తెలంగాణలో మొదటి స్థానానికి ఎదిగి మల్టీ స్టేట్ బ్యాంకు గా గాయత్రి బ్యాంకు.  బ్యాంక్  చైర్మన్ లక్ష్మారెడ్డి

On
తెలంగాణలో మొదటి స్థానానికి ఎదిగి మల్టీ స్టేట్ బ్యాంకు గా గాయత్రి బ్యాంకు.  బ్యాంక్  చైర్మన్ లక్ష్మారెడ్డి

 

గొల్లపల్లి ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా యందలి గొల్లపెల్లి యందు ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క 57 వ శాఖను బ్యాంకు చైర్మన్  ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ రోజు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు, పురప్రముఖులు, సహకార అధికారులు, ముఖ్యకార్యనిర్వహణాధికారి గార్లు పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.

అనంతరం జరిగిన సమావేశంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి  మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు మల్టీస్టేట్ బ్యాంకుగా రూ॥ 3062.50 కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించి కో-ఆపరేటివ్ వ్యవస్థలో అగ్రగామిగ పనిచేస్తున్నామని అన్నారు. గొల్లపెల్లి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోని బ్యాంకును ఆదరించాలని కోరారు. సహకార వ్యవస్థలో, కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తూ, 24 సంవత్సరాల కాలంలోనే 1741.15 కోట్ల డిపాజిట్లతో, 1321.35 కోట్ల ఋణాలను కలిగి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 56 బ్రాంచీలతో, 7 లక్షల 62 వేల మంది వినియోగదారులను కలిగి అన్ని విధాలుగా మంచి అభివృద్ధిని సాధించామని అన్నారు. బ్యాంకు యందు మొబైల్ బ్యాంకింగ్, ఎఇపిఎస్, యు.పి.ఐ. ఎ.టి.ఎమ్ సర్వీసులు, ఆర్.టి.జి.ఎస్ వంటి టెక్నాలాజికల్ సేవలతో పాటుగా, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశామని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తుందని, ఖాతాదారులకు అవసరమైన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తూన్నామని తెలియజేశారు.

బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్  మాట్లాడుతూ బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం సామాన్య మధ్యతరగతి, వర్తక వాణిజ్య వర్గాల ప్రజలకు కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలందించడమేనని, ఆన్లైన్ సేవలతో పాటుగా ATM, AePS, UPI, RTGS/NEFT వంటి అధునాతన సేవలను అందిస్తున్నామని, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా 1 లక్ష రూపాయల ప్రమాదభీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇట్టి సేవలను గొల్లపల్లి నగర వాసులు వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని కోరారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరో 09 బ్రాంచీలను ప్రారంబించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తద్వారా మొత్తం 66 బ్రాంచీలకు చేరుకుంటామని అన్నారు.

అనంతరం బింగి తిరుపతి,  ఏ జి ఎం మాట్లాడుతూ వినియోగదారులు మాపై చూపిస్తున్న ఎనలేని ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని, నగరవాసులు మరియు పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం బ్రాంచి హెడ్ నేరెళ్ళ మునీందర్  మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ ఆసరా పెన్షన్లను పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని రైతులకు వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పుర: ప్రముఖులు, వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు పాలక వర్గ సభ్యులైన ఎమ్. సౌజన్య, ఎ. రాజిరెడ్డి, ఎ.సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి. మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్ గార్లు, మరియు ఇతర సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...