గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

On
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

 ఆభాపై 20 రాష్ర్టాల ప్రతినిధుల అధ్యయనం...
  స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపిపై వివరాల ఆరా.

సికింద్రాబాద్, మే 30 (ప్రజామంటలు):

ఆయుష్మాన్ భారత్ (ఆభా)డిజిటల్ మిషన్ వర్క్షాప్‌– 2 లో భాగంగా 20 రాష్ట్రాల నుండి రాష్ట్ర నోడల్ అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో  సౌకర్యాలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ సౌకర్యాలు మరియు నూతనం గా వేగవంతమైన ఓపీడీ సేవలు , స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్ లో డిజిటల్ సేవలు , టోకెన్ సిస్టం ద్వారా ఓపీ చీటీ, పైలట్ ప్రాజెక్ట్ గా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అందించే విషయాలను గాంధీ హాస్పిటల్ నోడల్ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు. క్రాస్-లెర్నింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారికి గాంధీ ఆసుపత్రిలో నందు అందుతున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి , సి యస్ ఆర్ యం ఓ డాక్టర్  శేషాద్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ 20 రాష్ట్రాలకు చెందిన వైద్యులు, నోడల్ అధికారులు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రోగుల రికార్డులు డిజిటల్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు వారి మొబైల్ నెంబర్ ద్వారా వారి డిజిటల్ హెల్త్ అకౌంట్ లో ఉంటాయని దీని ద్వారా వివరాలు, ల్యాబ్ రిపోర్టులు జీవితాంతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. 100శాతం డిజిటల్ చేయాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్కాన్ అండ్ షేర్ ద్వారా త్వరగా ఓపి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి మెడికల్ బృంద సభ్యులు డాక్టర్ పంకజ్ అరోరా, సౌరభ్ సింగ్, రితిక, బబిత, మరియు అబ్యుధయ్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, ఓపి ఆర్ యం ఓ ఆండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ అభా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ ఆర్ యం ఓ డాక్టర్ రజని, ఆర్. యం ఓ లు డాక్టర్ మీనాక్షి , డాక్టర్ నజీమ్, డాక్టర్ సుధీర్, డాక్టర్ యోగి, డాక్టర్ నవీన్, డాక్టర్ సరిత, యూసుఫ్, కిరణ్, జగదీష్, చిరంజీవి, సుప్రియ, నరేష్ , రాష్ట్ర బృందం దివ్య , సురేష్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నోడల్ అధికారులు ఉన్నారు.

Tags

More News...

Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. జగిత్యాల జూన్ 2: తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అవతరణ  దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవరణలో  ఆవిష్కరించారు. అనంతరం  తెలంగాణ ఉద్యమం లో ఉద్యమించిన...
Read More...
Local News 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  బుగ్గారం జూన్ 02:  బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపిపి, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మండల, గ్రామ ప్రత్యేక అధికారిని జి.సునిత లో జాతీయ జెండా ఆవిష్కరించారు. డిప్యూటీ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక  మార్పులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పని చేయాలని...
Read More...
Local News 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ  కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా. కోట నీలిమ నేతృత్వంలో ఘనంగా నిర్వహణ*బేగంపేట నుండి రసూల్‌పుర వరకు ఉత్సాహభరితంగా సాగిన ర్యాలీ సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఏఐసీసీ మెంటర్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా...
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.   ఇబ్రహీంపట్నం జూన్ 2 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల సమస్త రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సు నిర్వహించుటకు గ్రామాల వారిగా షెడ్యూలు
Read More...
Local News 

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు గొల్లపల్లి జూన్ 02 (ప్రజామంటలు) :  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గొల్లపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ,గ్రామపంచాయతీ కార్యాలయాలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకల్లో పలువురు పంచాయతీ కార్యదర్శిలు వ్యవహరించిన తీరు ప్రజలను గందరగోళానికి గురి చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు:  జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు:  జిల్లా ఎస్పీఅశోక్ కుమార్ గొల్లపల్లి జూన్ 02 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూన్ 1 ఒక్కటి నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ  తెలిపారు  పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్...
Read More...
Local News 

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన  తాసిల్దార్ వరంధన్  

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన   తాసిల్దార్ వరంధన్   గొల్లపల్లి జూన్ 02 (ప్రజా మంటలు):  మండల పరిషత్  కార్యాలయం సోమవారం  మండలం లోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేశారు  గ్రామాల ప్రజా పంపిణీ డీలర్ల  భూ భారతి అవగాహన సదస్సుకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు  ఇట్టి సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఆ గ్రామంలో ఒకరోజు ముందుగానే డబ్బు చాటింపు...
Read More...

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు 

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు  గొల్లపల్లి జూన్ 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం వ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు  స్థానిక  తాసిల్దార్ వరందన్, ఆవిష్కరించారు వ్యవసాయ మార్కెట్, రక్షకబట నిలయం మండల ప్రజా పరిషత్ విద్యుత్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయ తో పాటు  గ్రామ పంచాయతీలు తెలంగాణ ఎగురవేసి మహాత్ముల...
Read More...
Local News  State News 

సహాయ నటుడు కుర్మశంకర్ కు  ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

సహాయ నటుడు కుర్మశంకర్ కు  ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజా మంటలు): బన్సీలాల్ పేటకు చెందిన సహాయ నటుడు కుర్మశంకర్ ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు అందుకున్నారు. దివంగత మాజీ సీఎం, అలనాటి గొప్ప హీరో ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి  75 మంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన యాక్టర్లకు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డులను లయన్స్...
Read More...
Local News 

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది  ప్రభుత్వ విప్ అడ్లూరి

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది  ప్రభుత్వ విప్ అడ్లూరి ▪️ జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) త్యాగధనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అమరవీరుల పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అనంతరం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో తెలంగాణ...
Read More...
Local News 

స్వాతంత్ర్య సమరయోధుడు  కొండా లక్ష్మణ్ బాపూజీ

స్వాతంత్ర్య సమరయోధుడు  కొండా లక్ష్మణ్ బాపూజీ జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా అంగడి బజార్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు  తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  మాట్లాడుతూ.... స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త మహా వాది ఆయన భారత స్వతంత్ర ఉద్యమానికి గొప్ప మద్దతు దారుడు...
Read More...