భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

On
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 


బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు 

బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)
 భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. 
    
భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో  భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత రావు పేట గ్రామంలో రెవెన్యూ సదస్సుకు విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి హాజరయ్యారు.  ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ రైతులతో మాట్లాడారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ కుమార్ కోరారు.. పైలెట్ మండలంలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భూ భారతి చట్టంపై రైతులు అవగాహన కల్పించారు., రైతుల రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు.

అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పెండింగ్లో ఉన్న  భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈరోజు కాకుండా రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. 

ఈ సదస్సులో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసిల్దార్ మజీద్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది

RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది. 1. RBI తెలిపిన...
Read More...
National 

మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి

మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్నాథ్ విమర్శలతో రాజకీయ వేడి భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం...
Read More...
National  State News 

234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు

234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు చెంగల్పట్టు (తమిళనాడు), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):డీఎంకే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరువిదంతైలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 234 నియోజకవర్గాలన్నింటిలోనూ “ఈ స్టాలిన్ అభ్యర్థి” అన్న భావనతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.గత ఐదేళ్లలో అమలు చేసిన...
Read More...
National 

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక

44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక ముంబై, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 78వ మేయర్‌గా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ రితు తావ్డే ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ రావడం విశేషంగా మారింది. శివసేనకు చెందిన సంజయ్ ఘాడి ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్...
Read More...

పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు.

పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు. *  జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్‌లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్...
Read More...

కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి 

కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి  జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ తమ ఓటు హక్కును 41వ వార్డులోని ఆల్ ఫోర్స్ స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఎన్నికల సరళిని పరిశీలించారు.
Read More...

పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత

పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ  తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల సరళి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . బి ఆర్ ఎస్ తో నే జగిత్యాల, రాయికల్ పట్టణ...
Read More...

విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి

విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి  సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు...
Read More...
National 

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన

Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి...
Read More...
National  Spiritual   State News 

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు....
Read More...

ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి    జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  జగిత్యాల పట్టణంలో 23 వార్డులో   ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో  మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం...
Read More...
State News 

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ...
Read More...