చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి
మేకలమండిలో ప్రజల నరకయాతన
*పనిచేయని కొత్తగా నిర్మించిన కాలువ
సికింద్రాబాద్ మే 29 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మీదుగా మేకల మండి వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు నిలువకుండా నిర్మించిన కాలువ నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. గురువారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే చెరువులా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని పాదాచారులు, వాహనదారులు వాపోయారు. సుమారు 19 లక్షల వ్యయంతో ఇటీవల నిర్మించిన కాలువ లో నుంచి నీరు వెళ్ళక, వరద నీరు రోడ్డుపైనే నిలిచిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఈదారి వెంట నిత్యం నిండి ఉండే చెత్తాచెదారం తో పాటు చిన్న పాటి వర్షానికే రోడ్డు చెరువులా మారడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్తితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారులు స్పందించి, సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి

విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "
