కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలి.. అన్యాయం జరిగితే చర్యలు తప్పవు....
క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి మే 08(ప్రజామంటలు)
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ,రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58 వ,పుట్టినరోజు సందర్భంగా గురువారం కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా స్వాగతం పలికి అనంతరం మంత్రి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకొండ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.2014 నుంచి 2023 డిసెంబర్ వరకు పది సంవత్సరాలలో హుస్నాబాద్ నియెాజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూంలు సెలక్షన్ చేయగా అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు.పది ఏళ్లలో నియెాజకవర్గంలోని మండలాల్లో భీమదేవరపల్లి జీరో, సైదాపూర్ జీరో, ఎల్కతుర్తి జీరో,కొహెడ జీరో,అక్కన్న పేట జీరో, అన్నారు. నియెాజకవర్గంలోని 200 ఇండ్లు మాత్రమే
ఒక హుస్నాబాద్ టౌన్ లో 168 ఇండ్లు, ఒక సైదాపూర్ లో 20 ఇండ్లు ప్రోగ్రెస్ లో చూపించారన్నారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టలేదు.ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంది. సంబంధించి ఎంపిక ప్రక్రియ గ్రామాలలో వీటిని పేదలల్లో పేదలకు ఇవ్వాలి అన్నారు ఎందుకంటే ఇల్లు కావాలని చాల డిమాండ్ ఉంది.ఆర్హులు కూడా చాలామంది ఉన్నారు దానికి నేను ఒప్పుకుంటా, కానీ అందులో నియెాజకవర్గానికి 3500 పూర్తిగా పంచాలన్నప్పుడు జనాభా ప్రకారం 100 మందికి ఒకటి వస్తుంది. కానీ మళ్లీ రెండు నెలలకు మల్ల 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి.మల్ల నెక్స్ట్ ఇయర్ కు 3500 ఇందిరమ్మ ఇల్లు అందరికీ వస్తాయి. ఓపిక పట్టండి మేము అందరికీ ఇస్తాం,కానీ గ్రామాల్లో అధికారులు కానీ రాజకీయాలకు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేయాలని చెప్తున్నా .గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలని అన్నారు.ఇళ్ల ఎంపిక వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఉపయెాగపడాలి అని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో భూ భారతి మెడల్ గా అక్కనపేట మండలం ఎంపిక అయిది.సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది.సిద్దిపేట జిల్లాలో కొత్తగా 46 వేల మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం వచ్చాయి. అని తెలిపారు.
ఎవరైనా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల జోక్యంలో అధికారులు కానీ మా కార్యకర్తలైన లీడర్లైన బ్రోకర్లైన ఒక్క రూపాయి తీసుకున్నట్లయితే నేనే దగ్గరుండి క్రిమినల్ కేస్ పెడతానని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్టెంపెల్లి ఐలయ్య, కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా,యూత్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ కొలుగూరి రాజు,ఆదరి రవి,బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఊస కోయిల ప్రకాష్,చిదురాల స్వరూప,పిడిచెట్టు కనకయ్య,గజ్జల రమేష్,చిట్కురి అనిల్, నగర బోయిన నాగరాజు, కాంతారావు, గజ్జల సురేష్, మురళి, సుదర్శన్ రెడ్డి, మాడుగుల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జర్నలిస్టులపై ఇక అక్రమ కేసులు చెల్లవా? వైరల్ మెసేజ్లో నిజమెంత?
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో వైరల్ అవుతున్న ఓ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “పెన్నుతో వార్తలు రాసే జర్నలిస్టులు, వీడియో కెమెరాలతో వార్తలను కవర్ చేసే రిపోర్టర్లు, శాటిలైట్ న్యూస్ చానళ్లు, యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే... ఘనంగా కుంకుమార్చనలు, విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళలు
జగిత్యాల ఆగస్టు 21 (ప్రజా మంటలు)పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం నంబి వేణుగోపాల ఆచార్య ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు ఆలయం పక్షాన అందజేశారు .
కార్యక్రమం అనంతరం తీర్థ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రూ.32 కోట్లతో నూకలపల్లి 2బీహెచ్కే కాలనీకి మౌలిక వసతుల కల్పన
రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు మంత్రి ఆదేశాలు
భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ఏడాదిన్నరలో రీ - సర్వే పూర్తి
ధర్మపురికి రెవెన్యూ డివిజన్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
- మంత్రి అడ్లూరి... ఎల్కతుర్తిలో కారులో అనుమానాస్పద మృతదేహం కలకలం
ఎల్కతుర్తి, ఆగస్టు 21 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 12వ వార్డులో కారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రెండు రోజులుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో నుంచి శుక్రవారం దుర్వాసన రావడంతో బాటసారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు... వేములవాడలో ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్పై భార్య ఫిర్యాదు
వేములవాడ, ఆగస్టు 20 (ప్రజా మంటలు):
వేములవాడలోని రెడ్డి భవన్లో తన భర్త ఈశ్వర్ సాయిని మాధురి రాథోడ్తో ఒకే గదిలో గుర్తించానని ఆరోపిస్తూ ఆయన భార్య శరణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఫోక్ సాంగ్స్లో నటించిన ఈశ్వర్ సాయి,... 2 వేల మంది అన్ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):
సింగరేణిలో అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
హెచ్ఎంఎస్ జనరల్... పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం - కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మళ్లీ భూ పంపిణీ జరగాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజా మంటలు):
తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధించాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి... కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం* *బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
*
జగిత్యాల జిల్లా ఆగస్టు17 {ప్రజా మంటలు}
మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మందికి ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం కొండగట్టు సమీపంలో జగిత్యాల నుంచి... బృందావనం ఫ్యామిలీ రిసార్ట్లో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
కొండగట్టు ఆగస్టు 16 (ప్రజా మంటలు)మల్యాల మండలం కొండగట్టు బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ లో ఆదివారం శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటింటా లలిత పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలశ గణాధిపతి గౌరీ పూజ తొలతగా నిర్వహించి అమ్మవారి విగ్రహానికి పల రసాలు పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ రకాలైన పుష్పాలతో అమ్మవారిని... 22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బీ... ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... 