మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత
సికింద్రాబాద్, మే30 (ప్రజామంటలు) :
మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, బంధువు టి.రవీందర్ రెడ్డి (74) శుక్రవారం మద్యాహ్నం కన్నుమూశారు. గత ఫిబ్రవరి 3 న ఉదయం కోకాపేట లోని తన ఇంటి నుంచి బేగంపేట బీజేపీ కార్యాలయానికి వస్తుండగా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. అప్పటి నుంచి మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రవీందర్ రెడ్డి శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. రవీందర్ రెడ్డి మృతిపట్ల మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి , మర్రి పురూరవరెడ్డి లు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి సనత్ నగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసినప్పుడు మర్రి శశిధర్ రెడ్డి తో కలసి రవీందర్ రెడ్డి ఎన్నికల్లో చురుకుగా పనిచేసి చెన్నారెడ్డి విజయంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సనత్ నగర్ పార్టీ కార్యాలయ ఇంచార్జీగా ప్రజలకు అవిశ్రాంతంగా సేవ చేస్తూ, దాదాపు 40 ఏండ్ల నుంచి తనతో అనుబంధం ఉందన్నారు. రవీందర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవీందర్ రెడ్డి అంత్యక్రియలు శనివారం మద్యాహ్నం జూబ్లీ హిల్స్ మహాప్రస్తానంలో జరుగుతాయని బీజేపీ నాయకులు తెలిపారు.
––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
