న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు. - ఉలిక్కిపడ్డ రైల్ కళారంగ్ కాలనీ
సమీర్ అరెస్ట్ తో భయాందోళనలో స్థానికులు
సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) :
బాంబు పేలుళ్ల కుట్రతో సంబంధం కలిగిన సూత్రధారులు దొరకడంతో సికింద్రాబాద్ లోని న్యూ బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారిలో ఒకరు ఏపీలోని విజయనగరం జిల్లా చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, మరొకరు సికింద్రాబాద్ లోని న్యూ బోయిగూడ కు చెందిన సమీర్ (25) ఉన్నాడు. ఈనెల 16న (నాలుగు రోజుల క్రితం) మఫ్టీలో వచ్చిన పదిమంది కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీ లోని నివాసం వద్ద సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం సమీర్ ఇంట్లో సోదాలు జరిపారు. అయితే తమ ఇంటికి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులు అని తెలియక గోపాలపురం పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన సమీర్ తల్లి సాబేరా, అక్క అలియా లు తమ సమీర్ ను ఎవరో తీసుకెళ్లారని ఫిర్యాదుచేశారు. తరువాత అసలు విషయం తెలియడంతో వాళ్ళు అవాక్కయ్యారు. తండ్రి చాలా ఏళ్ల క్రితం చనిపోవడంతో సమీర్ తన సొంత ఇంట్లో తల్లి సాబేరా, అక్క అలియా తో కలిసి ఉంటున్నాడు, పదవతరగతి వరకు చదివి, లిఫ్ట్ రిపేరింగ్ పని నేర్చుకొని వర్కర్ గా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. బస్తీలో ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా, తన పని తాను చేసుకుంటూ ఉండే సమీర్ ఇలాంటి దేశ విద్రోహ కార్యకలాపాలకు ఆకర్షితుడవుతాడని తాము ఊహించలేదని బస్తివాసులు అంటున్నారు.
ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన సమీర్ ఇలా చేస్తాడని ఉహించలేదని వారు పేర్కొన్నారు. ఎప్పుడు పాతబస్తీకి చెందిన పలు బ్యాచ్ లతో కలసి ఇంట్లో సమావేశం అయ్యే వారని వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు సమీర్ కుట్రపన్నాడని పోలీసులు తమతో చెప్పారని స్థానికులు తెలిపారు.
ఎప్పుడు తమ కాలనీ వాళ్ళతో సమీర్ తల్లి, సోదరి గొడవపడుతుంటారని, వారిని కాలనీ నుంచి ఖాళీ చేయించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశానికి నష్టం కలిగించే విద్రోహ చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని బస్తివాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సమీర్ తల్లి సాబేరా, సోదరి అలియా లు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్ళిపోయారని స్థానికులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
