గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు
ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన
గుడుంబా బాధిత యువకులు
గొల్లపల్లి మే 05 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో అక్రమంగా గుడుంబా బట్టీలు కాస్తున్న వారి వలన గొల్లపల్లి పట్టణంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు గుడుంబా తాగి అనారోగ్యానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మరియు కొందరు దానికి బానిసగా అయి వారి కుటుంబాలను రోడ్డుపై పడే పరిస్థితిలు ఉన్నాయని, వీరి నుండి యువకులను కాపాడాలని ప్రజావాణిలో కలెక్టర్ కు గుడుంబా బాధిత యువకులు విజ్ఞప్తి చేశారు.
గుడుంబా వలన ప్రజలు దాన్ని సేవించి అనారోగ్యానికి గురవుతున్నారు వారిని వారి ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతూ,కొందరు అక్రమంగా గుడుంబా కాస్తూ విచ్చలవిడిగా పక్కన ఉన్న గ్రామాలకు సరఫరా చేస్తున్నారు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం శూన్యం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబాల యువకులు ఎవరైతే అక్రమంగా గుడుంబా కాస్తున్నారు వారిపై తూతు మంత్రంగా కాకుండా కఠినంగా వ్యవహరించి గుడుంబా కాయకుండా చర్యలు తీసుకోవాలని గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన బాధితులు కుటుంబాల యువకులు, కోరుతున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
