శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

On
శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

సికింద్రాబాద్ మే 05 (ప్రజామంటలు) :

 పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం  రిహాబిలిటేషన్ సెంటర్ లో  ఫిజియో థెరపి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి  అల్లు అరవింద్ పరామర్శించారు.

 సోమవారం ఆయన బేగంపేట్ లోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి శ్రీతేజ్ ను స్వయంగా  కలిశారు. రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్సపొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి , అతనికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పూర్తి స్థాయిలో రికవరీఅయ్యేందుకు ఎంత సమయం పడుతుందనే విషయాలను సైతం అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  పుష్స–2 సినిమా ప్రీవ్యూ షోకు వెళ్లిన శ్రీతేజ్ కుటుంబ సభ్యులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి  ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలపాలైన శ్రీతేజ్ ను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు.

దాదాపు 146 రోజుల పాటు చికిత్స పొందిన శ్రీతేజ్ ను వైద్యులు  ఏప్రిల్ 30 న డిశ్చార్జ్ చేస్తూ శ్రీతేజ్ పూర్తి స్తాయిలో కోలుకున్నాడని,అయితే అతనికి పూర్తి స్థాయిలో మెమొరీ రికవరీకి , అవయవాల యాక్టివ్ గా పనిచేయడానికి ఫిజియోథెరపిఅవసరమని సూచించారు. వైద్యుల సలహా మేరకు  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి  నేరుగా బేగంపేటలోని  అనంత రీహాబ్ సెంటర్ లోని న్యూరో విభాగానికి తరలించారు. ప్రస్తుతం  అనంత రిహాబ్ సెంటర్ లో శ్రీతేజ్ కు  వైద్య చికిత్సలతో పాటు ఫిజియో థెరపీ చికిత్సలు అందిస్తున్నారు.

ఈ సందర్బంగా  అల్లు అరవింద్ మాట్లాడుతూ,  శ్రీ తేజ్ కోలుకోవటం కోసం మా కుటుంబం అంతా ఎదురుచూస్తోందన్నారు. శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, అతడు  చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు చెప్పారని  అల్లు అరవింద్ పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని  ఆయన  ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం...  - ఎమ్మెల్యే సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు) శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక...
Read More...
Local News 

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో  వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ*  వాసవీ మాత        
Read More...
Local News 

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు    బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు)  సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి బుగ్గారం ఎస్సై జి.సతీష్  వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి  వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక...
Read More...
Local News  Crime 

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి

పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో...
Read More...
Local News 

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు . జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న  వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి...
Read More...
State News 

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”    హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు....
Read More...
Local News 

ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ

ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని...
Read More...
National  State News 

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు); తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్‌పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.నీళ్లు, నిధులు,...
Read More...
Local News 

ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు

ఘనంగా సత్య సాయి ఆరాధన మహోత్సవ వేడుకలు   జగిత్యాల ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయము నగర సంకీర్తన అల్పాహార వితరణ రుద్ర పారాయణము రుద్రాభిషేకము మధ్యాహ్నం అర్హులైన వారికి వీల్ చైర్ ల పంపిణీ దుస్తుల...
Read More...
Local News 

జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం

జగిత్యాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ ఆమోదం      జగిత్యాల ఏప్రిల్ 24 ( ప్రజా మంటలు)  పురపాలక సంఘం కార్యాలయంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు  సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన కో-ఆప్షన్ ఎన్నికకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశము కౌన్సిల్ సమావేశములో వీరబత్తిని పద్మజ, గట్టు సతీష్, తస్లీం సుల్తాన మరియు మహమ్మద్ అబ్దుల్ కదీర్ అలియాస్ ముజ్జు భాయి...
Read More...
Local News 

సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్

సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్ జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (DCCB)లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని పిఎసిఎస్ తాజా మాజీ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోతారం పిఎసిఎస్...
Read More...
Local News 

వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

వరి ధాన్యం కుప్పలను పరిశీలించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత    సారంగాపూర్ ఏప్రిల్ 24 (ప్రజా మంటలు)  మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని వరి ధాన్య కుప్పలను రైతులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నిన్న కురిసిన పడగళ్ల వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తొందరగా...
Read More...