బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మ పై దాడి బాధ్యులపై చర్యలకై
బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య డిమాండ్
• బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మ పై దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నాం
• దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
- టిబిఎస్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల డిమాండ్
జగిత్యాల మే 18 (ప్రజా మంటలు)
నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ శర్మ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సముద్రాల విజయసారధి తెలిపారు.
ఆదివారం జగిత్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా స్థానిక బ్రాహ్మణ సంఘ బాధ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడారు. దైవసేవలో నిమగ్నమైన బ్రాహ్మణ పూజారి సంజీవ్ పై దాడి చేయడం అమానుషమని, మరొక మారు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దాడికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అర్చకులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డాక్టర్ సముద్రాల విజయసారథి కోరారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు .అంతే కాకుండా బ్రాహ్మణులను అవహేళన పరిచే విధంగా వ్యవహరిస్తున్న వారిపై శిక్షించడానికి ప్రత్యేక చట్టం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మీడియా సమావేశంలో టీబీఎస్ఎస్ యువ నాయకులు గోవర్ధనగిరి ధీరజ్ కృష్ణమాచారి, నమిలకొండ యశస్వి భరద్వాజ్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చాకుంట వేణు మాధవరావు సిరిసిల్ల రాజేంద్ర శర్మ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
