బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!
హస్తం చూపు యువత వైపు... !!!
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 05 మే (ప్రజా మంటలు) :
అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీసుకుంటున్న వ్యవస్థాగత పరమైన మార్పులలో బాగంగా ఎన్నో విలువైన, గుణాత్మక విషయాలకు పట్టం కడుతుంది అందులో భాగంగానే జిల్లా స్థాయిలలో గ్రంథాలయ చైర్మన్ పదవులకు పెద్ద మొత్తంలో బి.సి లకు అందునా చదువుకున్న యువత కు, పార్టీకి కట్టుబడిన ఏకలవ్య శిష్యులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది.
గ్రంథాలయాలకు నూతన జవ సత్వాలు నింపి సాంకేతిక పరిజ్ఞానం జోడించి నేటి సమాజానికి సరియైన సమాచార అవసరాన్ని ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించడం ఒక కీలక అంశం..
అందులో జరుగుతున్న మేధోమథనం లో ఒక విలువైన అంశంగా కాంగ్రెస్ అనుబంధ ఎన్.ఎస్.యు.ఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించిన యువతే ఈ పదవులకు ఊతం అదే సరియైన ఆదర్శ వ్యవస్థాగత విధానం అని రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులు పలుమార్లు తన అభిప్రాయాన్ని తెలియచేయడం రాష్ట్ర కాంగ్రెస్ యువతలో ఎంతో బాధ్యత పెంచే ఉత్సాహాన్ని నింపుతుంది.
అందులో బాగంగా జగిత్యాలలో ప్రముఖంగా యువనేత, మాజీ ఎన్.ఎస్.యూ.ఐ నాయకుడు, సైద్ధాంతికపరంగా కరడుగట్టిన కాంగ్రెస్ వాది, ప్రస్తుత పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ భోగోజీ. ముఖేష్ ఖన్నా పేరు అధిష్ఠానం పరిశీలనకు తీసుకోవడం, పలు పత్రికా కథనాలు వెలువడడం, రచ్చ బండ దగ్గర చర్చలు జరగడం జిల్లా స్థాయిలో సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.
జగిత్యాల వరకు కాంగ్రెస్ అంటే జీవనన్న, జీవనన్న అంటే కాంగ్రెస్ గా ఒక చరిష్మా ఉన్న టి. జీవన్ రెడ్డి కుడి భుజమైన మాజీ సర్పంచ్ పోలాస నందయ్య పేరును, ఎడమ భుజమైన బండ శంకర్ పేర్లను ప్రతిపాదించగా, కాంగ్రెస్ పార్టీ లో చేరిన జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పేరు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.
కుడి, ఎడమైతే పొరబాటు కాదోయ్ ఓడిపోకూడదు అని కాంగ్రెస్ జిల్లా స్థాయి నేతలు ఇరు వర్గాల పెద్దలకు సంకేతాలు ఇస్తూ బి.సి యువతకు పట్టం కట్టాలని అధిష్టానం కు తెలియజేయడం గమనార్హం.
కానీ జిల్లా స్థాయిలో ప్రస్తుతం పదవులు ఇచ్చే విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు పార్టీని పట్టుకుని నడుస్తూ, నడిపిస్తున్న నాటి తరం,మరో వైపు రేపు పార్టీ నీ నిలబెట్టే పట్టుగొమ్మలుగా యువతరం ఇద్దరూ కట్టర్ సేవకులే పార్టీకి.
జిల్లా స్థాయి పార్టీ పెద్దలలో, నాయకుల్లో ఎవరి ప్రయత్నంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికినీ చివరికి వారు కూడా పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం గా బావిస్తున్నారు.
ఈ పదవుల పంపిణీలో ఎవరు త్యాగి, ఎవరు భోగి అనేది త్వరలో తేలనున్నది..
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు.... యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?
న్యూఢిల్లీ, జనవరి 17:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ... పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన
న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు):
తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ... రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి
వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):
రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి... అమెరికా కు వ్యతిరేకంగా డెన్మార్క్ ప్రజల నిరసన ప్రదర్శనలు
కోపెన్హేగెన్, జనవరి 17 :
విరోధ భావాలతో వేలాది ప్రజలు డెన్మార్క్ రాజధాని కోపెన్హేగెన్లో రోడ్డులకు దిగారు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను స్వాధీనంగా పొందాలని పునఃప్రచారం చేస్తున్నారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్టిక్ ద్వీపం స్వయంప్రభుత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆదేశం దేనికి సరిపోయేది కాదని నిరూపించాలని అక్కడి ప్రజలు తీవ్రంగా... గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):
గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె... జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి కొప్పుల
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు అధ్యక్షతన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహకపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ , కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జగిత్యాల జిల్లా బీఆర్ఎస్... లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):
లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ... అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, జనవరి 17 (ప్రజా మంటలు):
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరంలో అభివృద్ధి జరగలేదని, అవినీతే రాజ్యమేలిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతి కవలలుగా మారి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని విమర్శించారు.
నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ... మెటుపల్లి మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు
మెటుపల్లి, జనవరి 17 (ప్రజా మంటలు):
మెటుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వర్గాల వారీగా వార్డుల విభజన ఈ విధంగా ఉంది.
జనరల్ (ఓపెన్) వార్డులు
వార్డు నంబర్లు
01, 03, 17, 21, 23
మొత్తం : 5 వార్డులు
జనరల్ – మహిళ వార్డులు
వార్డు... తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు: వర్గాలవారిగా రిజర్వేషన్ల వివరాలు
హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పదవులుBC, SC, మహిళ (Women), జనరల్ (Unreserved) — వర్గాల వారీగా విడివిడిగా జాబితాలు )
BC (బీసీ) కేటగిరీ – మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు
🔹 BC మహిళ
మున్సిపాలిటీ
ఎల్లందు
జగిత్యాల
కామారెడ్డి
బాన్సువాడ... జగిత్యాల బిసి మహిళా, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళ, రాయికల్, మెటుపల్లి జనరల్ చైర్మన్ సీట్లు
హైదరాబాద్ జనవరి 17 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వర్గాల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ST, SC, BC, అన్రిజర్వ్డ్ (జనరల్ + మహిళ) కేటగిరీల్లో మున్సిపాలిటీలను కేటాయించింది.
జగిత్యాల బిసి మహిళకు, కోరుట్ల, ధర్మపురి జనరల్ మహిళకు, రాయికల్, మెటుపల్లి జనరల్... 