ఓపిగ్గా ఉండండి - నాపై కుట్రలో భాగంగానే టీబీజీకేఎస్‌ నుండి తొలగింపు - కల్వకుంట్ల కవిత

On
ఓపిగ్గా ఉండండి - నాపై కుట్రలో భాగంగానే టీబీజీకేఎస్‌ నుండి తొలగింపు - కల్వకుంట్ల కవిత

పదేళ్లలో ఎన్నో సాధించాం.
కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేశాం 
- కల్వకుంట్ల కవిత లేఖ

హైదరాబాద్ ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):

టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు స్థానం నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించడం పట్ల కార్మికుల్లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కోశాధికారి వెంకట రాజీనామా చేసి,గోదావరిఖనిలో పత్రికా సమావేశం నిర్వహించారు.

అమెరికాలో ఉన్న కవిత, ఈ వార్త తెలిసి, తన వర్గం నాయకులను, కార్మికులను సంనయనంగా ఉండాలని, మనం ఏది చేసినా, BRS పార్టీ కొరకే అని, సీనియర్ కార్మిక నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని స్వాగతిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా నుండి కల్వకుంట్ల కవిత తన శ్రేణులకు సుదీర్ఘమైన లేఖరాస్తు, గత పదేళ్లలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. 

ఆ లేఖ పూర్తి పాఠం కింద చదవండి.

తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది...

అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా...

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్లకాలంలో టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. బుధవారం హైదరాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌ కు శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పని చేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డితో పాటు సీనియర్‌ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌ లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తున్నది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే సంస్థలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్‌ గారిని ఒప్పించి తిరిగి డిపెండెంట్‌ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టాచెమ్మాస్‌ బంద్‌ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించాను. కార్మికులు తీసుకునే రూ.10 లక్షలకు పైబడిన హౌసింగ్‌ లోన్‌ పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్‌ కు ఉచిత కరెంట్‌, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌ పది రెట్లు పెంచేందుకు పాటు పడినాను. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీ రీయింబర్స్‌ మెంట్‌ సదుపాయం తీసుకువచ్చాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ఆప్షనల్‌ సెలవు మంజూరు చేయించాను. కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్‌ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పింపజేశాను. క్యాడర్‌ స్కీం, మరణించిన లేదా మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్‌ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశాను.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్‌ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రిగారైన కేసీఆర్‌ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్‌ గారికి రాసిన ఆ లేఖను లీక్‌ చేశారు. ఆ లేఖను లీక్‌ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్‌ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు.

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తాను. కార్మికులకు ఏ చిన్నకష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను.

ధన్యవాదములతో...

మీ కల్వకుంట్ల కవిత

Tags

More News...

Local News 

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి భక్తిశ్రద్దలు, సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలి  నిబంధనలు పాటించకపోతే చర్యలు   సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు): పండుగలు ఉత్సవాలను మత  సామరస్యానికి ప్రతీకగా  నిర్వహించుకోవాలని గాంధీనగర్ డివిజన్ ఏసిపి యాదగిరి అన్నారు.  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ  ముదిరాజ్ సంఘం ఆవరణలో సోమవారం రాత్రి పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన...
Read More...
Local News  State News 

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి.. సికింద్రాబాద్ లో రైల్వే ప్రమోటి అధికారుల సమాఖ్య సమావేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) : భారతీయ రైల్వే దేశానికి జీవనాడి అని, ఇందులో ప్రమోటి అధికారులు వెన్నమూక లాంటి వారని దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం సికింద్రాబాద్ రైలు కళారంగ్ లో భారతీయ రైల్వే ప్రమోటి...
Read More...
Local News  State News  Crime 

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం సైబర్ క్రైమ్, జిల్లా పోలీస్ ఆద్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ - ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్. - సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):  జిల్లాలోని కోరుట్లకు చెందిన బాదితుడు  బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు తో సైబర్ మోసానికి గురై...
Read More...
Local News 

చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం.. సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) : చిలకలగూడ హనుమాన్ టెంపుల్ నూతన ట్రస్ట్ కమిటీ నియమించబడింది. కొత్త కమిటీ కార్యవర్గం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్  ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ  చైర్మన్ గా చక్రధర్, కమిటీ మెంబర్స్ గా హరిబాబు, బ్రహ్మాజీ, మన్మధ కుమార్,లక్ష్మి, క్రాంతి కుమార్ లతో...
Read More...
State News 

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి గాంధీ ఆవరణలో నానాటికి పెరుగుతున్న యాచకుల చావులు సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని యాచకుల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆసుపత్రి ఎదురుగా నిత్యం కొందరు పెట్టే అన్నదానంలో  ఫుడ్డు తింటూ ఇక్కడే ఏండ్ల తరబడిగా తిష్ట వేసుకొని ఉంటున్న యాచకులు అనారోగ్యం బారిన పడి కొందరు, వయోభారం, మద్యానికి...
Read More...
Local News 

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు, మెట్టుపల్లి ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   హైదరాబాద్ ఫిషరీష్ కమిషనర్ ఆఫీస్ లో  తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను మెట్ పల్లి  సహకార సంఘం అధ్యక్షులు పర్రె శంకర్, సెక్రెటరీ ఆర్మూర్ గంగన్న కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.వీరితోపాటు, డైరెక్టర్లు పారిపెల్లి కిషన్, ఆర్మూర్ రంజిత్, మరియు
Read More...
Local News 

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ 31 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) :  కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 31 కుటుంబాలకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్...
Read More...
Local News 

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 21ప్రజా మంటలు  మల్యాల మండలంలో తాటి పెళ్లి, బల్వంతపూర్ గ్రామాలలో  విద్యార్థులకు బీజేపీ నాయకులు,మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా విద్యా అధికారి రాము  జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి లు మోదీ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివే సరస్వతీ పుత్రులందరికి   కేంద్రమంత్రి బండి సంజయ్...
Read More...
Local News 

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం, ఇబ్రహీంపట్నం ఆగస్టు 21( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామానికి మెట్టుపల్లి వెళ్లడానికి వర్షకొండ, డబ్బ నుండి బస్సు సౌకర్యం ఉన్నది కానీ, ఇబ్రహీంపట్నం మండలానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదని,వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ ను ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు,...
Read More...
Local News 

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు) అర్బన్ హౌసింగ్  ఇందిరమ్మ కాలనీ (నూకపల్లి)లో బస్తీ దావకాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ లను ప్రారంభోత్సవం చేసి మరియు 9 లక్షలతో విధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంగన్వాడి పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు. *ఎమ్మెల్యే మాట్లాడుతూ*  అర్హులు...
Read More...
Local News 

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు  హెల్త్ కార్డులు,

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు  హెల్త్ కార్డులు, మెటుపల్లి ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు జారిచేయబడ్డ హెల్త్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మెట్టుపల్లి  బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు 2025-26 సంవత్సరానికి సంబందించిన హెల్త్ కార్డుల్ని పంపిణీ చేసారు....
Read More...
Local News 

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.   ఇబ్రహీంపట్నం ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా పనిచేస్తున్న రమేష్ కు ఉత్తమ అవార్డు ను ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.  గురువారం రోజున ఇబ్రహీంపట్నం...
Read More...