మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు
జగిత్యాల ఆగస్ట్ 20 (
ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి దేశంలో పార్టీ ఫిరాయింపు చట్టాన్ని రూపొందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ .
కలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ఆనాటి ప్రధాని దేశ సమగ్రత సమైక్యత కొరకు పాటుపడుతున్న సందర్భంగా బలి కావడం ఆ పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని యావత్ ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నవ తరానికి యువతకు ప్రాధాన్యత కల్పించే విధంగా రూపకల్పన చేశారు
భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పింప చేయడానికి భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడే అడుగులు వేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుంది
దేశంలోని కోట్లాదిమంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింపిప చేయడానికి ఆనాడే సాన్ ఫిట్రోడను సలహాదారుడిగా నియామకం చేసుకొని నాంది పలకడం జరిగింది
అదేవిధంగా దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా 21 సంవత్సరాల వరకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదింపు చేసి 18 సంవత్సరాల ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో పాత్ర వహించే విధంగా మార్పు తీసుకురావడం జరిగింది అంటే రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు
రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా ఆనాటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలను అనుగుణంగా ప్రజాస్వామ్య హక్కులు నిలబెట్టే విధంగా పార్టీ ఫిరాయింపులను అరికట్టడం కొరకు దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపికైనటువంటి అభ్యర్థి అదే పార్టీలో కొనసాగే విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో రాజీవ్ గాంధీ రూపొందించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది
స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా గ్రామీణ ప్రాంతమే కానీ పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటు నిధులు కూడా సమకూర్చబడాలనే ఆలోచనతోని ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి మనకు కేంద్రం నుండి లభించే గ్రాండ్స్ అన్నిటికీ రూపకల్పన చేసింది రాజీవ్ గాంధీ యే.
బలహీన వర్గాలకు స్థానిక సంస్థలలో 33% ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా మహిళలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా చట్టంలో మార్పులు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ కి దక్కుతుంది
అటువంటి మహాత్ముడు ప్రపంచ శాంతిని కోరడంలో భాగంగా శ్రీలంక మన పోరుగు దేశంలో శాంతిని నెలకొల్పాలని తపనతోని తీసుకున్న చర్యలతో ఏ విధంగా కలుస్తాను ఉగ్రవాదులు ఆనాడు ఇందిరా గాంధీ ని బలి తీసుకోవడం జరిగిందో అదే విధంగా శ్రీలంక ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని బలి తీసుకోవడం జరిగింది
దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగాలు చేశారు కానీ దేశ స్వాతంత్ర అనంతరం ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తులు కేవలం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు మాత్రమే.
అటువంటి త్యాగమూర్తులు మనకు ఆదర్శం కావడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలి
ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కార్యరూపం దాల్పింపచేయడమే మన వంతు బాధ్యత భావించాలి
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
అపాయం ఉన్న లెక్కచేయకుండా దేశ సమగ్రతకు సమైక్యతకు దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనిది
రాజీవ్ గాంధీ ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలని కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా రాణిస్తుంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతోని కంప్యూటర్ యుగం యొక్క వ్యవస్థను సంస్కరణ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే గుర్తించారు
రాబోయే రోజులలో భారతదేశ దేశాలకు దీటుగా ఉండాలని అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఆ కమ్యూనికేషన్ వ్యవస్థతో భారతదేశం అగ్రగామిగా ఉన్నది
ఈరోజు గ్రామీణ ప్రాంతం స్థానిక ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లకు పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామపంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్లాలని చట్టాన్ని చేసి అధికారమిచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు
బి ఆర్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ
ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి ఆరోజు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు భారతదేశ ప్రజలకు రైతాంగానికి గొప్ప గొప్ప ప్రాజెక్టులు శ్రీశైలం , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు రూపకల్పన చేసిన గొప్ప నాయకులు
ఇందిరా గాంధీ గరీబ్ హటావో రాజీవ్ గాంధీ యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థను ఇతర దేశాలకు దీటుగా భారతదేశం ఉండే విధంగా రూపకల్పన చేశారు
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివను అన్నారు.
జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ కాంగ్రెస్ నాయకులు బండా శంకర్, మాజీ కౌన్సిలర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)