పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
మెట్టుపల్లి జూన్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు అందరి పైన ఉందని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రోజు రోజుకి మారుతున్న జీవన విధానాలు, యాంత్రికరణ వలన పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా అలవాటు చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తు తరాల్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం ప్రకృతిని మరియు పర్యావరణాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ మరియు జిల్లా అటవీ అధికారి యం. రవి ప్రసాద్ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పలు సూచనలు చేసారు.అంతకుముందు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కల్ని సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు నాటారు.
ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రామ్ దాస్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, లోక్ అదాలత్ మెంబర్లు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, న్యాయవాదులు మన్నె గంగాధర్, గురిజెల గోపి, రాజ్ మహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, మగ్గిడి వెంకట నర్సయ్య, కుమరం శ్రీనివాస్, కోటగిరి వెంకటస్వామి, ఏలేటి రామ్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి, పోలకొండ దయాకర్ వర్మ, కాజీపేట స్రవంతి, ఆకుల మానస, అటవీ అధికారులు అరుణ్ కుమార్, సురేష్ కుమార్, చైతన్య శ్రీ, ప్రదీప్, సాయిరాం, సత్తర్, మధు తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
