గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు పూర్తి చేయాలి  సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా

On
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు పూర్తి చేయాలి   సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా


జగిత్యాల ఆగస్టు 21 ( ప్రజా మంటలు)
* వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ 

ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు, సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ  డిఎస్పీలు, సి.ఐ లతో  జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎస్పీ  మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ ఉత్సవాలు ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎస్.ఐ లు, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండపాల్లో, శోభాయాత్ర లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు.

ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపం దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ శోభయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన  స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయoతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.


*వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా లో  పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం*

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ  తెలిపారు.

సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టు ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను  వాట్సాప్ మరియు ఫేస్బుక్ ల ద్వారా  చేసిన వ్యక్తులపై  కేసులు నమోదు చేయడం తో పాటు బైండోవర్ చేయడం జరిగింది అని తెలిపారు. కావున సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టుల పై  ఎలాంటి అనుమానాలైనా సందేహాలైన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని ప్రజా భద్రత ,లా & ఆర్డర్  సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం  జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు.

ఈ యొక్క సమావేశం లో డి ఎస్పీలు రఘు చందర్, రాములు ,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సి.ఐ లు, అనిల్ కుమార్,సుధాకర్ ,కరుణాకర్ , పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు - గాంధీనగర్ ఏసీపీ యాదగిరి భక్తిశ్రద్దలు, సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలి  నిబంధనలు పాటించకపోతే చర్యలు   సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు): పండుగలు ఉత్సవాలను మత  సామరస్యానికి ప్రతీకగా  నిర్వహించుకోవాలని గాంధీనగర్ డివిజన్ ఏసిపి యాదగిరి అన్నారు.  గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడ  ముదిరాజ్ సంఘం ఆవరణలో సోమవారం రాత్రి పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన...
Read More...
Local News  State News 

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి..

భారతీయ రైల్వే దేశానికి జీవనాడి.. సికింద్రాబాద్ లో రైల్వే ప్రమోటి అధికారుల సమాఖ్య సమావేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) : భారతీయ రైల్వే దేశానికి జీవనాడి అని, ఇందులో ప్రమోటి అధికారులు వెన్నమూక లాంటి వారని దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం సికింద్రాబాద్ రైలు కళారంగ్ లో భారతీయ రైల్వే ప్రమోటి...
Read More...
Local News  State News  Crime 

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం సైబర్ క్రైమ్, జిల్లా పోలీస్ ఆద్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ - ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్. - సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):  జిల్లాలోని కోరుట్లకు చెందిన బాదితుడు  బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు తో సైబర్ మోసానికి గురై...
Read More...
Local News 

చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం..

చిలకలగూడ హన్మాన్ టెంపుల్ కమిటీ ప్రమాణ స్వీకారం.. సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) : చిలకలగూడ హనుమాన్ టెంపుల్ నూతన ట్రస్ట్ కమిటీ నియమించబడింది. కొత్త కమిటీ కార్యవర్గం సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్  ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ  చైర్మన్ గా చక్రధర్, కమిటీ మెంబర్స్ గా హరిబాబు, బ్రహ్మాజీ, మన్మధ కుమార్,లక్ష్మి, క్రాంతి కుమార్ లతో...
Read More...
State News 

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి

ఆగని అనాధ చావులు - ఒక్కరోజే నలుగురు గుర్తు తెలియని వ్యక్తుల మృతి గాంధీ ఆవరణలో నానాటికి పెరుగుతున్న యాచకుల చావులు సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని యాచకుల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆసుపత్రి ఎదురుగా నిత్యం కొందరు పెట్టే అన్నదానంలో  ఫుడ్డు తింటూ ఇక్కడే ఏండ్ల తరబడిగా తిష్ట వేసుకొని ఉంటున్న యాచకులు అనారోగ్యం బారిన పడి కొందరు, వయోభారం, మద్యానికి...
Read More...
Local News 

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు,

తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను కలిసిన గంగపుత్ర సంఘ సభ్యులు, మెట్టుపల్లి ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   హైదరాబాద్ ఫిషరీష్ కమిషనర్ ఆఫీస్ లో  తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ను మెట్ పల్లి  సహకార సంఘం అధ్యక్షులు పర్రె శంకర్, సెక్రెటరీ ఆర్మూర్ గంగన్న కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.వీరితోపాటు, డైరెక్టర్లు పారిపెల్లి కిషన్, ఆర్మూర్ రంజిత్, మరియు
Read More...
Local News 

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ 31 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) :  కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 31 కుటుంబాలకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్...
Read More...
Local News 

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

నరేంద్ర మోడీ కానుకగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 21ప్రజా మంటలు  మల్యాల మండలంలో తాటి పెళ్లి, బల్వంతపూర్ గ్రామాలలో  విద్యార్థులకు బీజేపీ నాయకులు,మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా విద్యా అధికారి రాము  జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి లు మోదీ కానుకగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివే సరస్వతీ పుత్రులందరికి   కేంద్రమంత్రి బండి సంజయ్...
Read More...
Local News 

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం,

మెట్టుపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం, ఇబ్రహీంపట్నం ఆగస్టు 21( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )  ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామానికి మెట్టుపల్లి వెళ్లడానికి వర్షకొండ, డబ్బ నుండి బస్సు సౌకర్యం ఉన్నది కానీ, ఇబ్రహీంపట్నం మండలానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదని,వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ ను ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు,...
Read More...
Local News 

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అర్బన్ హౌసింగ్ కాలనీలో బస్తీ దవాఖాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు) అర్బన్ హౌసింగ్  ఇందిరమ్మ కాలనీ (నూకపల్లి)లో బస్తీ దావకాన, అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ లను ప్రారంభోత్సవం చేసి మరియు 9 లక్షలతో విధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంగన్వాడి పిల్లలకు బాలామృతం పంపిణీ చేశారు. *ఎమ్మెల్యే మాట్లాడుతూ*  అర్హులు...
Read More...
Local News 

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు  హెల్త్ కార్డులు,

అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు  హెల్త్ కార్డులు, మెటుపల్లి ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా న్యాయవాదులకు జారిచేయబడ్డ హెల్త్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మెట్టుపల్లి  బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు 2025-26 సంవత్సరానికి సంబందించిన హెల్త్ కార్డుల్ని పంపిణీ చేసారు....
Read More...
Local News 

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.

ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత కు సన్మానం.   ఇబ్రహీంపట్నం ఆగస్టు 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా పనిచేస్తున్న రమేష్ కు ఉత్తమ అవార్డు ను ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.  గురువారం రోజున ఇబ్రహీంపట్నం...
Read More...