అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్
జగిత్యాల జూన్ 5 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద గల చింతకుంటను స్థానిక శాసనసభ్యులు చొరవతో మినీ ట్యాంక్ బండ్ గా రూపుదిద్దుకొంది. చింతకుంట కట్ట పైన చాకలి ఐలమ్మ మరియు బతుకమ్మ విగ్రహాలు ఏర్పాటు చేశారు. మినీ ట్యాంకుబండ్ గా పిలువబడే చింతకుంట కట్టపైన మంచి ఏర్పాట్ల తో పాటు వాకింగ్ చేసే వాకర్స్ కు ఉపయుక్తంగా ఉంది. అంతేకాకుండా కట్ట చివరి భాగంలో జిమ్ము ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపాటి పిల్లలు ఆడుకోవడానికి జారుడుబండ లాంటి ఏర్పాట్లు సైతం ఉన్నాయి.
కట్టకు మరో పక్కన శ్రీ గుండు ఆంజనేయ స్వామి ఆలయం ,శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. లారీల కు మినీ ట్యాంక్ బండ్ అడ్రస్ గా మారడంతో లారీల చాటున రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తాగిన సీసాలు సైతం ఆలయ ఆవరణలో వేసిపోతున్నారని స్థానిక భక్తులు ఆందోళన చెందుతున్నారు. లారీలు నిలుపుకోవడానికి ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతము లో ప్రత్యేక స్థలం ఉన్నప్పటికీ మినీ ట్యాంకుబండుకు మరియు దేవాలయాలకు అనుకునే లారీ లు ఉంచడంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు చింతకుంట మినీ ట్యాంక్ బండ్ పై లారీలు నిలుపకుండా చొరవ తీసుకున్నట్లయితే ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు అంటున్నారు . చీకటి పడిన తర్వాత జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల కు అడ్డుకట్ట వేయడానికి స్థానిక పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి సదరు కార్యకలాపాల కు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
