వేరే అమ్మాయితో సహజీవనం - చితకబాదిన భార్య తరపు బంధువులు
రెడ్ హ్యాండెడ్ గా భార్యకు దొరికిన జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారి
సికింద్రాబాద్ ఫిబ్రవరి 21 (ప్రజామంటలు) :
జీహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ అడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ వేరే మహిళతో ఉండగా భార్య ఎస్. కళ్యాణి శుక్రవారం ఉదయం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. స్థానికులు, వారాసిగూడ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..గతంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఎస్.వి జానకి రామ్ ఇటీవల అక్కడి నుంచి బదిలీ అయి జీహెచ్ఎమ్సీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
వారాసిగూడ చర్చిగల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా భర్త జానకిరామ్ ఇంటికి రాకుండా వేరే అమ్మాయితో కలసి ఉంటున్నాడనే పక్కా సమాచారంతో తమ బంధువులతో కలసి భార్య కళ్యాణి శుక్రవారం ఉదయం మధురానగర్ కాలనీ లోని ఓ అపార్ట్ మెంట్ లోకి వెళ్ళి, తన భర్తను, ఓ అమ్మాయిని పట్టుకున్నారు. జానకిరామ్ తనకంటే 20 ఏండ్ల చిన్న వయస్సున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, అతడితో బంధువులు, భార్య కళ్యాణి వాగ్వివాదానికి దిగారు.
వీరి మద్య పెనుగులాట జరగడంతో కోపొద్రిక్తులైన కళ్యాణి బంధువులు జానకిరామ్ తో పాటు ఇంట్లో ఉన్న యువతిని బాగా చితకబాదారు. పక్కనే ఉన్న వారు డయల్ 100 కు కాల్ చేయడంతో వారాసిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, జానకిరామ్, దివ్య అనే అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కళ్యాణి, బంధువులు వారాసిగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి, కంప్లయింట్ ఇచ్చారు.
తన భర్త జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి ఆరోపించింది. 2018 లో జానకిరామ్ తో తనకు తిరుపతిలో పెండ్లి అయిందన్నారు. అయితే జానకిరామ్ కు అప్పటికే పెండ్లి అయినట్లు తమకు చెప్పకుండా మోసం చేశారని అన్నారు.
తాను కవల పిల్లల కలిగిన గర్బం దాల్చినప్పుడు తన కడుపులో తన్నిన భర్త జానకిరామ్ అబార్షన్ కు కారణమయ్యాడని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తనను అవమాన పరిచేవాడని, భర్త, అతడి ప్రియురాలు దివ్య, అత్త, తో పాటు జానకిరామ్ కుటుంబసభ్యులపై కళ్యాణి వారాసిగూడ లో కంప్లయింట్ ఇవ్వగా, వారిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు, అడ్మిన్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)