రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

On
రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే  - కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్

తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ?ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ?

ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం 

హైదరాబాద్ జూన్ 04:

కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించారు.

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ గారు ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. 

ఇందిరా పార్వk వద్ద జరిగిన ధర్నాలో ఆమె ప్రసంగం: 

కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ?

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు.ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చు.కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు.

IMG-20250604-WA0020

అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం... ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం.మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు

కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదు.తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారు.గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారు

మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటు

కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోంది.90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలి. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ?

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు.గోదావరి ‌ - పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను.చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదు.8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదు

బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయం.బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలి.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలి.

ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ?

గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది.మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారు.ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము

హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తాం

మహాధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముగింపు వ్యాఖ్యలు

కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది... కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసము లేదు ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టింది 

నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారు .కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కెసిఆర్ బాగు చేయించారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయినయ్ 

కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పలిగిపోయాయి ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా తనెల్ కూలిపోయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖం ని అద్దంలో చూసుకోవాలి.ఎస్ ఎల్ బి సి టనల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది 

కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ?

కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది.కాలేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది.తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టాలి.

తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీళ్లు ఇవ్వాలి. కాలేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 99% పనులు పూర్తయ్యాయి. మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను 

కాలేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. కాబట్టి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని బిజెపిని డిమాండ్ చేస్తున్నాను.ఎన్నికలు రాగానే కర్ణాటకలోని అపర భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు 

బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేస్తున్నాను.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిందే దాదాపు 80000 కోట్ల వ్యయంతో,అందలో లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు ? 

బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. గోదావరి జలాలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ జాగృతి నడుం బిగించింది

Tags

More News...

Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...
Local News 

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి  త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్‌ క్లినిక్‌లో  శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్‌వెన్షన్‌ ప్రొసీడర్స్‌ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎన్‌...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.    రాయికల్  జూన్ 6 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను నిందితుడు  సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను...
Read More...
Local News 

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్              జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు  )                                                                                      జిల్లాలో గల ఈ వీ ఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. అందువలన ఈవీఎం గోడౌన్  సందర్శించడం జరిగిందని తెలిపారు.             కలెక్టర్ వెంట...
Read More...
Local News 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్ జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు) మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు. జగిత్యాల రూరల్...
Read More...
Local News 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు)  బక్రీద్ పండగ ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. ఈనేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ తరపున భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ,మసీదులు, మార్కెట్ ప్రాంతాలు,టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ  

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ   జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) జిల్లా స్పెషల్ బ్రాంచ్  విభాగం లో  హెడ్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏ ఎస్ ఐ)గా పదోన్నతి పొందిన మహమ్మద్ ఆరిఫ్  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ఏఎస్ఐ  పదోన్నతి స్టార్ చిహ్నాన్ని అలంకరించి...
Read More...
Local News  State News 

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

 దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్  జూన్ 07:తెలంగాణ సోయి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందిదాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరారేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్...
Read More...
Local News 

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు)::ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదును పురస్కరించుకుని సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్‌గ్రౌండ్ లో గొర్రెపొట్టేళ్ల విక్రయ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్టాల్స్‌లల్లో మేకలు, పొట్టేళ్ల క్రయ అమ్మకాలతో సందడి నెలకొంది.  చిలకలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన నలభై ముస్లిం...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ.. మొక్కలపెంపకం, ఇంకుడు గుంతలపై అవెర్నెస్ సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం  సోమ సుందరం వీధి, మంజు థియేటర్, ప్యాట్నీ సెంటర్ ల మీదుగా మొక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఎస్వీఐటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
Read More...