భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
బుగ్గారం మండలం యశ్వంతరావు పేటలో భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ తో కలిసి హాజరు
బుగ్గారం, మే 05 (ప్రజా మంటలు)
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత రావు పేట గ్రామంలో రెవెన్యూ సదస్సుకు విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మండల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ కుమార్ కోరారు.. పైలెట్ మండలంలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భూ భారతి చట్టంపై రైతులు అవగాహన కల్పించారు., రైతుల రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పెండింగ్లో ఉన్న భూ సంబంధిత సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈరోజు కాకుండా రేపు కూడా అధికారులకు అందించవచ్చని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సదస్సులో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసిల్దార్ మజీద్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. 129 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లగా, కేవలం 23 మందినే అన్ఫిట్ గా గుర్తించడం అత్యంత అన్యాయం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కవిత... కరీంనగర్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా – అంబేద్కర్ కు కాంగ్రెస్ నేతల నివాళులు
కరీంనగర్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
కరీంనగర్ డీసీసీ కార్యాలయం మరియు కోర్టు చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. SUDA చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా SC సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ తదితరులు... భారత రాజ్యాంగం ఎవరు రాశారు?
ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకుంటుంది. 1949లో ఇదే రోజున డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని స్వీకరించారు.భారత రాజ్యాంగం సాధారణమైన పత్రం కాదు; ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
1. ... శంషాబాద్ GMR ఏరోపార్క్లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
శంషాబాద్లోని GMR ఏరోపార్క్లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ... ఎన్విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?
భయాలతో $115 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి
న్యూయార్క్ నవంబర్ 26:
ప్రపంచ ఏఐ చిప్ రంగాన్ని దశాబ్దం పైగా ఆధిపత్యం చేసిన ఎన్విడియా షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. గూగుల్ తన స్వంత కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) మరింత శక్తిగా ముందుకు వస్తున్నాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో... దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ నవంబర్ 26:
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది.
ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ... ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న
తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు.
వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల... బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ
ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
✔ప్రభుత్వం హామీ (42%)
✘ అమలైన... చైనా–అరుణాచల్ పాస్పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన
న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి):
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది.
లండన్ నుంచి జపాన్కు ట్రాన్సిట్ ప్రయాణం... నల్లగొండ కాంగ్రెస్లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి... “ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):
జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని... 