బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
హస్తం చూపు యువత వైపు... !!!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) :
అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న యువత కు, పార్టీకి కట్టుబడిన ఏకలవ్య శిష్యులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం జోడించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించడం ఒక కీలక అంశం..
అందులో జరుగుతున్న మేధోమథనం లో ఒక విలువైన అంశంగా కాంగ్రెస్ అనుబంధ ఎన్.ఎస్.యు.ఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించిన యువతే ఈ పదవులకు ఊతం అదే సరియైన ఆదర్శ వ్యవస్థాగత విధానం అని రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులు పలుమార్లు తన అభిప్రాయాన్ని తెలియచేయడం రాష్ట్ర కాంగ్రెస్ యువతలో ఎంతో బాధ్యత పెంచే ఉత్సాహాన్ని నింపుతుంది.
అందులో బాగంగా జగిత్యాలలో ప్రముఖంగా యువనేత, మాజీ ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడు, సైద్ధాంతికపరంగా కరడుగట్టిన కాంగ్రెస్ వాది, ప్రస్తుత పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ భోగోజీ. ముఖేష్ ఖన్నా పేరు అధిష్ఠానం పరిశీలనకు తీసుకోవడం, పలు పత్రికా కథనాలు వెలువడడం, రచ్చ బండ దగ్గర చర్చలు జరగడం జిల్లా స్థాయిలో సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.
జగిత్యాల వరకు కాంగ్రెస్ అంటే జీవనన్న, జీవనన్న అంటే కాంగ్రెస్ గా ఒక చరిష్మా ఉన్న టి. జీవన్ రెడ్డి కుడి భుజమైన మాజీ సర్పంచ్ పోలాస నందయ్య పేరును, ఎడమ భుజమైన బండ శంకర్ పేర్లను ప్రతిపాదించగా, కాంగ్రెస్ పార్టీ లో చేరిన జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పేరు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.
కుడి, ఎడమైతే పొరబాటు కాదోయ్ ఓడిపోకూడదు అని కాంగ్రెస్ జిల్లా స్థాయి నేతలు ఇరు వర్గాల పెద్దలకు సంకేతాలు ఇస్తూ బి.సి యువతకు పట్టం కట్టాలని అధిష్టానం కు తెలియజేయడం గమనార్హం.
కానీ జిల్లా స్థాయిలో ప్రస్తుతం పదవులు ఇచ్చే విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు పార్టీని పట్టుకుని నడుస్తూ, నడిపిస్తున్న నాటి తరం,మరో వైపు రేపు పార్టీ నీ నిలబెట్టే పట్టుగొమ్మలుగా యువతరం ఇద్దరూ కట్టర్ సేవకులే పార్టీకి.
జిల్లా స్థాయి పార్టీ పెద్దలలో, నాయకుల్లో ఎవరి ప్రయత్నంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికినీ చివరికి వారు కూడా పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం గా బావిస్తున్నారు.
ఈ పదవుల పంపిణీలో ఎవరు త్యాగి, ఎవరు భోగి అనేది త్వరలో తేలనున్నది..
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్ లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్
జగిత్యాల మార్చి 30(ప్రజా మంటలు)పట్టణం లో ట్రాఫిక్ ఎస్ ఐ, టౌన్ ఎస్ ఐ ఆద్వర్యం లో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న దాదాపు 50 మంది మైనర్ లను పట్టుకున్న ట్రాఫిక్ మరియు పట్టణ పోలీసులు... ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక పై మైనర్... డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు మాజీ కౌన్సిలర్ జయ శ్రీ వినతి
జగిత్యాల మార్చి 30 ( ప్రజా మంటలు)పట్టణానికి చెందిన ఇల్లు లేని నిరుపేదల కొరకు నూకపెల్లి వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 4520 కట్టడం జరిగింది. వాటిలో 520 ఇండ్ల నిర్మాణం వద్ద డ్రైనేజీ వాటర్ కొరకు సంపు ఏర్పాటు చేసి దాని నుండి మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేసే విధానం... రవీంద్రభారతిలో ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు –
హైదరాబాద్ మార్చ్ 30 (ప్రజా మంటలు);
శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి A. Revanth Reddy జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో మండలి చైర్మన్ Gutta Sukender Reddy, ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా: క్షమాపణలు తెలిపిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చ్ 30 (ప్రజా మంటలు):
ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని అంగీకరిస్తూ క్షమాపణలు తెలిపారు.ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల... విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల మార్చ్ 29 (ప్రజా మంటలు):
విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గం గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన గడ్డం మహిపాల్ రెడ్డి గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం అంతర్గం... చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం
- సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్
🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యండా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో, శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు,... అంగరంగ వైభవంగా శ్రీ రాములవారి పట్టాభిషేకం
జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సీతారామచంద్రస్వామి ఆలయం (ఎడ్లంగడి) లో శుక్రవారం సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించగా శనివారం పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విషెస్ సంఖ్యలో పాల్గొన్నారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వేదికపై సీతారాముల పరివారం ఉత్సవమూర్తులను... జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం
ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు):
ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.... జగిత్యాలలో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ ప్రారంభం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలన
జగిత్యాల మార్చ్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్లో హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న సేవలను పరిశీలిస్తూ, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇటీవల ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్ హాస్పిటల్ను కూడా సందర్శించి... పోలాండ్ దేశ దేవుడు మన భారత దేశ రాజు. - అతనిని దూషిస్తే మరణ శిక్ష !!!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113).
హైదరాబాద్ 27 మార్చి (ప్రజా మంటలు) :
పోలాండ్ కు భారతదేశం పై అంత మమకారం ఎందుకు?
పోలాండ్లో ఈ భారత రాజును దూషిస్తే మరణశిక్ష.
మన దేశపు రాజు, పోలాండ్ దేశపు దేవుడు శ్రీ శ్రీ రాజా సాహబ్ దిగ్విజయ్ సింగ్.
కానీ భారతీయులకు... ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య మృతి.. కేసీఆర్, కవిత సంతాపం
జగిత్యాల, మార్చి 27 (ప్రజా మంటలు):
ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య (85) అనారోగ్యంతో మరణించారు. ఆదివారం 29 వ తేదీన జగిత్యాల లలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మంచాలబీసీ... ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన – తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశ?
నిజామాబాద్, మార్చ్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ అయిన తెలంగాణ జాగృతి త్వరలో రాజకీయ పార్టీగా మారబోతోందని వెల్లడించారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు... 