అనంత లోకాల్లోకి దూసుకెళ్లిన ధ్రువతార – రామోజీ రావు   తెలుగు పత్రికారంగానికి చిరస్మరణీయుడు

On
అనంత లోకాల్లోకి దూసుకెళ్లిన ధ్రువతార – రామోజీ రావు   తెలుగు పత్రికారంగానికి చిరస్మరణీయుడు

అనంత లోకాల్లోకి దూసుకెళ్లిన ధ్రువతార – రామోజీ రావు  
తెలుగు పత్రికారంగానికి చిరస్మరణీయుడు

హైదరాబాద్ జూన్ 09:

తెలుగు పత్రికా రంగాన దృవతారగా వెలిగిన చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు, ఈ ప్రపంచాన తన యాత్ర ముగించుకొని, ఆయన నమ్మే ఆపై లోకాలకో, స్వర్గానికో మారెక్కడికో ఎగిరిపోయాడు. ఆయన మృతికి  తెలంగాణ జాతీయ దినపత్రిక “ప్రజా మంటలు” కుటుంబం, రామోజీ రావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతుంది.

 

సరిగ్గా యాబై ఏళ్ల క్రితం, మొన్నటి వార్తలను మధ్యాహ్నానికి మోసుకొచ్చే తెలుగు పత్రికలకు పోటీగా, ఉదయం ఆరు గంటలకే ఇంటి ముంగిట తాజా వార్తల సమాహారాన్ని అందించే పత్రికగా, ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖపట్నంలో తాను ప్రారంభించిన “ఈనాడు” దినపత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయమైన రామోజీ రావు, నాలుగైదేళ్ల తరువాత హైదరాబాద్ కు తన మఖాం మార్చి, పత్రికారంగానికి ఉషోదయం కల్పించాడు.  తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన రామోజీరావు, సమగ్ర తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేస్తున్న ప్రయత్నం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లు లేదు.

 

పత్రికా రంగాననే కాకుండా సినిమా రంగంలో కూడా నూతనోత్సాహాన్ని నింపే కొత్త కథలకు, కథనాలకు, యువకులకు ప్రత్సాహం అందించిన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి రామోజీరావు. మయూరి, ప్రతిధ్వని, చిత్రం లాంటి వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను నిర్మించారు. తెలంగాణ పోరాట చరిత్రను, ఆనాటి నిజాం పాలంలోని పైశాచికత్వాన్ని తెలిపే “విముక్తి కోసం” లాంటి సినిమాలను పంపిణీ చేసిన రామోజీ రావు సినిమారంగానికి ఎనలేని సేవలు అందించారు.  

 

తెలుగు పత్రికా భాషను మార్చి, కొత్త పదాలకు, కొత్త సొగసులకు  రూపం దిద్దాడు.  పత్రికా విలేఖరులకు శిక్షణ ఇస్తూ, భాష పై పట్టు ఎలా సాధించాలో నేర్పిన సంస్థ ఈనాడు అధినేత. పత్రికారంగంలో వచ్చిన ప్రతి మార్పును స్వాగతిస్తూ, జిల్లా కేంద్రాన్ని ప్రచురణ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని, జిల్లా వార్తలకు ప్రత్యేక సంచికను అందించే సరికొత్త ప్రయోగం చేసి, గ్రామీణ, రాజకీయ, సామాజిక వార్తల ప్రాధాన్యాన్ని పెంచి, సామాన్య ప్రజలకు కూడా పత్రికను దగ్గర చేశాడు.

 

పెట్టుబడిదారు రాజకీయాలను ప్రోత్సహించినా, పత్రిక నిండా వామపక్ష భావాలు నిండిన మేధావులకు పెద్ద పేట వేశారు. వామ పక్ష పార్టీల వార్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వకున్నా, మేధావులకు ఆశ్రయం ఇస్తూ, ఆ తరువాతి కాలంలో వచ్చిన అనేక పత్రికలకు సంపాదకులను అందించిన కర్మాగారం ఈనాడు అని గుర్తుచేసుకోక తప్పదు. ఈనాడు గొప్పగా చెప్పుకొంటున్న అనేక మంది పాత్రికేయులు, ఇక్కడి నుండి వచ్చిన వారే.

 

రాజకీయంగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నా, తెలుగు రాష్ట్రాలలో బహు విధమైన పరిశ్రమలను స్థాపించడంలో, వేలాది మందికి ఉపాధి కల్పించడంలో, ఇటీవలి కాలంలో రామోజీరావు ను మించిన వ్యక్తి లేదనడం అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే ఎంతో కీర్తి గడించిన “రామోజీ ఫిల్మ్ సిటీ” నిర్మాణ ఆలోచన తెలుగు వారందరినీ గర్వించే లా చేసింది. రాజకీయ కారణాలతో ఎన్ని సమస్యలు వచ్చినా, తన ఆలోచనలను అమలు చేసి, హైదరాబాద్ కే  కాకుండా, దేశానికే గర్వకారణమైన “రామోజీ ఫిల్మ్ సిటీ” నిర్మించి, నిర్వహించడం ఎంతో గొప్ప విషయం.

 

దేశంలో అప్పుడప్పుడే టివి రంగం విస్తరిస్తున్న తరుణంలో ఈటీవీ ని ప్రారంభించి, 16 భాషలలొ విస్తరించిన ఘనుడు. టి వి రంగానికి పోటీగా వస్తున్న డిజిటల్ వ్యవస్థను కూడా అందిపుచ్చుకొని ఈటీవీ డిజిటల్, ఈటీవీ భారత్ లతో పాటు, ఈటీవీ విన్ మొబైల్ ఆప్ లాంటి మీడియా సంస్థలతో ప్రపంచ తెలుగు ప్రజలకు తెలుగు భాషను, నూడికారాన్ని అందిస్తూ, దేశంలోని అన్నీ ప్రాంతాల వార్తలను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్న మొనగాడుగా చెప్పుకోవాలి. లాంటి మహానుభావుడు ఈనాడు భౌతికంగా దూరం అయినా, ఆయన ఆలోచనలు ఎప్పుడు తెలుగు వారితోనే ఉంటాయి.

    

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...