జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు

On
జగిత్యాల జైత్రయాత్ర నిర్మాత కల్లూరి నారాయణ సార్ ఇక లేరు


సామాజిక తత్వవేత్త,యుగకర్త 
తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ 
బి ఎస్ రాములు తీవ్ర సంతాపం!
--//---
        ఆయన జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయనను అందరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరు  ారాయణ  సార్ అని పిలుస్తారు. ఆయన ది  కోరుట్ల సమీపంలోని కల్లూరు  గ్రామం పక్కన గల పల్లె. దాన్ని పల్లె అని పిలుస్తారు. . అందువల్ల పల్లెమీది నారాయణ, కల్లూరు  నారాయణ అని కూడా పిలుస్తారు. ఆయన పూర్తిపేరు పండుగ నారాయణ.  ఆ పల్లె పేరు సర్పరాజ్ పల్లె అని ఎవరికీ పెద్దగా తెలియదు. వారి మృతికి తీవ్ర సంతాపం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.  

   నారాయణ ప్రజల మనిషి. 
————————————
కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలి తరం నక్సలైట్ నాయకులలో నారాయణ సార్ ఒకరు. 
మూడు నెలలుగా లివర్ అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో 
 జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ అయ్యి కోలుకున్నారు తిరిగి లీక్ కావడం తో  మేనెల 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. వారికి భార్య ఒక కొడుకు ఒక బిడ్డ.  1968 లో పయూసి చేసిన నారాయణ కొంత కాలం ప్రయివేటు బడి నడిపారు. ఆ వెంటనే  ఉద్యమంలో ేరారు.  ఆయన వయస్సు 75 ఏళ్లు .  ఈ రోజు   ుక్రవారం 16      మధ్యాహ్నం అంత్య క్రియలు . 
 పి నారాయణ చరిత్ర నిర్మాత
—————————-

       పి నారాయణ సార్ ఒక చరిత్ర నిర్మాత. నక్సలైట్ ఉద్యమం తొలి స్థానిక తొలి నాయకత్వంగా
ప్రసిద్ది చెందారు. పల్లెల్లో వేలాది పల్లె వాసుల్లో విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో వారి జ్ఞాపకాలు , చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి. ఆయన అడుగు జాడలలో నడిచిన రైతుకూలీ లు, యువతరం వారి ధైర్యాన్ని  చూసిన ప్రజలు భూస్వాములు , ఉద్యమ సీనియర్  నాయకత్వం మరిచి పోలేరు. 

  వర్గ శతృ నిర్మూలనతో ప్రారంభించి 
——————————————
 పండుగ నారాయణ సార్  వర్గ శతృ నిర్మూలనతో అనేక సంఘటనల్లో ప్రత్యక్ష గా పరోక్షంగా పాల్గొనడం .. మొదలు కొని ఎమర్జెన్నీలో రహస్య జీవితం గడిపి ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ కేంద్రం లో అధికారంలోకి రావడం తో బహిరంగ ప్రజా ఉద్యమాల నిర్మాణం లో తల మునకలయ్యారు.  విద్యార్థుల యువకుల విలేజ్ క్యాంపెయిన్ తో జగిత్యాల పల్లెలు భూస్వాములకు వ్యతిరేకంగా కదిల బారాయి. 1978 జులై 17 ఏర్పాటు చేసిన రైతుకూలీ సంఘం మహాసభ జగిత్యాల జైత్రయాత్ర గా ప్రసిద్ది పొందింది. దాని వెనక ఉన్న నిర్మాతల్లో పి నారాయణ ప్రముఖులు. జగిత్యాల జైత్రయాత్ర యాత్రతో జగిత్యాల సిరిసిల్ల తాలూకా లు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటింప బడ్డాయి.
    
నాకు స్పూర్తి నిచ్చిన వాడు
 —————————-
      నేను విప్లవోద్యమంలోకి రావడానికి స్పూర్తి నిచ్చిన పి నారాయణ మా చినమామ అల్లుడు.    సడ్డకుడుగా పరిచయం. మా శ్యామల మేనత్త కొడుకు. మాకు  1973 లో పెళ్లయ్యాక సెలవుల్లో  నారాయణ తో అనేక చర్చలు జరిగాయి. అలా భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల పట్ల ఆకర్షితుడినయ్యాను. పౌరహక్కుల నాయకుడు జాప్ లక్ష్మా రెడ్డి గారు నారాయణ సాహసాలను శతృవు నుండి తృటిలో తప్పించుకున్న సంఘటనలను చెప్పి ప్రశంసిస్తుంటే వాడు.
 
నారాయణ  వాస్తవికత దృష్టి
————————— ——-
         జగిత్యాల జగిత్యాల జైత్రయాత్ర జరిగిన ఉత్సాహం తో పార్టీ అగ్ర నాయకులు ఉత్తర తెలంగాణ, అటుతర్వాత దండకారణ్యం గెరిల్లా జోన్ ప్రతి పారించారు.  నారాయణ పల్లెలో పుట్టి పల్లెలో పెరిగాడు. నారాయణ గారిది వాస్తవిక దృష్టి. దొరలు గుంజుతున్న భూములతో సహా భూములు ఇప్పిస్తామని జగిత్యాల సభకు రమ్మని పిలుపు విని వచ్చిన రైతుకూలీలు వారు. అందువల్ల  ప్రజల చైతన్యంలో అంత సీన్ లేదని, భూములు పంచుతామంటే ఆశతో వచ్చిన ప్రజలని స్థానిక ఎన్నికల్లో పాల్గొని మన శక్తి బలం సమకూర్చుకోవాసని ఆశించారు.
 అందుకు  ా  పెద్దమామ చెన్న రాజ గంగారాం నాయకత్వంలో 1962 లో సాగించిన ఉద్యమాలతో ఊరి దొర పారి పోయి అదిలాబాద్ లో స్థిరపడి అక్కడే చనిపోయాడని  గొప్ప పోరాట స్పూర్తి.  ఆ కాలంలోనే దొరల ు ఎదిరించి ఒక బీసీని  సర్పంచ్ గా ఎన్నుకున్నారు.  ఇలానే 
పల్లెలన్నిటా ఈ సామాజిక పరిణామాలు, స్థానిక అధికార మార్పిడి జరగాలని నారాయణ గారు 
పార్టీ ముందుంచారు. 
      పార్టీ  అగ్ర నాయకత్వం స్థానికేతర నాయకత్వం.  ఈ చరిత్ర పరిణామం అర్థం చేసుకోలేదు . వారు గెరిల్లా జోన్ , ఎన్నికల బహిష్కరణ లకు ప్రాధాన్యత నిచ్చారు.. భిన్నాభిప్రాయాలు గల నారాయణ  సీనియారిటీ ను కాదని ఇతరులకు నాయకత్వం అప్పగించడంతో  కినుక వహించారు. అనేక కేసుల  కారణంగా జైలు జీవితం గడిపి 1984 ఫిబ్రవరి లో బయటకు వచ్చార
 
పార్టీ వదిలినా పాత పగలు పోలేదు. 
———————————————-
 పార్టీ వదిలినా కేసులు కొట్టేసినా  భూస్వాముల పాత పగలు పోలేదు. ఎపుడు ఎవరు చంపుతారో తెలియదు. రహస్య జీవితమే అనివార్యం అయింది. కుటుంబం ను తీసుకొని నారాయణ హైదరాబాద్ చేరుకున్నారు. సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిరోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.

 తిరిగి పల్లెకు చేరిన నారాయణ కుటుంబం
——————————————————
      సిటీలో ఉండి సాధించింది లేదు. సంపాదించింది లేదు అని కొన్నాళ్లకు తిరిగి స్వంత ఊరుకు చేరుకున్నారు. ఆయన ఉద్యమాన్ని వదిలినా , ఆయన ఆశయాలకు భిన్నంగా ఉద్యమం సాగినా ఆయనపై భూస్వామ్య, పాలక వర్గాల నిర్బంధాలు కొన సాగుతూనే వచ్చాయి.  
         
 జగిత్యాల జైత్ర యాత్ర చరిత్రలో నిలిచి వున్నంత కాలం ఆయన పేరు నిలిచి వుంటుంది
—————————————-
ఆయన అమర వీరుల జాబితాలో లేక పోవచ్చు. 
కాని నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి విత్తనాలు  వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా నాయకుడిగా  నారాయణను చరిత్ర గుర్తుంచుకుంటుంది. నారాయణ గారు  అనుకున్న 
. తీరులో ఉద్యమాలు సాగితే  గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అొదికార మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. స్థానిక పరిస్థితులు తెలియని  స్థానికేతర నాయకత్వం వల్ల తెలంగాణ దశాబ్దాలుగా నిర్బంధాల కింద నలిగి పోయిందని కొందరు సీనియర్లు భావిస్తుంటారు. 
       తనదైన చరిత్ర నిలుపుకున్న స్వంత ఆలోచనలు స్వంత వ్యక్తిత్వం గల పి నారాయణ సార్ జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి వుంటారు.
   —- బి ఎస్ రాములు 
 8331966987
16 మే 2025

Tags

More News...

Local News 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో  పుణ్యశ్లోక లోకమాత రాణి  అహల్యబాయి హోల్కర్  300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు...
Read More...
Local News 

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు...
Read More...
State News  Spiritual  

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి    ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి...
Read More...
Local News  State News 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. .(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో   జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి తెలంగాణ...
Read More...
Local News 

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు* *   తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు డి. దుర్గ ప్రసాద్ జగిత్యాల మే 16(ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు. జగిత్యాల అర్బన్...
Read More...
Local News 

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు *ఈరోజు వేడుకలు ప్రారంభం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ  విశాల్ జాగరన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్.శ్రీనివాస్ తెలిపారు.శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా వైష్ణో  దేవి జాగరన్ మండల్ ఆధ్వర్యములో ప్రతి ఏటా వైభవంగా...
Read More...
Local News 

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ సికింద్రాబాద్ మే16 (ప్రజామంటలు): జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఎంటమాలాజీ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ బోయిగూడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచుకోవద్దని, డెంగ్యూ దోమలతో కలుగు ప్రాణాంతకమైన జబ్బుల గురించి స్థానికులకు వివరించారు. ప్రతివారం ఒకరోజు డ్రై డేగా పాటించి ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని...
Read More...
Local News 

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద  చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు - భోలక్ పూర్ లో ఉచిత వైద్య శిభిరం సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా వైద్యం పొందాలని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు అన్నారు. శుక్రవారం జనహిత సేవా ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, కిమ్స్...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం అభా ఐడి తో రోగుల రికార్డులు డిజిటల్ నమోదుపై అధ్యయనంస్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపి పై ఆరా... సికింద్రాబాద్ మే 16 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్(అభా) డిజిటల్ మిషన్ వర్క్ షాప్ లో భాగంగా, 18 రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రల  నోడల్ అధికారులు శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.సికింద్రాబాద్ గాంధీ...
Read More...
Local News 

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల మే 16  (ప్రజా మంటలు)2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను SC/ST/BC/OC/MINORITY విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఉపకార వేతనములు) లకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025. 2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి SC/ST/BC/OC/MINORITY విద్యార్థులు అన్ లైన్...
Read More...
Local News 

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి      జగిత్యాల మే 16 (ప్రజా మంటలు) *ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*   యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ  వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శుక్రవారం...
Read More...
Local News 

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)   బుగ్గారం మండల కేంద్రంలో శనివారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జరుగనున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా ఎస్పీ అశోక్...
Read More...