సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్
. సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
జగిత్యాల మే 5 ( ప్రజా మంటలు)
సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని,
ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో మేధోసంపదకు కొదవ లేదని అయితే మేదో సంపత్తిని వెలికి తీసే నాయకత్వం అవసరమని తెలిపారు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహమిహిర, శుశ్రుతుడు, కణాధుడు లాంటి ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రపంచానికి అవసరమైన ఎన్నో ఆవిష్కరణలు అందజేశారని తెలిపారు. ఆధునిక కాలంలో కూడా జగదీష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, నంబి నారాయణన్ లాంటి వారు మన వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను బలోపేతం చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని 21 అగ్రశ్రేణి కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే ఉన్నారని తెలిపారు. స్వదేశంలో మన మేధావులకు సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో భారతీయుల మేధో సంపదను ఇతర దేశాలవారు ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలను, ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ద్వారా మేధో సంపద వికసిస్తుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ విద్య తెలియని వారిని ఎన్ని డిగ్రీలు ఉన్నా నిరక్షరాస్యులు గానే పరిగణిస్తారన్నారు. రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కంప్యూటర్ విద్యను అభ్యసించాలని సూచించారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 35 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణలో 125 మంది విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి అరవింద్ హాజరుకాగా వాల్మీకి ఆవాసం అధ్యక్షులు జడిగే పురుషోత్తం, కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ రావు, కమిటీ సభ్యులు సంపూర్ణ చారి, కంప్యూటర్ శిక్షణ ఇన్చార్జ్ బెక్కం మల్లేశం బొమ్మెర సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ

గొల్లపల్లిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ముగింపు

గాంధీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
