బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు
సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు):
:
ముస్లింలకు పవిత్ర పండుగ బక్రీదును పురస్కరించుకుని సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్గ్రౌండ్ లో గొర్రెపొట్టేళ్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్టాల్స్లల్లో మేకలు, పొట్టేళ్ల క్రయ అమ్మకాలతో సందడి నెలకొంది. చిలకలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన నలభై ముస్లిం బస్తీలు, నగరంలోని పలు ప్రాంతవాసులు గొర్రెపొట్టేళ్లను కొనుగోలు చేసేందుకు ఇక్కడకే తరలిరావడంతో ప్రతి ఏటా కోట్లాది రూపాయల పొట్టేళ్ల వ్యాపారం ఇక్కడ జరుగుతోందని అంచనా. శనివారం బక్రీద్ పండుగ ఉండగా, రెండు రోజుల ముందు నుంచే గొర్రెపొట్టేళ్ళ అమ్మకాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, జమ్ముకాశ్శీర్, రాంపూర్, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో గొర్రెపోట్టేళ్లను ఇక్కడికి అమ్మకానికి తీసుకువచ్చారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు శానిటేషన్, స్టాల్స్ ఏర్పాట్ల పనులను జీహెచ్ఎమ్సీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
