అంబేద్కర్‌ అంటే అందరివాడని అర్థం... - అన్ని వర్గాలకు హక్కులు కల్పించిన చరిత్ర ఆయనదే - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

On
అంబేద్కర్‌ అంటే అందరివాడని అర్థం... - అన్ని వర్గాలకు హక్కులు కల్పించిన చరిత్ర ఆయనదే - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

       (సిరిసిల్ల. రాజేంద్ర శర్మ)
మహాదేవపూర్ ఏప్రిల్ 12 (ప్రజా మంటలు)
బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అంటేనే అందరివాడనే అర్థమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మహదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామంలో మాజీ సర్పంచ్ నాగుల సుజాత–లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌, భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్  పర్సన్ జక్కు శ్రీ హర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కలిస్ట్‌లంటే కేవలం ఎస్సీలు కాదని, అన్ని వర్గాలకు చెందిన వారని ఆయన అన్నారు. ఆనాడు రాజ్యాంగం రాసింది అంబేద్కర్‌ అని చెప్పిన తర్వాత కూడా ఆయనను ఒక్క సామాజికవర్గానికే అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ, విద్యావిధానం, మహిళలు, విద్యార్ధులు, కార్మికులకు ఏ రకమైన హక్కులుండాలని చెప్పింది అంబేద్కర్‌ అని ఆయన వివరించారు. అలాగే ఎస్సీలు, బీసీలకు రిజర్వేషన్‌లు కావాలన్నది కూడా ఆయననేనన్నారు. అయితే ఎస్సీల రిజర్వేషన్‌ల కోసం పోరాటం చేసిండని అంబేద్కర్‌ను ఎస్సీలకే పరిమితం చేయాలని చూశారని, అనేక కుట్రల ఫలితమేనని ఆయన వివరించారు.  ఇప్పటికైనా ప్రభుత్వాలు బారత రాజ్యాంగాన్ని అన్ని బాషల్లో ఒక సబ్జెక్ట్‌గా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.అన్ని వర్గాల కోసం పోరాడిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన, ఆకాంక్ష ఉండటం గొప్ప విషయమన్నారు. ఏప్రిల్‌ మాసమంతా మహనీయుల మాసమని, ఈ మాసంలో ప్రతి మహనీయుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

ప్రతి ఒక్కరు అంబేద్కర్‌ను అర్థం చేసుకోవాలి...పుట్ట మధూకర్‌, మాజీ ఎమ్మెల్యే మంథని

రాజ్యాంగం అందించమే కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్‌ బీఆర్‌ఎస్‌ అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ఆయన గురించి తెలుసుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మహాదేవ్‌పూర్‌ మండలం సూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహవిష్కరణలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈనాడు అంబేద్కర్‌ అంటే తెలియని వాళ్లు కేవలం ఎస్సీల కోసమే ఆలోచన చేసిండ్లని అనాలోచితంగా మాట్లాడుతున్నారని అన్నారు.

Tags

More News...

Local News 

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వాసవి మాత ఆలయంలో శుక్రవారం గురువారాల ఏకాదశి వ్రత ఉద్యాపన ఉత్సవము మధ్యాహ్నం 11 గంటలకు  ఘనంగా నిర్వహించారు. గురువార ఏకాదశి వ్రతం 11 మార్లు నిర్వహించవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రుతుసంబంధమైన దోషం వలన ఏర్పడిన పాప నివృత్తి కోసం ధర్మరాజు అడిగిన...
Read More...
Local News 

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం  8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 9(ప్రజా మంటలు)  రూరల్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన గిద్దె రాజయ్య కూతురు స్వేచ్ఛ వినికి సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండగా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉండగా గ్రామ మాజీ సర్పంచ్ చందా రజిత శేఖర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  దృష్టికి స్వేచ్ఛ...
Read More...
Local News 

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం చింతకుంట చెరువు సమీపంలో 108 స్తం బాలతో నిర్మాణమైన సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయము లో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా శుక్రవారం 100 మంది మహిళలు సామూహిక కుంకు మార్చన...
Read More...
Local News 

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)భారత దేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని, దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలోని  శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో...
Read More...
Local News 

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.  -విశ్వహిందూ పరిషత్ నాయకులు 

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి.   -విశ్వహిందూ పరిషత్ నాయకులు                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ   జగిత్యాల మే 9 (ప్రజా మంటలు)  ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రాన్ని సమర్పించిన జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏక్కడ పడితే అక్కడ...
Read More...
Local News 

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు   గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో సప్తమ బ్రహ్మోత్సవలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం  ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, నిత్య అభిషేకములు, దేవదాయ శాఖ సూచన ప్రకారం  "ఆపరేషన్ సిందూర్ "లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా . నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు  ఉదయం...
Read More...
Local News 

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న సైనికులకు అభినందనలు గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు):  ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్, ఎంపీవో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోని  శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో  శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా...
Read More...
Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...