సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్
సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని అంతా వినియోగించుకోవాలని సికింద్రాబాద్ మహాంకాళి బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. న్యూ బోయిగూడ ఎంఎన్కే విఠల్ సెంట్రల్ కోర్టు రూప్ టాప్ టెర్రస్ పై నూతనంగా ఏర్పాటు చేసిన 36 కేడబ్ల్యూపీ కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ ను ఆయన బుధవారం రాత్రి ప్రారంభించారు. సోలార్ పవర్ తో అటు కరెంట్ బిల్లులు ఆదా అవడంతో పాటు ప్రభుత్వ కరెంట్ డిమాండ్పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. రూ18లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ6.50 లక్షల సబ్సిడీ ఇవ్వగా, అపార్ట్ మెంట్ ప్లాట్ నివాసితులు రూ11.50 లక్షలు కంట్రిబ్యూషన్ ఇచ్చారని అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ హనుమాన్లు తెలిపారు. కొచ్చి ఏయిర్ పోర్టు గత 10 ఏండ్లుగా కేవలం సోలార్ పవర్ తోనే నడుస్తుందని, కాని కొందరికి ఇప్పటికి సోలార్ పవర్ పై అపోహాలున్నాయన్నారు. పర్యావరణ హితమైన సోలార్ పవర్ మంచిదన్నారు. తమ 90 ప్లాట్ల అపార్ట్ మెంట్ లో కామన్ కారిడర్స్,మూడు లిఫ్టులు, మూడు వాటర్ పంపులు, సెల్లార్ విద్యుత్ అవసరాలకు సోలార్ పవర్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.సబ్సిడి ఇచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ ప్లాంట్ తో తమకు ప్రతినెలా రూ45 వేలు ఆదా అవుతాయన్నారు. ఉత్పత్తి అయిన పవర్ లో వాడుకోగా, మిగిలిన పవర్ ను ప్రభుత్వ పవర్ గ్రిడ్ కు విక్రయిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రామోజీ, సికింద్రాబాద్ లోక్సభ పార్టీ ఇంచార్జీ టి.రాజశేఖర్ రెడ్డి, నాయకులు సురేశ్, శివలింగం, కిరన్,సేతు మాధవరావు, వి.శ్రీనివాసన్, సుధీర్బాబు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్ఆర్సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్–నాదర్గుల్–కందుకూర్ ఎస్సి రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... గొల్లపల్లి లో రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
గొల్లపల్లి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అబ్బాపూర్ గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య – లచ్చవ్వ దంపతులు ద్విచక్ర వాహనంపై ఆదివారం తెల్లవారుజామున జగిత్యాల వైపు వెళ్తుండగా, ఎదురుగా జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు వస్తున్న తవేరా వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో... ఎల్కతుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఎల్కతుర్తి, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటం... ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ 28 స్థానాలు కైవసం చేసుకోగా, మన ప్యానల్ 15 స్థానాల్లో విజయం సాధించింది.
ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు... ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా నిలుస్తా – కవిత
కల్వకుర్తి డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
జంగారెడ్డి గూడెం పరిధిలో ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. జంగారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నిర్వాసిత రైతులతో మాట్లాడిన ఆమె, భూసేకరణలో జరిగిన అన్యాయాలను తీవ్రంగా ఖండించారు.
ట్రిపుల్ ఆర్... కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం – కరీంనగర్లో ఘనంగా వేడుకలు
కరీంనగర్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు... మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ఎల్కతుర్తి డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తిమండలం ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ కుమార్ తండ్రి అంబాల మొగిలి. జిలుగుల గ్రామా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల ప్రదీప్. రాజు ప్రవీణ్ గార్ల తండ్రి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు.... కంటోన్మెంట్ లో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ నేతలు..
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు) :
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమానికి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. ఆదివారం కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం సిఖ్ విలేజ్ లోని రాజేశ్వరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మల్కాజిగిరి... 