పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సికింద్రాబాద్, జూన్ 04 (ప్రజామంటలు):
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చనుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సికింద్రాబాద్ మండల పరిధిలోని భోలక్ పూర్ లో ఉన్న మేకలమండి ప్రాథమికొన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. కొత్తగా నిర్మించిన విశాలమైన అదనపు తరగతి గదులను, విద్యార్థులకు అనుకూలంగా ఉన్న టాయిలెట్స్ బ్లాక్ ను ఆయన పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ప్రైవేటు పాఠశాల కంటే దీటుగా మేకల మండి పాఠశాల రూపుదిద్దుకున్నదని, అందరూ కలిసి అడ్మిషన్లు పెంచడానికి సహకరించాలని కలెక్టర్ వారితో అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం తప్పకుండా కల్పిస్తుందని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రాజు, కోశాధికారి శేషగిరిరావు, కే. మల్లికార్జున రెడ్డి కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఏడవ తరగతి పాసై ఈ ఏడాది నుండి ఎనిమిదవ తరగతి లోకి వెళ్తున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను, ఉపాధ్యాయులను వెంటనే మంజూరు చేయాలని, ఉన్నత పాఠశాల గా ఈ స్కూలు అప్ గ్రేడ్ చేయాలని వారు కోరారు. సికింద్రాబాద్ తహసిల్దార్ పాండు నాయక్, విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ షఫీ, డీఈ సంజీవ్, ఏఈ వెంకట్, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి, పాఠశాల హెచ్.ఎం. స్వరూప, పూర్వ హెచ్.ఎం.మల్లికార్జున రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
