గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం
ఆభాపై 20 రాష్ర్టాల ప్రతినిధుల అధ్యయనం...
స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపిపై వివరాల ఆరా.
సికింద్రాబాద్, మే 30 (ప్రజామంటలు):
ఆయుష్మాన్ భారత్ (ఆభా)డిజిటల్ మిషన్ వర్క్షాప్– 2 లో భాగంగా 20 రాష్ట్రాల నుండి రాష్ట్ర నోడల్ అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ సౌకర్యాలు మరియు నూతనం గా వేగవంతమైన ఓపీడీ సేవలు , స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్ లో డిజిటల్ సేవలు , టోకెన్ సిస్టం ద్వారా ఓపీ చీటీ, పైలట్ ప్రాజెక్ట్ గా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అందించే విషయాలను గాంధీ హాస్పిటల్ నోడల్ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు. క్రాస్-లెర్నింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వారికి గాంధీ ఆసుపత్రిలో నందు అందుతున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి , సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ 20 రాష్ట్రాలకు చెందిన వైద్యులు, నోడల్ అధికారులు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రోగుల రికార్డులు డిజిటల్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు వారి మొబైల్ నెంబర్ ద్వారా వారి డిజిటల్ హెల్త్ అకౌంట్ లో ఉంటాయని దీని ద్వారా వివరాలు, ల్యాబ్ రిపోర్టులు జీవితాంతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. 100శాతం డిజిటల్ చేయాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. స్కాన్ అండ్ షేర్ ద్వారా త్వరగా ఓపి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి మెడికల్ బృంద సభ్యులు డాక్టర్ పంకజ్ అరోరా, సౌరభ్ సింగ్, రితిక, బబిత, మరియు అబ్యుధయ్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ కుమారి, సి యస్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి, ఓపి ఆర్ యం ఓ ఆండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ అభా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ ఆర్ యం ఓ డాక్టర్ రజని, ఆర్. యం ఓ లు డాక్టర్ మీనాక్షి , డాక్టర్ నజీమ్, డాక్టర్ సుధీర్, డాక్టర్ యోగి, డాక్టర్ నవీన్, డాక్టర్ సరిత, యూసుఫ్, కిరణ్, జగదీష్, చిరంజీవి, సుప్రియ, నరేష్ , రాష్ట్ర బృందం దివ్య , సురేష్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నోడల్ అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
