సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)
అధిక శబ్దం కలిగించే 130 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి
శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాల పై జిల్లా పోలీసులు కొరడా ఝలిపించారు .
గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ద్విచక వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న 130 వాహనాల సైలెన్సెర్స్ లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని,శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనీఖీలు చేపట్టడం జరిగిందన్నారు.
మాడిఫైడ్ సైలెన్సర్లను వాడితే ఆ వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేయొచ్చు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్ను కొనసాగిస్తూనే ఉంటుంది. ఇలాంటి చర్యలు వలన శబ్ద కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా తగ్గుతుందని ఎస్పీ తెలిపారు.
జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని కోరారు. ఎవరైనా మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న వాహనాలను గమనిస్తే సమీప పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ ,ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛ క్షీణత
హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది.
యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్... మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే... ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్
జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.... అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల... మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ
చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది.
ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను... సీషెల్స్కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఈ చర్చల అనంతరం,... అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు
ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను... ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు
గొల్లపల్లి ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు);
ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 6,7,,8,, వార్డుల అభ్యర్థులకు,తోడుగా ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజల మధ్యలో ఓట్లు అభ్యర్థిస్తున్నా, మాజీ ఎంబిపీపి నక్క శంకయ్య గోస్కుల జలంధర్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ చెందోళ గందే మాధవ రావు ఓరగంటి అశోక్ ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేయాలని, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తూ అవకతవకలకు తావు లేకుండా ఉండాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని... అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
ముంబై ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు)ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా... రాయికల్ లో బి ఆర్ ఎస్ నాయకుల ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాయికల్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను... 