కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలి.. అన్యాయం జరిగితే చర్యలు తప్పవు....
క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి మే 08(ప్రజామంటలు)
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ,రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58 వ,పుట్టినరోజు సందర్భంగా గురువారం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా స్వాగతం పలికి అనంతరం మంత్రి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకొండ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.2014 నుంచి 2023 డిసెంబర్ వరకు పది సంవత్సరాలలో హుస్నాబాద్ నియెాజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూంలు సెలక్షన్ చేయగా అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు.పది ఏళ్లలో నియెాజకవర్గంలోని మండలాల్లో భీమదేవరపల్లి జీరో, సైదాపూర్ జీరో, ఎల్కతుర్తి జీరో,కొహెడ జీరో,అక్కన్న పేట జీరో, అన్నారు. నియెాజకవర్గంలోని 200 ఇండ్లు మాత్రమే
ఒక హుస్నాబాద్ టౌన్ లో 168 ఇండ్లు, ఒక సైదాపూర్ లో 20 ఇండ్లు ప్రోగ్రెస్ లో చూపించారన్నారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు.ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంది. సంబంధించి ఎంపిక ప్రక్రియ గ్రామాలలో వీటిని పేదలల్లో పేదలకు ఇవ్వాలి అన్నారు ఎందుకంటే ఇల్లు కావాలని చాల డిమాండ్ ఉంది.ఆర్హులు కూడా చాలామంది ఉన్నారు దానికి నేను ఒప్పుకుంటా, కానీ అందులో నియెాజకవర్గానికి 3500 పూర్తిగా పంచాలన్నప్పుడు జనాభా ప్రకారం 100 మందికి ఒకటి వస్తుంది. కానీ మళ్లీ రెండు నెలలకు మల్ల 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి.మల్ల నెక్స్ట్ ఇయర్ కు 3500 ఇందిరమ్మ ఇల్లు అందరికీ వస్తాయి. ఓపిక పట్టండి మేము అందరికీ ఇస్తాం,కానీ గ్రామాల్లో అధికారులు కానీ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేయాలని చెప్తున్నా .గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలని అన్నారు.ఇళ్ల ఎంపిక వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఉపయెాగపడాలి అని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో భూ భారతి మెడల్ గా అక్కనపేట మండలం ఎంపిక అయిది.సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.సిద్దిపేట జిల్లాలో కొత్తగా 46 వేల మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం వచ్చాయి. అని తెలిపారు.
ఎవరైనా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల జోక్యంలో అధికారులు కానీ మా కార్యకర్తలైన లీడర్లైన బ్రోకర్లైన ఒక్క రూపాయి తీసుకున్నట్లయితే నేనే దగ్గరుండి క్రిమినల్ కేస్ పెడతానని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టెంపెల్లి ఐలయ్య, కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా,యూత్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొలుగూరి రాజు,ఆదరి రవి,బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఊస కోయిల ప్రకాష్,చిదురాల స్వరూప,పిడిచెట్టు కనకయ్య,గజ్జల రమేష్,చిట్కురి అనిల్, నగర బోయిన నాగరాజు, కాంతారావు, గజ్జల సురేష్, మురళి, సుదర్శన్ రెడ్డి, మాడుగుల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత మార్కెట్లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... మెహదీపట్నం రైతు బజార్ను సందర్శించిన కవిత – మోడ్రన్ మల్టీ లెవల్ మార్కెట్గా అభివృద్ధి చేయాలని డిమాండ్
మెహందీపట్నం డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
మెహదీపట్నం రైతు బజార్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు లేకపోవటంతో చాలా మందికి ఇది రైతు... ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటే ఆయుధం: మాజీ మంత్రి రాజేశం గౌడ్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ గారు సతీమణి శ్యామలాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు... సీసీ కెమెరాల నూతన నైపుణ్యాలపై భారత్ భవన్లో ముగిసిన మూడు రోజుల ప్రదర్శనలు
ఢిల్లీ డిసెంబర్ 14 (ప్రజా మంటలు)ఢిల్లీలో ప్రతి ఏటా సీసీ కెమెరాలపై ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పోకడలు వాడే ఉపకరణాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా ఈనెల 11 12 13 తేదీలలోభారత్ భవన్ మంటపం లో ప్రదర్శనలు నిర్వహించారు.
దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రోబోలు సెక్యూరిటీగా వ్యవహరించడం... ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు
సభ... 493 ఓట్ల మెజారిటి తో రాజగోపాల్ రావు విజయం
బీర్పూర్, డిసెంబర్, 14( ప్రజా మంటలు )
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామస్టులు రాజగోపాల్ రావు 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఓటేసి అక్కున చేర్చుకున్నారు.
35 ఏళ్ల నాడు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ వచ్చి ఆయన... జగిత్యాల జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో కలిపి మొత్తం 2,08,168 ఓట్లు ఉండగా 1,63,074 ఓట్లు పోలవ్వడంతో 78.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం... ఒకే కుటుంబం నుండి ముగ్గురు వార్డు సభ్యుల గెలుపుపై గ్రామస్తుల హర్షం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో జరిగినరెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ముగ్గురు గెలిచిన సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుటుంబం పైన ప్రజలకు విశ్వాసం వెరసి ఒకే కుటుంబం నుండి ముగ్గురు అభ్యర్థులు గెలవడం ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసం అని గ్రామస్తులు... ఎంటర్టైన్మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం
హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
"జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్టైన్మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల... రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో... సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ
న్యూ డిల్లీ డిసెంబర్ 14:
“సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ల... 