బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
హస్తం చూపు యువత వైపు... !!!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) :
అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న యువత కు, పార్టీకి కట్టుబడిన ఏకలవ్య శిష్యులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం జోడించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించడం ఒక కీలక అంశం..
అందులో జరుగుతున్న మేధోమథనం లో ఒక విలువైన అంశంగా కాంగ్రెస్ అనుబంధ ఎన్.ఎస్.యు.ఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించిన యువతే ఈ పదవులకు ఊతం అదే సరియైన ఆదర్శ వ్యవస్థాగత విధానం అని రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులు పలుమార్లు తన అభిప్రాయాన్ని తెలియచేయడం రాష్ట్ర కాంగ్రెస్ యువతలో ఎంతో బాధ్యత పెంచే ఉత్సాహాన్ని నింపుతుంది.
అందులో బాగంగా జగిత్యాలలో ప్రముఖంగా యువనేత, మాజీ ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడు, సైద్ధాంతికపరంగా కరడుగట్టిన కాంగ్రెస్ వాది, ప్రస్తుత పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ భోగోజీ. ముఖేష్ ఖన్నా పేరు అధిష్ఠానం పరిశీలనకు తీసుకోవడం, పలు పత్రికా కథనాలు వెలువడడం, రచ్చ బండ దగ్గర చర్చలు జరగడం జిల్లా స్థాయిలో సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.
జగిత్యాల వరకు కాంగ్రెస్ అంటే జీవనన్న, జీవనన్న అంటే కాంగ్రెస్ గా ఒక చరిష్మా ఉన్న టి. జీవన్ రెడ్డి కుడి భుజమైన మాజీ సర్పంచ్ పోలాస నందయ్య పేరును, ఎడమ భుజమైన బండ శంకర్ పేర్లను ప్రతిపాదించగా, కాంగ్రెస్ పార్టీ లో చేరిన జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పేరు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.
కుడి, ఎడమైతే పొరబాటు కాదోయ్ ఓడిపోకూడదు అని కాంగ్రెస్ జిల్లా స్థాయి నేతలు ఇరు వర్గాల పెద్దలకు సంకేతాలు ఇస్తూ బి.సి యువతకు పట్టం కట్టాలని అధిష్టానం కు తెలియజేయడం గమనార్హం.
కానీ జిల్లా స్థాయిలో ప్రస్తుతం పదవులు ఇచ్చే విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు పార్టీని పట్టుకుని నడుస్తూ, నడిపిస్తున్న నాటి తరం,మరో వైపు రేపు పార్టీ నీ నిలబెట్టే పట్టుగొమ్మలుగా యువతరం ఇద్దరూ కట్టర్ సేవకులే పార్టీకి.
జిల్లా స్థాయి పార్టీ పెద్దలలో, నాయకుల్లో ఎవరి ప్రయత్నంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికినీ చివరికి వారు కూడా పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం గా బావిస్తున్నారు.
ఈ పదవుల పంపిణీలో ఎవరు త్యాగి, ఎవరు భోగి అనేది త్వరలో తేలనున్నది..
More News...
<%- node_title %>
<%- node_title %>
చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు):
సారంగాపూర్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా... ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత
ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
బాన్సువాడ –... హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్
సందర్శించిన అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు)::
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫోటో ప్రదర్శనను గురువారం తెలంగాణ హైకోర్టు భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు.... భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.
ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)... ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్
ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు... నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు.
జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
త్వరలోనే నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్... బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత
సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు) సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కులగణన... ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.
ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును... గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు
(అంకం భూమయ్య):
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ కార్యక్రమం కింద అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ విద్యార్థులు, తల్లులు,... తంజావూర్లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్కుమార్
తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:
తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది.
ప్రేమలో విఫలం – ఘాతుకానికి... సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు
అమరావతి నవంబర్ 27:
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది.
విజిలెన్స్ నివేదిక –... మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు
మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన వివరాలు
- మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు... 