లోక్ సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను పోలింగ్ కేంద్రం దిశగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే బాధ్యత అందరిది.
- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు ) :
మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అర్హతగల ప్రతి ఓటరును పోలింగ్ కేంద్రం దిశగా తీసుకువెళ్లి, ఓటు హక్కు వినియోగించుకునేలా చూసే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాఅన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.రాంబాబు తో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల వివరాలు వెల్లడించడంతో పాటుగా, జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికిగాను చేపట్టిన ఒక వినూత్నంగా ' ఓట్ల పర్వం-ఓటే సర్వం' అనే నినాదంతో కూడిన కార్యక్రమంను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ...ఈ లోక్సభ ఎన్నికల్లో గతంలోకన్నా ఎక్కువ ఓటింగ్ శాతం పెంచడానికే ఈ కార్యక్రమం ఆవిష్కరించడం జరిగిందన్నారు.జిల్లా లోని మూడు నియోజకవర్గాలలో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైన చోట సంబంధిత వ్యక్తులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
అలాగే, జగిత్యాల జిల్లా లోని మూడు నియోజకవర్గాలు ఉండగా, 7,12,710 మంది ఓటర్లున్నారని వివరించారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,81,924మంది ఓటర్లుండగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో 3,70,460 మంది ఓటర్లున్నారని వివరించారు. ఇంకా జిల్లా లొని 782 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, సుమారు 990 సిసి కెమెరాలు ఏర్పాటు గావిస్తున్నామని వివరించారు.
అంతేగాకుండా, జిల్లాలో 36 థిమాటిక్ పోలింగ్ కెంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
