దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి

On
దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నరహరి అనితర సేవలు

(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాల మిస్ట్...9440595494)

ఒక సాధారణమైన టైలర్ కుటుంబంలో జన్మించి సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని భారతదేశం గర్వించదగిన స్థానంలో నిలిచారు శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్.IMG-20250228-WA0414

తను పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ అధికారి కావాలని ధృఢ సంకల్పంతో... ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన తండ్రితో మొదటి సారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం  హైదరాబాద్ వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని ఈ రోజుకు కూడా పలు సందర్భాల్లో ఆయన గుర్తు చేసు కుంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన తన గమ్యం ముందర అవి చిన్నగానే కనిపించేవనీ చెప్తారు.

ఇంటి నుండి ప్రతి నెల డబ్బులు పంపించలేని పరిస్థితి ఉండడంతో నెల వారి కర్చులకోసం  ట్యూషన్స్ చెప్తూ ఇంజనీరింగ్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన గొప్పతనం ఆయనది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసేస్, ( IES ) లో ఉత్తీర్ణత సాధించి ఒక సంవత్సరం పాటు సైంటిస్ట్ గా సేవలు అందించారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఒక సంవత్సరం పాటు IES ఉద్యోగం చేసి తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ  స్టడీ సర్కిల్లో పూర్తి స్థాయిలో సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టారు.

2001 లో సివిల్స్ లో ఆల్ ఇండియా 84వ ర్యాంక్ సాధించి మధ్య ప్రదేశ్ క్యాడర్ IAS అధికారిగా నియమింప బడ్డారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో ఆ స్థానంలో నిలిచిన వారు ప్రతి పోస్టింగ్ లో తన మార్క్ పనితనంతో ప్రజల మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మన్ననలు పొందుతున్నారు. మునిసిపల్ కమిషనర్ మొదలుకొని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా మధ్య ప్రదేశ్ లోని ఎన్నో జటిలమైన సమ్యసలకు సమాధానంగా నిలిచారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించిన అవార్డులే వారి పని తీరుకు నిదర్శనం.

నరహరి హమారా లాడ్లి లక్ష్మి యోజన(బంగారు తల్లి) పథకం రూపొందించారు. భేటీ బచావో - భేటీ పడావో పథకానికి పునాదులు వేసారు.
సోషల్ మీడియా ద్వారా గ్రివియన్స్ మొదలుపెట్టిన మొదటి ఐఏఎస్ అధికారిగా నిలిచారు. హరియాలి (హరిత హారం) అనే కార్యక్రమంతో ఒకే రోజు లక్ష మొక్కలని నాటించారు. ఇండోర్ సిటిని స్వచ్ సర్వెక్షన్ లో క్లీనేస్ట్ సిటి ఆఫ్ ఇండియా గా నిలిపారు. ఇండోర్ జిల్లాని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత జిల్లాగా నిలిపారు.
గ్వాలియర్ జిల్లాలోని 95 శాతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు జనసంద్రంగా ఉండే ప్రదేశాల్లో  దివ్యాంగులకోసం కచ్చితంగా రాంప్ లు కట్టించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా ఒక్క సంవత్సరంలో 36 లక్షల మంది యువకులకు బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టారు.

నరహరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. వికలాంగులకోసం వారు చేసిన సేవలను మరియు స్వచ్ సర్వెక్షన్ - ఇండోర్ కు గానూ కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రపతి అవార్డు అందించారు.
ప్రతి సంవత్సరం భారతదేశ ఉత్తమ ఐఏఎస్ అధికారులలో పలు ఏజెన్సీస్ మరియు ప్రభుత్వం ఇచ్చే జాబితాలో టాప్ 5 ఐఏఎస్ అధికారిగా నిలిచారు.


మధ్య ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తు అన్ని విజయాలు సాధించినప్పటికి తను పుట్టిన గడ్డకి సేవా చేయాలని ఆలోచనతో తన మిత్ర బృందం ద్వారా ఆలయ ఫౌండేషన్ ని స్థాపించి విద్యా, వైద్య మరియు ఉపాధి రంగాలలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

మారుమూల గ్రామాల్లో, తండాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. తలసెమ్మియా పిల్లల కోసం రక్తదాన శిబిరాలు వందలాది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

వెయ్యి మందికి పైగా వికలాంగులకు  కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలను అందించారు, నిరంతరాయంగా అందిస్తున్నారు.

ఎన్నో పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో స్వయంగా వ్యక్తిత్వ వికాసా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా వేల సంఖ్యలో కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేపట్టారు.

కార్పొరేట్ కంపెనీలలో యువతీ, యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

బసంతనగర్ లో శంకర వారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి వేల సంఖ్యలో నిరంతరాయంగా ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.

రాజ్యాంగ బద్ధంగా అన్ని అవకాశాలు అందరికీ దక్కాలి,  నిర్ణయాత్మకమైన స్థానాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని, నాయకులుగా ఎదిగే అవకాశం అందరికి రావాలని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్న యువతకి లీడర్షిప్ ట్రైనింగ్ క్లాసెస్ జన అధికార సమితి ద్వారా నిర్వహిస్తున్నారు.

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని అవకాశాలు అన్ని వర్గాలు అందిపుచ్చుకొని విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు.

నైపుణ్యం కలిగిన యువతీ యువకులకు మరియు బ్యాంకులకు వారధిగా BICCI సంస్థ ఉంటు లోన్లు వచ్చే విధంగా సహకారం అందిస్తున్నారు.
దైవం మానవ రూపేణా  అన్న నానుడికి   నిలువెత్తు నిదర్శనం నరహరి ఐ ఎ ఎస్...

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...