అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
కొనసాగుతున్న భవనాల నిర్మాణ పనులు
త్వరలో ప్రారంభం కానున్న మరిన్ని పనులు
బుగ్గారం జూన్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ధర్మపురి నియోజక వర్గ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క ప్రత్యేక చొరవ వల్లనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని ప్రముఖ ఉద్యమ కారుడు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మండల అభివృద్ధి పనుల సమీక్ష పై విలేఖరులతో మాట్లాడారు.
గతంలో నియోజక వర్గ కేంద్రంగా ఉండి, గత తొమ్మిది ఏండ్ల క్రితం మండల కేంద్రంగా ఏర్పడ్డ "బుగ్గారం" స్థానిక రాజకీయ నాయకుల స్వార్థం, నిర్లక్ష్యం, దోపిడీల కారణంగా అభివృద్ధి కి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రజల కోరిక, ప్రజా నిర్ణయాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటీ, మండల అభివృద్ధి కమిటి ల విజ్ఞాపనలు పరిగణన లోకి తీసుకొని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని నడి బొడ్డున మండల ప్రజా పరిషత్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు, గ్రామ శివారులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు కొనసాగింపజేయడం,
పట్ల యావత్ మండల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తూ.... అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నీరాజనాలు పలుకుతూ... కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని చుక్క గంగారెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "భూ - భారతి చట్టాన్ని" కూడా జిల్లాలో మొట్ట మొదటిసారిగా బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి రైతు సమస్యలు తీర్చడం కూడా మండల ప్రజలకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన వరంగా మారిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు యావత్ జిల్లా అధికార యంత్రాంగం బుగ్గారం మండల కేంద్రానికి తరలి వచ్చి భారీ సభతో రైతు సదస్సు నిర్వహించడం మండల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, నీటి సమస్య పరిష్కారం కోసం రాజకీయాల కతీతంగా అడిగిన వారికెళ్లా అన్ని గ్రామాల్లో బోర్ వెల్స్ వేయించడం, నూతన మండలంలో వివిధ గ్రామాలకు గల లింక్ రోడ్ల పనులు కూడా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేయడం ప్రజలను ఎంతగానో ఆకట్టు కుంటుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా చేపట్టడం, రైతు సమస్యలపై సత్వరమే స్పందించడం విడిసి, ఎండిసి ల, మండల ప్రజల విజ్ఞాపన ల మేరకు, ప్రజల వద్దకే అధికారులను అందరినీ తీసుకొని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా వచ్చి ప్రజా క్షేత్రంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం పట్ల మండల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై "ప్రశంసల జల్లులు" కురిపిస్తున్నారని చుక్క గంగారెడ్డి సూచించారు.
మండల ప్రజల సూచనల మేరకు త్వరలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా మండల కేంద్రంలోనే అనువైన స్థలాన్ని ఎంపిక చేసి తగిన నిధులు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి భవనాల నిర్మాణ పనులను మన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించ బోతున్నారని చుక్క గంగారెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
ఈ ప్రభుత్వ హయంలోనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ, సహకారాలు, ఆయన కృషి వల్ల మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు.
విద్యకు లోటు లేకుండా జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం, మండల ప్రజలకు పూర్తి స్థాయి మెరుగైన వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డాక్టర్ల, వైద్య సిబ్బంది నియామకం, బుగ్గారం ఎక్స్ రోడ్డు నుండి రాయపట్నం వరకు డబల్ రోడ్డు నిర్మాణం, గ్రామాల్లో మిషన్ భగీరథ పైపు లైన్ల పునరుద్ధరణ,
రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, చదునైన పర్మనెంట్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు, ఇతర పలు రకాల అభివృద్ధి పనులు కూడా చేపట్టేందుకు ఇప్పటికే విజ్ఞాపన పత్రాలు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అందజేశామని చుక్క గంగారెడ్డి తెలిపారు.
వాటన్నిటినీ కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ త్వరలో అమలు చేస్తాడనే నమ్మకం తనతో పాటు మండల ప్రజలకు కూడా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
యువతను కాపాడేందుకు గంజాయి, డ్రగ్స్ నివారణ, వైన్స్ ద్వారా జరుగుతున్న మద్యం దళారుల దోపిడీ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు చేసిన నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి - అక్రమాలు, గ్రామాల్లోని అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కోసం స్థానిక, జిల్లా ఉన్నతాధికారులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కాస్త దృష్టి పెట్టినట్లయితే బుగ్గారం మండలం మరింత అభివృద్ధి చెంది రాష్ట్రానికే ఆదర్శంగా నిలవడం ఖాయమని చుక్క గంగారెడ్డి సూచిస్తూ,ఆశాభావం వ్యక్తం చేసారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క సంపూర్ణ సహాయ, సహకారాలతో బుగ్గారం మండల అభివృద్ధి కమిటి, ఊరూర గ్రామ అభివృద్ది కమిటీ లను మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
