జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు

On
జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు


సామాజిక తత్వవేత్త,యుగకర్త 
తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ 
బి ఎస్ రాములు తీవ్ర సంతాపం!
--//---
        ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు  ారాయణ  సార్ అని పిలుస్తారు. ఆయన ది  కోరుట్ల సమీపంలోని కల్లూరు  గ్రామం పక్కన గల పల్లె. దాన్ని పల్లె అని పిలుస్తారు. . అందువల్ల పల్లెమీది నారాయణ, కల్లూరు  నారాయణ అని కూడా పిలుస్తారు. ఆయన పూర్తిపేరు పండుగ నారాయణ.  ఆ పల్లె పేరు సర్పరాజ్ పల్లె అని ఎవరికీ పెద్దగా తెలియదు. వారి మృతికి తీవ్ర సంతాపం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.  

   నారాయణ ప్రజల మనిషి. 
————————————
కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలి తరం నక్సలైట్ నాయకులలో నారాయణ సార్ ఒకరు. 
మూడు నెలలుగా లివర్ అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో 
 జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ అయ్యి కోలుకున్నారు తిరిగి లీక్ కావడం తో  మేనెల 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. వారికి భార్య ఒక కొడుకు ఒక బిడ్డ.  1968 లో పయూసి చేసిన నారాయణ కొంత కాలం ప్రయివేటు బడి నడిపారు. ఆ వెంటనే  ఉద్యమంలో ేరారు.  ఆయన వయస్సు 75 ఏళ్లు .  ఈ రోజు   ుక్రవారం 16      మధ్యాహ్నం అంత్య క్రియలు . 
 పి నారాయణ చరిత్ర నిర్మాత
—————————-

       పి నారాయణ సార్ ఒక చరిత్ర నిర్మాత. నక్సలైట్ ఉద్యమం తొలి స్థానిక తొలి నాయకత్వంగా
ప్రసిద్ది చెందారు. పల్లెల్లో వేలాది పల్లె వాసుల్లో విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో వారి జ్ఞాపకాలు , చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి. ఆయన అడుగు జాడలలో నడిచిన రైతుకూలీ లు, యువతరం వారి ధైర్యాన్ని  చూసిన ప్రజలు భూస్వాములు , ఉద్యమ సీనియర్  నాయకత్వం మరిచి పోలేరు. 

  వర్గ శతృ నిర్మూలనతో ప్రారంభించి 
——————————————
 పండుగ నారాయణ సార్  వర్గ శతృ నిర్మూలనతో అనేక సంఘటనల్లో ప్రత్యక్ష గా పరోక్షంగా పాల్గొనడం .. మొదలు కొని ఎమర్జెన్నీలో రహస్య జీవితం గడిపి ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ కేంద్రం లో అధికారంలోకి రావడం తో బహిరంగ ప్రజా ఉద్యమాల నిర్మాణం లో తల మునకలయ్యారు.  విద్యార్థుల యువకుల విలేజ్ క్యాంపెయిన్ తో జగిత్యాల పల్లెలు భూస్వాములకు వ్యతిరేకంగా కదిల బారాయి. 1978 జులై 17 ఏర్పాటు చేసిన రైతుకూలీ సంఘం మహాసభ జగిత్యాల జైత్రయాత్ర గా ప్రసిద్ది పొందింది. దాని వెనక ఉన్న నిర్మాతల్లో పి నారాయణ ప్రముఖులు. జగిత్యాల జైత్రయాత్ర యాత్రతో జగిత్యాల సిరిసిల్ల తాలూకా లు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటింప బడ్డాయి.
    
నాకు స్పూర్తి నిచ్చిన వాడు
 —————————-
      నేను విప్లవోద్యమంలోకి రావడానికి స్పూర్తి నిచ్చిన పి నారాయణ మా చినమామ అల్లుడు.    సడ్డకుడుగా పరిచయం. మా శ్యామల మేనత్త కొడుకు. మాకు  1973 లో పెళ్లయ్యాక సెలవుల్లో  నారాయణ తో అనేక చర్చలు జరిగాయి. అలా భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల పట్ల ఆకర్షితుడినయ్యాను. పౌరహక్కుల నాయకుడు జాప్ లక్ష్మా రెడ్డి గారు నారాయణ సాహసాలను శతృవు నుండి తృటిలో తప్పించుకున్న సంఘటనలను చెప్పి ప్రశంసిస్తుంటే వాడు.
 
నారాయణ  వాస్తవికత దృష్టి
————————— ——-
         జగిత్యాల జగిత్యాల జైత్రయాత్ర జరిగిన ఉత్సాహం తో పార్టీ అగ్ర నాయకులు ఉత్తర తెలంగాణ, అటుతర్వాత దండకారణ్యం గెరిల్లా జోన్ ప్రతి పారించారు.  నారాయణ పల్లెలో పుట్టి పల్లెలో పెరిగాడు. నారాయణ గారిది వాస్తవిక దృష్టి. దొరలు గుంజుతున్న భూములతో సహా భూములు ఇప్పిస్తామని జగిత్యాల సభకు రమ్మని పిలుపు విని వచ్చిన రైతుకూలీలు వారు. అందువల్ల  ప్రజల చైతన్యంలో అంత సీన్ లేదని, భూములు పంచుతామంటే ఆశతో వచ్చిన ప్రజలని స్థానిక ఎన్నికల్లో పాల్గొని మన శక్తి బలం సమకూర్చుకోవాసని ఆశించారు.
 అందుకు  ా  పెద్దమామ చెన్న రాజ గంగారాం నాయకత్వంలో 1962 లో సాగించిన ఉద్యమాలతో ఊరి దొర పారి పోయి అదిలాబాద్ లో స్థిరపడి అక్కడే చనిపోయాడని  గొప్ప పోరాట స్పూర్తి.  ఆ కాలంలోనే దొరల ు ఎదిరించి ఒక బీసీని  సర్పంచ్ గా ఎన్నుకున్నారు.  ఇలానే 
పల్లెలన్నిటా ఈ సామాజిక పరిణామాలు, స్థానిక అధికార మార్పిడి జరగాలని నారాయణ గారు 
పార్టీ ముందుంచారు. 
      పార్టీ  అగ్ర నాయకత్వం స్థానికేతర నాయకత్వం.  ఈ చరిత్ర పరిణామం అర్థం చేసుకోలేదు . వారు గెరిల్లా జోన్ , ఎన్నికల బహిష్కరణ లకు ప్రాధాన్యత నిచ్చారు.. భిన్నాభిప్రాయాలు గల నారాయణ  సీనియారిటీ ను కాదని ఇతరులకు నాయకత్వం అప్పగించడంతో  కినుక వహించారు. అనేక కేసుల  కారణంగా జైలు జీవితం గడిపి 1984 ఫిబ్రవరి లో బయటకు వచ్చార
 
పార్టీ వదిలినా పాత పగలు పోలేదు. 
———————————————-
 పార్టీ వదిలినా కేసులు కొట్టేసినా  భూస్వాముల పాత పగలు పోలేదు. ఎపుడు ఎవరు చంపుతారో తెలియదు. రహస్య జీవితమే అనివార్యం అయింది. కుటుంబం ను తీసుకొని నారాయణ హైదరాబాద్ చేరుకున్నారు. సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిరోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.

 తిరిగి పల్లెకు చేరిన నారాయణ కుటుంబం
——————————————————
      సిటీలో ఉండి సాధించింది లేదు. సంపాదించింది లేదు అని కొన్నాళ్లకు తిరిగి స్వంత ఊరుకు చేరుకున్నారు. ఆయన ఉద్యమాన్ని వదిలినా , ఆయన ఆశయాలకు భిన్నంగా ఉద్యమం సాగినా ఆయనపై భూస్వామ్య, పాలక వర్గాల నిర్బంధాలు కొన సాగుతూనే వచ్చాయి.  
         
 జగిత్యాల జైత్ర యాత్ర చరిత్రలో నిలిచి వున్నంత కాలం ఆయన పేరు నిలిచి వుంటుంది
—————————————-
ఆయన అమర వీరుల జాబితాలో లేక పోవచ్చు. 
కాని నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి విత్తనాలు  వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా నాయకుడిగా  నారాయణను చరిత్ర గుర్తుంచుకుంటుంది. నారాయణ గారు  అనుకున్న 
. తీరులో ఉద్యమాలు సాగితే  గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అొదికార మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. స్థానిక పరిస్థితులు తెలియని  స్థానికేతర నాయకత్వం వల్ల తెలంగాణ దశాబ్దాలుగా నిర్బంధాల కింద నలిగి పోయిందని కొందరు సీనియర్లు భావిస్తుంటారు. 
       తనదైన చరిత్ర నిలుపుకున్న స్వంత ఆలోచనలు స్వంత వ్యక్తిత్వం గల పి నారాయణ సార్ జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి వుంటారు.
   —- బి ఎస్ రాములు 
 8331966987
16 మే 2025

Tags

More News...

Local News 

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక  జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మీడియా సమావేశం...
Read More...
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
Local News 

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు మళ్లీ ఆర్డిఓ జిల్లా కలెక్టర్ స్థాయిలోకి పోతే రైతు సమస్యలు పరిష్కారం కావు గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పేద బీద వ్యవసాయ కుటుంబాల భూ బాధితుల సమస్యలు పరిష్కారానికి ఒక మంచి దారి చూపించినాదాని, రేవంత్ రెడ్డి ఆలోచన ఒక చరిత్ర అని కొనియాడుతున్నారని జాతీయ బిసిసంక్షేమ...
Read More...
Local News 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో బుధవారం నాడు నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా మహాసభ కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ . అనంతరం  టి డబ్ల్యూ...
Read More...
Local News 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత    జగిత్యాల జూన్ 18 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు. ముదిరాజ్ కుల బాంధవుల ఇంటి దైవం శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా గురువారం నాడు హస్నాబాద్ లో గల ముదిరాజ్ ల కులదైవ పెద్దమ్మ తల్లి ఆలయానికి హాజరుకావాలని...
Read More...
Local News 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.  -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి 

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి.   -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్,  డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి  జగిత్యాల జూన్ బుధవారం 18 (ప్రజా మంటలు) విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు.  వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్...
Read More...
Local News 

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల

దశాబ్దం తర్వాత  నెరవేరుతున్న పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ  న్యాయం గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు): సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం  సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం  నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వo పది...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
Local News 

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జగిత్యాల జూన్ 19 (ప్రజా మంటలు): బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు  భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ కార్యవర్గాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ను నియమించారు. జగిత్యాల పట్టణంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పట్టణ కార్యవర్గంతో పాటు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసే రాబోయే మున్సిపల్...
Read More...
Local News 

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి.. ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకు ఫిర్యాదు    సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు):    హైదరాబాద్ సిటీలోని బోనాల జాతరకు సంబంధించి 150 డివిజన్లలోని ఆయా ఆలయాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ అచ్యుత రమేష్ బుధవారం దేవాదాయ మంత్రి కొండ సురేఖను కలసి  వినతిపత్రం ఇచ్చారు. ఒకే ఆలయానికి కొందరు రెండేసి కమిటీల...
Read More...
Local News 

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజామంటలు) : ఉద్యోగ సిబ్బంది నిరంతరంగా అంకిత భావంతో చేసిన కృషితోనే దక్షిణ మద్య రైల్వే జోన్ కు దేశంలోనే నాలుగవ స్థానం దక్కిందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. సౌత్ సెంట్రల్...
Read More...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...