ఓపిగ్గా ఉండండి - నాపై కుట్రలో భాగంగానే టీబీజీకేఎస్‌ నుండి తొలగింపు - కల్వకుంట్ల కవిత

On
ఓపిగ్గా ఉండండి - నాపై కుట్రలో భాగంగానే టీబీజీకేఎస్‌ నుండి తొలగింపు - కల్వకుంట్ల కవిత

పదేళ్లలో ఎన్నో సాధించాం.
కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేశాం 
- కల్వకుంట్ల కవిత లేఖ

హైదరాబాద్ ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):

టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు స్థానం నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించడం పట్ల కార్మికుల్లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కోశాధికారి వెంకట రాజీనామా చేసి,గోదావరిఖనిలో పత్రికా సమావేశం నిర్వహించారు.

అమెరికాలో ఉన్న కవిత, ఈ వార్త తెలిసి, తన వర్గం నాయకులను, కార్మికులను సంనయనంగా ఉండాలని, మనం ఏది చేసినా, BRS పార్టీ కొరకే అని, సీనియర్ కార్మిక నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని స్వాగతిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా నుండి కల్వకుంట్ల కవిత తన శ్రేణులకు సుదీర్ఘమైన లేఖరాస్తు, గత పదేళ్లలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. 

ఆ లేఖ పూర్తి పాఠం కింద చదవండి.

తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది...

అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా...

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్లకాలంలో టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. బుధవారం హైదరాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌ కు శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పని చేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డితో పాటు సీనియర్‌ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్‌ లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తున్నది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే సంస్థలో డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్‌ గారిని ఒప్పించి తిరిగి డిపెండెంట్‌ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టాచెమ్మాస్‌ బంద్‌ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించాను. కార్మికులు తీసుకునే రూ.10 లక్షలకు పైబడిన హౌసింగ్‌ లోన్‌ పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్‌ కు ఉచిత కరెంట్‌, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌ పది రెట్లు పెంచేందుకు పాటు పడినాను. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీ రీయింబర్స్‌ మెంట్‌ సదుపాయం తీసుకువచ్చాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ఆప్షనల్‌ సెలవు మంజూరు చేయించాను. కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్‌ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పింపజేశాను. క్యాడర్‌ స్కీం, మరణించిన లేదా మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్‌ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశాను.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్‌ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రిగారైన కేసీఆర్‌ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్‌ గారికి రాసిన ఆ లేఖను లీక్‌ చేశారు. ఆ లేఖను లీక్‌ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్‌ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు.

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తాను. కార్మికులకు ఏ చిన్నకష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను.

ధన్యవాదములతో...

మీ కల్వకుంట్ల కవిత

Tags

More News...

State News 

ఓపిగ్గా ఉండండి - నాపై కుట్రలో భాగంగానే టీబీజీకేఎస్‌ నుండి తొలగింపు - కల్వకుంట్ల కవిత

ఓపిగ్గా ఉండండి - నాపై కుట్రలో భాగంగానే టీబీజీకేఎస్‌ నుండి తొలగింపు - కల్వకుంట్ల కవిత పదేళ్లలో ఎన్నో సాధించాం. కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేశాం  - కల్వకుంట్ల కవిత లేఖ హైదరాబాద్ ఆగస్ట్ 21 (ప్రజా మంటలు): టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు స్థానం నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించడం పట్ల కార్మికుల్లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కోశాధికారి వెంకట రాజీనామా చేసి,గోదావరిఖనిలో...
Read More...
Local News  State News 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవిత తొలగింపుకు నిరసనగా రాజీనామాలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవిత తొలగింపుకు నిరసనగా రాజీనామాలు టీబీజీకే ఎస్ సెంట్రల్ ట్రెజరర్ వెంకట్ సహా వందమందికి పైగా రాజీనామా గోదావరిఖని ఆగస్ట్ ₹21 (ప్రజా మంటలు):   తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కు కేంద్ర కోశాధికారి పదవికి వెంకట్ రాజీనామా చేశారు.  TBGKS గౌరవ అధ్యక్షురాలుగా పది సంవత్సరాలు ఉన్న కవితక్క ను జనరల్ బాడీ మీటింగ్  నిర్వహించకుండానే గౌరవమీడియాతో...
Read More...
Local News 

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూ డిల్లీ ఆగస్ట్ 20: బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చేసిన ఆరోపణలపై సిట్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలైంది 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు):   ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామాన్ని ఎంపీడీఓ సలీం బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనవారు ఇప్పటికీ ఇంకా ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించి, నిర్ణిత సమయంలో...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ. ఇబ్రహీంపట్నం ఆగస్టు 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల్ తాసిల్దార్ కార్యాలయంనుఅదనపు కలెక్టర్  మరియు ఆర్డీవో మెట్పల్లి  తనిఖీ చేశారు, భూ భారత్ కి సంబంధించిన ఫైల్ వెరిఫై చేసి, త్వరగా పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేసిసారు. కార్యాలయ సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి,  గోదుర్ గ్రామంలో గల రాజరాజేశ్వర...
Read More...
Local News  State News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి  వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 20 (ప్రజామంటలు) : ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న ,దివంగత రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను బన్సీలాల్ పేట్, బేగంపేట్, అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ...
Read More...
Local News  Crime  State News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బోడ రవి - బోడ ప్రమీల దంపతులిద్దరూ శనివారం 16వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు కూతురు ఫిర్యాదు చేసింది. అదృశ్యం అయిన వారి కూతురు అంబటి మీనాక్షి, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు...
Read More...
Local News 

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 20 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు...
Read More...
National  Opinion  State News 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా? 

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?  130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చడానికేనా?  రాష్ట్ర ప్రభుత్వాలు ఇక గవర్నర్ చేతిలో కీలుబొమ్మలేనా? న్యూ ఢిల్లీ ఆగస్ట్ 20:130వ సవరణ బిల్లు ఆర్టికల్ 75 (కేంద్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), ఆర్టికల్ 164 (రాష్ట్ర మంత్రులకు సంబంధించిన నిబంధనలు), మరియు ఆర్టికల్ 239AA (దిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన నిబంధనలు)లలో...
Read More...
Local News 

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు భీమదేవరపల్లి, ఆగస్టు 20 ప్రజామంటలు :  ముల్కనూర్ నూతన ఎస్సైగా గీసుకొండ పోలీస్ సషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రాజు రానున్నారు.భీమదేవరపల్లి మండలంలో గత రెండున్నర సంవత్సరాలుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నండ్రు సాయిబాబును వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు సాధారణ బదిలీలలో  భాగంగా బదిలీ అయ్యారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ...
Read More...
Local News 

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 20 (ప్రజామంటలు): ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ లో దోమల అవగాహన ర్యాలీ నిర్వహించారు.  దోమలతో కలుగు వ్యాధులు,  వాటి వ్యాప్తి, నివారణ పై స్థానికులకు అవగాహన కల్పించారు . ర్యాలీలో గాంధీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్  డాక్టర్...
Read More...
National  Filmi News  State News 

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత  వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు పబ్లిక్ పాలసీ ముసాయిదాను సమర్పించండి - కోర్ట్ ఆదేశాలు  సినిమాల్లో మహిళలకు సమానత్వ చట్టం పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత (intersectional) వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు లో న్యాయమూర్తులు మౌఖిక సూచన చేశారు వినోద పరిశ్రమలో మహిళల రక్షణ కోసం సమానత్వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సంబంధితిత" అంశాలను కూడా...
Read More...