఞానాన్ని నలుచెరగులా వ్యాప్తి చేయడమే కాకుండా పలు విద్యా సంస్థలను నిర్వహిస్తూ, పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను పీఠం చేపడుతున్నది.
ద్వారకా తిరుమల నుంచి కంచికామకోటి పీఠాధిపతిగా.. గణేశ శర్మ
ఆంధ్రప్రదేశ్ లోని ద్వారకా తిరుమలలో ప్రఖ్యాత వేద పండితులు రత్నాకర్ భట్ వద్ద రుగ్వేదాన్ని అభ్యసించారు. శృంగేరి, ఇతర పీఠాలు నిర్వహించిన పలు పరీక్షలలో వారు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల క్రితం నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో ఆస్థాన రుగ్వేద పండితులుగా నియమితులయ్యారు. గణేశ శర్మ కుటుంబానికి కంచి పీఠంతో ఎంతో కాలంగా సంబంధం ఉన్నప్పటికీ , 2024లో విజయేంద్ర సరస్వతి స్వామివారు బాసర సందర్శించినపుడు, గణేశ శర్మలో గల ప్రత్యేకతలను గుర్తించి కంచికామకోటి పీఠానికి ఆహ్వానించి మరిన్ని శాస్త్రాలు నేర్చుకోవలసిందిగా కోరారు. శ్రీ గణేశ శర్మ కంచి పీఠం 71వ పీఠాధిపతిగా ఎంపిక కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం
కరీంనగర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రభుత్వం ముందుగా 20వ తేదీన నూతనంగా ఏర్పడిన గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి నిర్ణయించగా ఆ ముహూర్తం బాగాలేదని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్యులు ప్రభుత్వానికి ,ప్రభుత్వ పెద్దలకు సూచించడంతో వారు ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని 22వ తేదీ... జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర
హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం.
78 ఏళ్ల జిమ్మీ లాయ్... జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్
జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి.
బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు... జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరైన... పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్
సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని... పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్ భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ ఫంక్షన్ హాల్ లో... మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)
జిల్లాలో 3వ దశ పోలింగ్లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
జిల్లాలో ఎక్కడా... కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు
జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా... లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.
మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో
క్రిమినల్... ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం
సికింద్రాబాద్, డిసెంబర్ 17 (ప్రజామంటలు) :
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును పీసీసీ వైస్ప్రెసిడెంట్, సనత్నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీజీ ఆలోచనలు, విలువల... 