శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

On
శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :

 పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం  రిహాబిలిటేషన్ సెంటర్ లో  ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి  అల్లు అరవింద్ పరామర్శించారు.

 సోమవారం ఆయన బేగంపేట్ లోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి శ్రీతేజ్ ను స్వయంగా  కలిశారు. రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్సపొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి , అతనికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పూర్తి స్థాయిలో రికవరీఅయ్యేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాలను సైతం అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  పుష్స–2 సినిమా ప్రీవ్యూ షోకు వెళ్లిన శ్రీతేజ్ కుటుంబ సభ్యులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి  ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలపాలైన శ్రీతేజ్ ను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు.

దాదాపు 146 రోజుల పాటు చికిత్స పొందిన శ్రీతేజ్ ను వైద్యులు  ఏప్రిల్ 30 న డిశ్చార్జ్ చేస్తూ శ్రీతేజ్ పూర్తి స్తాయిలో కోలుకున్నాడని,అయితే అతనికి పూర్తి స్థాయిలో మెమొరీ రికవరీకి , అవయవాల యాక్టివ్ గా పనిచేయడానికి ఫిజియోథెరపిఅవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి  నేరుగా బేగంపేటలోని  అనంత రీహాబ్ సెంటర్ లోని న్యూరో విభాగానికి తరలించారు. ప్రస్తుతం  అనంత రిహాబ్ సెంటర్ లో శ్రీతేజ్ కు  వైద్య చికిత్సలతో పాటు ఫిజియో థెరపీ చికిత్సలు అందిస్తున్నారు.

ఈ సందర్బంగా  అల్లు అరవింద్ మాట్లాడుతూ,  శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోందన్నారు. శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, అతడు  చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు చెప్పారని  అల్లు అరవింద్ పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని  ఆయన  ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags
Join WhatsApp

More News...

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న? హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్‌గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది....
Read More...
National  International   State News 

బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి

బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి ఢాకా జనవరి 01: భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్‌కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో...
Read More...
National  Comment  State News 

అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?

అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు? న్యూ ఢిల్లీ జనవరి 01: దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం...
Read More...

జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు)  నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్...
Read More...

ఉత్తమ సేవ పథకాల కి  ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ  అశోక్ కుమార్ 

ఉత్తమ సేవ పథకాల కి  ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని ఎస్పీ  తెలిపారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం  అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక  అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్...
Read More...
State News 

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్ హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్...
Read More...

కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు  జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.  *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* 2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు...
Read More...
Local News  Crime  State News 

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే...
Read More...

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు) జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో...
Read More...

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
National  State News 

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’ న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు): దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశ సైనిక చరిత్రలోనే ఓ వినూత్న ఘట్టంగా నిలవనుంది. ఈ యానిమల్...
Read More...