అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి 

On
అడ్లూరి

కొనసాగుతున్న భవనాల నిర్మాణ పనులు 
త్వరలో ప్రారంభం కానున్న మరిన్ని పనులు


బుగ్గారం జూన్ 05 (ప్రజా మంటలు):


జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ధర్మపురి నియోజక వర్గ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క ప్రత్యేక చొరవ వల్లనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని ప్రముఖ ఉద్యమ కారుడు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మండల అభివృద్ధి పనుల సమీక్ష పై విలేఖరులతో మాట్లాడారు.

గతంలో నియోజక వర్గ కేంద్రంగా ఉండి, గత తొమ్మిది ఏండ్ల క్రితం మండల కేంద్రంగా ఏర్పడ్డ "బుగ్గారం" స్థానిక రాజకీయ నాయకుల స్వార్థం, నిర్లక్ష్యం, దోపిడీల కారణంగా అభివృద్ధి కి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రజల కోరిక, ప్రజా నిర్ణయాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటీ, మండల అభివృద్ధి కమిటి ల విజ్ఞాపనలు పరిగణన లోకి తీసుకొని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

మండల కేంద్రంలోని నడి బొడ్డున మండల ప్రజా పరిషత్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు, గ్రామ శివారులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు కొనసాగింపజేయడం,
పట్ల యావత్ మండల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తూ.... అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నీరాజనాలు పలుకుతూ... కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చుక్క గంగారెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "భూ - భారతి చట్టాన్ని" కూడా జిల్లాలో మొట్ట మొదటిసారిగా బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి రైతు సమస్యలు తీర్చడం కూడా మండల ప్రజలకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన వరంగా మారిందన్నారు.IMG-20250605-WA0006

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు యావత్ జిల్లా అధికార యంత్రాంగం బుగ్గారం మండల కేంద్రానికి తరలి వచ్చి భారీ సభతో రైతు సదస్సు నిర్వహించడం మండల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, నీటి సమస్య పరిష్కారం కోసం రాజకీయాల కతీతంగా అడిగిన వారికెళ్లా అన్ని గ్రామాల్లో బోర్ వెల్స్ వేయించడం, నూతన మండలంలో వివిధ గ్రామాలకు గల లింక్ రోడ్ల పనులు కూడా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేయడం ప్రజలను ఎంతగానో ఆకట్టు కుంటుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా చేపట్టడం, రైతు సమస్యలపై సత్వరమే స్పందించడం విడిసి, ఎండిసి ల, మండల ప్రజల విజ్ఞాపన ల మేరకు, ప్రజల వద్దకే అధికారులను అందరినీ తీసుకొని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా వచ్చి ప్రజా క్షేత్రంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం పట్ల మండల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై  "ప్రశంసల జల్లులు"  కురిపిస్తున్నారని  చుక్క గంగారెడ్డి సూచించారు. 

మండల ప్రజల సూచనల మేరకు త్వరలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా మండల కేంద్రంలోనే అనువైన స్థలాన్ని ఎంపిక చేసి తగిన నిధులు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి భవనాల నిర్మాణ పనులను మన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించ బోతున్నారని చుక్క గంగారెడ్డి ధీమా వ్యక్తం చేసారు.


ఈ ప్రభుత్వ హయంలోనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ, సహకారాలు, ఆయన కృషి వల్ల మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు.

విద్యకు లోటు లేకుండా జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం, మండల ప్రజలకు పూర్తి స్థాయి మెరుగైన వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డాక్టర్ల, వైద్య సిబ్బంది నియామకం, బుగ్గారం ఎక్స్ రోడ్డు నుండి రాయపట్నం వరకు డబల్ రోడ్డు నిర్మాణం, గ్రామాల్లో మిషన్ భగీరథ పైపు లైన్ల పునరుద్ధరణ,
 రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, చదునైన పర్మనెంట్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు, ఇతర పలు రకాల అభివృద్ధి పనులు కూడా చేపట్టేందుకు ఇప్పటికే విజ్ఞాపన పత్రాలు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అందజేశామని చుక్క గంగారెడ్డి తెలిపారు.

 వాటన్నిటినీ కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్వరలో అమలు చేస్తాడనే నమ్మకం తనతో పాటు మండల ప్రజలకు కూడా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

యువతను కాపాడేందుకు గంజాయి, డ్రగ్స్ నివారణ, వైన్స్ ద్వారా జరుగుతున్న మద్యం దళారుల దోపిడీ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు చేసిన నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి - అక్రమాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కోసం స్థానిక, జిల్లా ఉన్నతాధికారులతో  పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కాస్త దృష్టి పెట్టినట్లయితే బుగ్గారం మండలం మరింత అభివృద్ధి చెంది రాష్ట్రానికే ఆదర్శంగా నిలవడం ఖాయమని చుక్క గంగారెడ్డి సూచిస్తూ,ఆశాభావం వ్యక్తం చేసారు.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క సంపూర్ణ సహాయ, సహకారాలతో బుగ్గారం మండల అభివృద్ధి కమిటి, ఊరూర గ్రామ అభివృద్ది కమిటీ లను మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

Tags

More News...

Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...
Local News 

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి  త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్‌ క్లినిక్‌లో  శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్‌వెన్షన్‌ ప్రొసీడర్స్‌ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎన్‌...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.    రాయికల్  జూన్ 6 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను నిందితుడు  సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను...
Read More...
Local News 

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్              జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు  )                                                                                      జిల్లాలో గల ఈ వీ ఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. అందువలన ఈవీఎం గోడౌన్  సందర్శించడం జరిగిందని తెలిపారు.             కలెక్టర్ వెంట...
Read More...
Local News 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్ జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు) మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు. జగిత్యాల రూరల్...
Read More...
Local News 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు)  బక్రీద్ పండగ ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. ఈనేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ తరపున భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ,మసీదులు, మార్కెట్ ప్రాంతాలు,టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ  

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ   జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) జిల్లా స్పెషల్ బ్రాంచ్  విభాగం లో  హెడ్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏ ఎస్ ఐ)గా పదోన్నతి పొందిన మహమ్మద్ ఆరిఫ్  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ఏఎస్ఐ  పదోన్నతి స్టార్ చిహ్నాన్ని అలంకరించి...
Read More...
Local News  State News 

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

 దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్  జూన్ 07:తెలంగాణ సోయి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందిదాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరారేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్...
Read More...
Local News 

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు)::ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదును పురస్కరించుకుని సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్‌గ్రౌండ్ లో గొర్రెపొట్టేళ్ల విక్రయ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్టాల్స్‌లల్లో మేకలు, పొట్టేళ్ల క్రయ అమ్మకాలతో సందడి నెలకొంది.  చిలకలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన నలభై ముస్లిం...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ.. మొక్కలపెంపకం, ఇంకుడు గుంతలపై అవెర్నెస్ సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం  సోమ సుందరం వీధి, మంజు థియేటర్, ప్యాట్నీ సెంటర్ ల మీదుగా మొక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఎస్వీఐటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
Read More...