ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు
జూన్ 15వ తేదీన జగిత్యాలలో వెలిశాల కొండలరావు సన్మాన సభ
జగిత్యాల జూన్ 05:
జగిత్యాల డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం – ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు గారికి సన్మాన సభకు సన్నాహకాలు ప్రారంభం అయ్యాయి.జగిత్యాల డిగ్రీ కళాశాలలో 1966 నుండి 1972 వరకు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల బృందం, కళాశాల ప్రారంభ సమయంలో ప్రిన్సిపల్గా సేవలందించిన ప్రముఖ విద్యావేత్త వెలిశాల కొండలరావుకు సన్మాన సభ నిర్వహించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు.
94 సంవత్సరాల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్న, కొండలరావు సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సన్నాహక సమావేశానికి పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు వై. వెంకటేశ్వర రావు గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు తొలి ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ జి. రాజేశం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే పూర్వ విద్యార్థులు బి. నాగభూషణం, డా. సి. అనంతం, డా. లక్ష్మణరావు, పి. ఆనందం, గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థులందరూ తమ విద్యా కాలంలో వెలిశాల కొండలరావు ప్రభావం, ఆచార్యత్వం గురించి స్మృతులు పంచుకున్నారు. విద్యా పరంగా, వ్యక్తిత్వ వికాసంలో ఆయన పాత్రను గుర్తుచేసుకుంటూ గాఢమైన అనుబంధాన్ని వెలిబుచ్చారు.
ఈ సమావేశంలో 15 జూన్ 2025 తేదీన జగిత్యాలలో శ్రీ వెలిశాల కొండలరావు గారికి ఘన సన్మాన సభ నిర్వహించాలనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సన్మాన కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
