శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్
సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :
పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్ లో ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు.
సోమవారం ఆయన బేగంపేట్ లోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి శ్రీతేజ్ ను స్వయంగా కలిశారు. రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్సపొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి , అతనికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పూర్తి స్థాయిలో రికవరీఅయ్యేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాలను సైతం అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పుష్స–2 సినిమా ప్రీవ్యూ షోకు వెళ్లిన శ్రీతేజ్ కుటుంబ సభ్యులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలపాలైన శ్రీతేజ్ ను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు.
దాదాపు 146 రోజుల పాటు చికిత్స పొందిన శ్రీతేజ్ ను వైద్యులు ఏప్రిల్ 30 న డిశ్చార్జ్ చేస్తూ శ్రీతేజ్ పూర్తి స్తాయిలో కోలుకున్నాడని,అయితే అతనికి పూర్తి స్థాయిలో మెమొరీ రికవరీకి , అవయవాల యాక్టివ్ గా పనిచేయడానికి ఫిజియోథెరపిఅవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి నేరుగా బేగంపేటలోని అనంత రీహాబ్ సెంటర్ లోని న్యూరో విభాగానికి తరలించారు. ప్రస్తుతం అనంత రిహాబ్ సెంటర్ లో శ్రీతేజ్ కు వైద్య చికిత్సలతో పాటు ఫిజియో థెరపీ చికిత్సలు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోందన్నారు. శ్రీతేజ్ రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, అతడు చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు చెప్పారని అల్లు అరవింద్ పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన దావ వసంత
జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం సన్నిధిలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రత్యేక పండుగలలో ఒకటని తెలిపారు. సంక్రాంతి... వైద్య విద్యార్థిని శ్రీనితకు సత్కారం
జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు అంజయ్య కుమార్తె బొడ్డుపల్లి శ్రీనిత సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రామగుండం వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా ఆమెకు అభినందన సత్కారం నిర్వహించారు.
కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం, జగిత్యాల అధినేత గుండేటి... కట్కాపూర్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు
రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు):
కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది.
గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ... ఇస్రో ప్రయోగం విఫలం – 16 ఉపగ్రహాలు సముద్రంలో పతనం
శ్రీహరికోట జనవరి 13, (ప్రజా మంటలు):
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన తాజా ఉపగ్రహ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపాల్సిన 16 చిన్న ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేక సముద్రంలో పడిపోయినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కిట్ నాణ్యతపై రాజీ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి... రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు.
యూసుఫ్గూడలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్పై... మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
👇
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్ను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్ ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను అసెంబ్లీ ముందు... గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గొప్ప కళాఖండాల కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. కళాకారుల ప్రతిభ స్లాఘనీయమని ఆయన కొనియాడారు.
సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని డా. చిన్నారెడ్డి ప్రారంభించారు.... డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన డీఏ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) అధ్యక్షుడు వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు.
సోమవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజేటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎస్.కే. మస్తాన్తో కలిసి మాట్లాడారు.
2023... మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు ):
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. తలసాని అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
తలసాని వ్యాఖ్యలకు నిరసనగా బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.... సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కనికట్ల హరి, మాజీ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజలు ముగ్గులు, పిండి వంటకాలు, పతంగులతో పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
ముఖ్య అతిథిగా... 