సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్
. సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113
జగిత్యాల మే 5 ( ప్రజా మంటలు)
సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని,
ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో మేధోసంపదకు కొదవ లేదని అయితే మేదో సంపత్తిని వెలికి తీసే నాయకత్వం అవసరమని తెలిపారు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరాహమిహిర, శుశ్రుతుడు, కణాధుడు లాంటి ప్రాచీన శాస్త్రవేత్తలు ప్రపంచానికి అవసరమైన ఎన్నో ఆవిష్కరణలు అందజేశారని తెలిపారు. ఆధునిక కాలంలో కూడా జగదీష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, నంబి నారాయణన్ లాంటి వారు మన వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను బలోపేతం చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని 21 అగ్రశ్రేణి కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే ఉన్నారని తెలిపారు. స్వదేశంలో మన మేధావులకు సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో భారతీయుల మేధో సంపదను ఇతర దేశాలవారు ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలను, ప్రకృతిని నిశితంగా పరిశీలించడం ద్వారా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ద్వారా మేధో సంపద వికసిస్తుందని తెలిపారు. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ విద్య తెలియని వారిని ఎన్ని డిగ్రీలు ఉన్నా నిరక్షరాస్యులు గానే పరిగణిస్తారన్నారు. రోజురోజుకు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కంప్యూటర్ విద్యను అభ్యసించాలని సూచించారు.
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 35 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంప్యూటర్ శిక్షణలో 125 మంది విద్యార్థిని విద్యార్థులు శిక్షణ పొందనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి అరవింద్ హాజరుకాగా వాల్మీకి ఆవాసం అధ్యక్షులు జడిగే పురుషోత్తం, కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ రావు, కమిటీ సభ్యులు సంపూర్ణ చారి, కంప్యూటర్ శిక్షణ ఇన్చార్జ్ బెక్కం మల్లేశం బొమ్మెర సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం
జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది.
గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు... మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష
ప్రయాగ్రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20:
మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు.
జరిగిన... :కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన
కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)
హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.
క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను జగిత్యాల ఏరియా... నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP
మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర... WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి
జ్యూరిచ్ / దావోస్ జనవరి 20:
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.... తమిళనాడు గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభ నుంచి వెళ్లిపోయారు
చెన్నై, జనవరి 20:
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఈ రోజు శాసన సభలో ప్రసంగించకుండానే బయటకు వెళ్లిపోయారు. సాధారణంగా శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యే రోజున గవర్నర్ ప్రసంగం చేయాలి. కానీ ఈసారి అది జరగలేదు.
సభ ప్రారంభ సమయంలో జాతీయ గీతం పాడలేదని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంతోనే... బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 19 జనవరి (ప్రజా మంటలు) :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు... ఏ పార్టీ తెలవని ఎమ్మెల్యే బీ-ఫారం ఎలా ఇస్తారు? – కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం: మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 19 (ప్రజా మంటలు):
తాను ఏ పార్టీకి చెందినవాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికలలో బీ-ఫారం ఇవ్వడం గురించి మాట్లాడడం విడ్డూరమని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా... జన్వాడ భూకుంభకోణం మళ్లీ తెరపైకి : నేడు నాంపల్లి కోర్టులో విచారణ
₹5,000 కోట్ల స్కామ్పై స్పాట్లైట్
సికింద్రాబాద్, జనవరి 19 (ప్రజా మంటలు):
జన్వాడ భూకుంభకోణం కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సుమారు ₹5,000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులను మళ్లీ విచారించే అవకాశముందని సమాచారం.
జన్వాడ-లింక్స్ కేసులో... మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తి – ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారం / హైదరాబాద్, జనవరి 19(ప్రజా మంటలు):
ఆదివాసీల అతిపెద్ద పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మక పుణ్యక్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు... బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నాబిన్ ఖరారు
న్యూఢిల్లీ, జనవరి 19 (ప్రజా మంటలు):భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నాబిన్ ఖరారయ్యారు. పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నితిన్ నాబిన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రక్రియలో... కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి ప్రశాంత్ కిషోర్ మద్దతు?
హైదరాబాద్, జనవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పని చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కవితతో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.... 